మహా భారతంలో యక్ష ప్రశ్న గురించి విని ఉంటారు. వనవాస సమయంలో ఒక జింకను తరుముకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. (ఇందుకు కారణం ఒక బ్రాహ్మణుడు) భాగా అలిసి పోతారు. భయంకరమైన దాహం. ధర్మరాజు పక్కన ఉన్న చెట్టెక్కి దగ్గర్లో ఎదైన జలాశయం ఉందా చూడమంటాడు.
నకులుడు చెట్టెక్కి చూసి దగ్గ్గర్లో ఓ సరస్సు ఉందని చెబితే వెళ్ళి నీళ్ళూ తెమ్మని నకుల సహ దేవులనే పంపుతాడు. వెళ్ళిన వారు తిరిగి రాలేదు. తీరా తక్కిన భీమార్జునులను పురమాయిస్తాడు.వారు వెళ్ళారే గాని తిరిగి రాలేదు.చివరికి ధ్రమజుడే వెళ్ళాడు. అక్కడ తన సోదరులు చచ్చి పడుండటాన్ని చూసాడు. కృంగి పోయాడు విలపించాడు. చివరికి తనను తాను ఓదార్చుకుని దాహర్తి తీర్చుకోవడం కోసం సరస్సులోకి దిగబోతుంటే ఒక అశరీరి పలికింది
"ధర్మజా ! ముందుగా నా ప్రశ్న్లలకు జవాబిచ్చి ఆ పై సరస్సులోకి దిగు" అశరీరి అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబిచ్చాడు.
అప్పుడు అశరీరి ధర్మ దేవత రూపం దాల్చి ధర్మరాజు ముందుకొచ్చింది. పైగా ఓ వరమూ ఇచ్చింది
"ధర్మజా ! నీ సోదరుల్లో ఎవరో ఒకరిని బతికిస్తా ఎవరు బతకాలో కోరుకో"
ధర్మ రాజు నకుల సహదేవుల్లో ఎవరో ఒకరిని బతికించమన్నాడు. ధర్మదేవత "ధర్మజా ! రానున్నది మహా సంగ్రామం . అందులో నీకు విజయ హేతువులుగా నిలవగల భీమార్జునులను కాదని నకుల సహదేవులను కోరుకుంటావా?" అంది
ధర్మజుడు చెప్పాడు " ధర్మ దేవతా ! నా తండ్రికి ఇరువురు భార్యలు. కుంతి,.మాథ్రి. కుంతి కన్న బిడ్డల్లో నేను మిగిలాను. మాథ్రి కన్న బిడ్డల్లో ఎవరో ఒకరిని బతికించుకోవడమే ధర్మం.యుద్దంలో విజయ హేతువులు భీమార్జునులు కారు. ధర్మమే"
Showing posts with label maha bharatham. Show all posts
Showing posts with label maha bharatham. Show all posts
Tuesday, August 17, 2010
Monday, August 16, 2010
అహంకారంతో అత:పాతాళం
మహా భారతంలో భీముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నసన్నివేశం అందరికి తెలిసిందే.
ద్రౌపది కోరుకున్న పుష్పాన్ని తేవడం కోసం వెళ్ళడం. దారిన ముసలి కోతి దారికి అడ్డంగా తోక పెట్టి
కూర్చుని ఉంటే భీముడు ఆ వానరంతో వాగ్వాదానికి దిగి ఆ తోకను కదల్చ లేక పోవడం కొన్ని సినిమాల్లో కూడ చూసి ఉంటారు. మనిషిలో అహంకారం ప్రవేశిస్తే అతను మంచివాడైతే మరుక్షణమే భగవంతుడు అతనికి గర్వ భంగం గావించి రక్షిస్తాడు. అతను చెడ్డవాడైతే భగవంతుడు అతని అహంకారాన్ని మరింత పెరిగేలా చేసి సర్వ నాశనం చేస్తాడు.
ఇటువంటి గర్వ భంగ దృశ్యాలు పురాణాల్లో కోకొల్లలు ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఇంకొకదానిని ఇప్పుడు చూద్దం.
