గమనిక:
గతంలో నేను వ్రాసిన టపా పై మితృలు రహ్మత్తుల్లా గారి స్పందనకు ప్రతిస్పందనగా ఈ టపా పోస్ట్ చేసాను. మీ అభిప్రాయాలు తెలపండి.
రహ్మత్తుల్లా గారూ,
తొలూత మీ స్పందనకు కృతజ్నతలు. ఇక మీ కమెంట్ పై నా స్పందనకు వస్తున్నాను
//తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్//
ఇది నిజంగా నాకో వార్తే . ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. కాని ఎన్.టి.ఆర్ మొండిగటం. ఆయన ఈ పని చేసాడంటే నమ్మలేకున్నాను
//.అవతలి వ్యక్తి సహించడు అని తెలిసినప్పుడు మరో మార్గం వెతుక్కోవటం మంచిది//
మహాత్ముడు అవలంభించిన అహింశా మార్గాన్ని కూడ కొందరు సహించ లేక పోయారు. అందుకని మహాత్ముడు కూడ మరో మార్గం వెతుక్కుని ఉంటే స్వాతంత్ర్యం వచ్చేదా సచ్చేదా?
//.ఇలాంటి పరిస్థితిలో//
జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మావోలు పెట్రేగి పోతున్నారా? 144 అమల్లో ఉందా? షూట్ అట్ సైట్ అమల్లో ఉందా? ఏమండి కథలు చెబుతున్నారు. కే.సి.ఆర్, టి,ఆర్.ఎస్ లకు వై.ఎస్. ఎప్పుడో కు.ని ఆపరేషన్ చెయ్యించారు. ఇక అక్కడి ప్రజల మనో భావం అంటారా? అక్కడి మనోభావం విభజనకు అనుకూలంగా ఉండి ఉంటే కే.సి.ఆర్ ని తెలంగాణా కావాలో వద్దో ఓటింగ్ నిర్వహించమని డిమాండ్ చెయ్యమనండి. నేను ఒక విలేకరిగా ఎన్నో దర్నాలు, నిరసనలు, దగ్గరాగా ఉండి చూసినవాడ్ని, ఈ కార్యక్రమాలు చూసి సామాన్య జనం ఏమనుకుంటారో? ఈ రాజకీయ నాయకులు జనాన్ని ఎలా తోలుకొస్తారో కూడా నాకు తెలుసు
//దగ్గరకుపోయి ఓదార్చే బదులు//
రాజ్యాంగంతో పని లేదా అండి. రాజ్యాంగం ఎవరన్నా ఎక్కడన్నా స్వేచ్చగా తిరగొచ్చని చెబుతూంది. వాక్ స్వాతంత్ర్యం ఉందని చెబుతూంది. ఒక మహా నేత కుమారుడికే అక్కరకు రాని రాజ్యాంగ సూత్రాలు ఉత్తుత్తే కాగితాల మీద మాత్రం ఎందుకండి. కే.సి.ఆర్ కాంగ్రెస్ లో చేరీ పోతే రాజ్యాంగ సవరణ చేసి ఆ రెండు హక్కులకు మంగళం పాడమనండి
//మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.//
ఎంత గొప్ప సలహా ఇచ్చారండి. ఏం అక్కడనుండి వారి ఇళ్ళల్లో నుండి ఒక భిక్షా పాత్ర తెప్పించి అందులో నోట్ల కట్త వేసి కొరియర్ చేసినా సరిపోతుంది గా.. ఇక్కడ డబ్బు కాదండి ముఖ్యం. ఆత్మీయత,ఆప్యాయత్త నిండిన స్పర్శ, ఓదార్పులే ముఖ్యం
//ఇక జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.//
నాటి అక్బర్ చక్రవర్తి దేశాన్ని పర్కానాలుగా విభజిస్తే ఎన్.టి.ఆర్ మండలాలుగా విభజించి పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజలకు దగ్గరగా తెచ్చారు. జోనల్ ఆఫీసులు ఏర్పడాలని డిమాండ్ చెయ్యండి. మేము సైతమ్ మీతో కలిసి పోరాడతాం
//వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు//
సమైఖ్య రాష్ఠ్ర్రంగా ఉండడం వలన ఇలాంటి నష్ఠాలు వందల కొలది ఉన్నా లెక్క చెయ్యక సమైఖ్య వాదులు సమైఖ్యవాదాన్ని వినిపిస్తున్నారు. మరి కేసిఆర్ అండ్ కో.. తాను సి.ఎం. , తన బావమరది హోం, తన కూతురు శిశు మహిళా సంక్షేమ శాఖా మంత్రులు కావాలని ఊళ్ళో బిడ్డలను భావిలో త్రోసి లోతు చూస్తున్నాడు
//.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాల ఏర్పాటు కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.//
ఇవన్ని సహేతుకమే. అంగీకరిస్తున్నాను
//యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది.//
మంచికాలం కాకినాడ పాక్ బార్డరులో లేదు. ఉండి ఉంటే లాహూర్ ను ఇండియాతో కలపమని తీర్మానించి ఉంటుంది. ఇవన్ని అహేతుకం. హిస్టీరికల్.
//అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.//
గురువు గారూ.. దేశం చాలా క్లీష్ఠ పరిస్థితిలో ఉందండి. ఒక సిని డైరక్టర్ ఆర్థక ఇబ్బందులతో దొంగతనానికి పాల్పడి కాళ్ళు విరక్కొట్టుకునే రోజులండి.. కాస్త సహేతుకంగా ఆలోచించండి. అసలైన సమస్యలను పట్తించుకొండి
గమనిక:
గతంలో నేను వ్రాసిన టపా పై రహ్మత్తుల్లా స్పందనకు ప్రతిస్పందనగా ఈ టపా పోస్ట్ చేసాను
Showing posts with label KCR. Show all posts
Showing posts with label KCR. Show all posts
Tuesday, June 8, 2010
Tuesday, December 22, 2009
తెలంగాన వస్తే
1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.తెలనాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై ఖర్చులు రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలితే పది సం.లు, జడివానలు మొదలైతే 5 సం.లకు కొన్సాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా
5.తెలనాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై ఖర్చులు రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలితే పది సం.లు, జడివానలు మొదలైతే 5 సం.లకు కొన్సాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
Subscribe to:
Posts (Atom)