అనుకోకుండా అర్జునుడు ఆంజనేయ స్వామి కలుసుకున్నారు. పిచ్చా పాటి మాట్లాడుతున్నారు. రాముని సేతు బంధనం గురించి ప్రస్తావన వచ్చింది. అర్జునుడు నేనైతే లంకకు భాణాలతోనే సేతు నిర్మించేవాడ్ని అని విర్ర వీగాడు.ఆంజనేయ స్వామి సతరు సేతు నిర్మించింది మనుషుల కోసం కాదని కోతుల కొసమని అదని ఇదని సర్ది చెబుతున్న కొద్ది అర్జునుడు నేటి రాజకీయ నాయకుల్లా వాగడం వాగడమే. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది
"సర్లేవయ్యా ఇప్పుడు నిర్మించు భాణాలతో సేతు. ఈ ఒక్క వానరం దాటికి తట్టుకుని నిలబడుతుందేమో చూద్దాం. ఆతరువాత లంకకు నిర్మిద్దువుగాని సేతు" అన్నాడు.
మాటా మాటా పెరిగింది .అర్జునుడు తాను నిర్మించే సేతువును హనుమన్న కూల్చేస్తే ప్రాణ త్యాగం చేసుకుంటానని శపథమే చేసాడు.
భాణాలతో సేతు నిర్మించాడు. హనుమన్న రాముడ్ని దలచి దాని పై తన కాలి బొటన వేలు మోపాడు. అంతే.సేతు కుప్ప కూలింది. అర్జుడు బిత్తర పోయాడు. కాసేపట్లో తేరుకుని ఆత్మాహుతికి ఉపక్రమించాడు. ఈ సంగతిని జ్నాన దృషితో తెలుసుకున్న కృష్ణుడు పరుగు పరుగున స్పాటుకు వచ్చాడు.
జడ్జి లేకుండా కాస్కున్న పందెం చెల్లదని తాను న్యాయ నిర్ణేతగా ఉండగా మళ్ళీ సేతు నిర్మాణం జరగాలని కన్విన్స్ చేసాడు. అర్జునిడిలోని అహం ఎప్పుడో పటా పంచలైంది.
అహంకారం గతానుభవాన్నిపట్టి బుద్దిలో పుడుతుంది. గతమే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలని రూలేమి లేదు. అంతటి కాలా గాంధి కామరాజ్ని ఒక విథ్యార్థి నేత ఓడించాడు. పురచ్చి తలైవిగా (విప్లవ నాయకి) చలామణి అవుతున్న జయలలితను ఒక మెడికల్ షాపు అతను ఓడించాడు
గతానికి వర్థమానానికి పోలికే ఉండదు.ఏ సెకండుకా సెకండు కొంగ్ర్త్తొత్తగా జనియిస్తుంది. సర్లే వ్యాఖ్యాణాలు కాని గాని కథకొస్తాం. ప్రస్తుతం అర్జునుడిలోని అహం హుష్ కాకి అయ్యింది. కృష్ణుడ్ని తలచుకుని భక్తి ప్రప్తత్తులతో భాణాలతో సేతు నిర్మాణం చేసాడు.
ఇక్కడ అర్జునిడిలో మాయమైన అహంకారం ఆంజనేయ స్వామి మదిలో ప్రవేశించింది. ఈ సారి హనుమన్న కాలి బొటన వ్రేలు మోపడం సరికదా .. సేతు పై ఎక్కి ఎంత దూకినా సేతు కదల్లేదు.
ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు.
మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఏడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక.
ద్రౌపది కోరుకున్న పుష్పాన్ని తేవడం కోసం వెళ్ళడం. దారిన ముసలి కోతి దారికి అడ్డంగా తోక పెట్టి
కూర్చుని ఉంటే భీముడు ఆ వానరంతో వాగ్వాదానికి దిగి ఆ తోకను కదల్చ లేక పోవడం కొన్ని సినిమాల్లో కూడ చూసి ఉంటారు. మనిషిలో అహంకారం ప్రవేశిస్తే అతను మంచివాడైతే మరుక్షణమే భగవంతుడు అతనికి గర్వ భంగం గావించి రక్షిస్తాడు. అతను చెడ్డవాడైతే భగవంతుడు అతని అహంకారాన్ని మరింత పెరిగేలా చేసి సర్వ నాశనం చేస్తాడు.
ఇటువంటి గర్వ భంగ దృశ్యాలు పురాణాల్లో కోకొల్లలు ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఇంకొకదానిని ఇప్పుడు చూద్దం.
అనుకోకుండా అర్జునుడు ఆంజనేయ స్వామి కలుసుకున్నారు. పిచ్చా పాటి మాట్లాడుతున్నారు. రాముని సేతు బంధనం గురించి ప్రస్తావన వచ్చింది. అర్జునుడు నేనైతే లంకకు భాణాలతోనే సేతు నిర్మించేవాడ్ని అని విర్ర వీగాడు.ఆంజనేయ స్వామి సతరు సేతు నిర్మించింది మనుషుల కోసం కాదని కోతుల కొసమని అదని ఇదని సర్ది చెబుతున్న కొద్ది అర్జునుడు నేటి రాజకీయ నాయకుల్లా వాగడం వాగడమే. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది
"సర్లేవయ్యా ఇప్పుడు నిర్మించు భాణాలతో సేతు. ఈ ఒక్క వానరం దాటికి తట్టుకుని నిలబడుతుందేమో చూద్దాం. ఆతరువాత లంకకు నిర్మిద్దువుగాని సేతు" అన్నాడు.
మాటా మాటా పెరిగింది .అర్జునుడు తాను నిర్మించే సేతువును హనుమన్న కూల్చేస్తే ప్రాణ త్యాగం చేసుకుంటానని శపథమే చేసాడు.
భాణాలతో సేతు నిర్మించాడు. హనుమన్న రాముడ్ని దలచి దాని పై తన కాలి బొటన వేలు మోపాడు. అంతే.సేతు కుప్ప కూలింది. అర్జుడు బిత్తర పోయాడు. కాసేపట్లో తేరుకుని ఆత్మాహుతికి ఉపక్రమించాడు. ఈ సంగతిని జ్నాన దృషితో తెలుసుకున్న కృష్ణుడు పరుగు పరుగున స్పాటుకు వచ్చాడు.
జడ్జి లేకుండా కాస్కున్న పందెం చెల్లదని తాను న్యాయ నిర్ణేతగా ఉండగా మళ్ళీ సేతు నిర్మాణం జరగాలని కన్విన్స్ చేసాడు. అర్జునిడిలోని అహం ఎప్పుడో పటా పంచలైంది.
అహంకారం గతానుభవాన్నిపట్టి బుద్దిలో పుడుతుంది. గతమే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలని రూలేమి లేదు. అంతటి కాలా గాంధి కామరాజ్ని ఒక విథ్యార్థి నేత ఓడించాడు. పురచ్చి తలైవిగా (విప్లవ నాయకి) చలామణి అవుతున్న జయలలితను ఒక మెడికల్ షాపు అతను ఓడించాడు
గతానికి వర్థమానానికి పోలికే ఉండదు.ఏ సెకండుకా సెకండు కొంగ్ర్త్తొత్తగా జనియిస్తుంది. సర్లే వ్యాఖ్యాణాలు కాని గాని కథకొస్తాం. ప్రస్తుతం అర్జునుడిలోని అహం హుష్ కాకి అయ్యింది. కృష్ణుడ్ని తలచుకుని భక్తి ప్రప్తత్తులతో భాణాలతో సేతు నిర్మాణం చేసాడు.
ఇక్కడ అర్జునిడిలో మాయమైన అహంకారం ఆంజనేయ స్వామి మదిలో ప్రవేశించింది. ఈ సారి హనుమన్న కాలి బొటన వ్రేలు మోపడం సరికదా .. సేతు పై ఎక్కి ఎంత దూకినా సేతు కదల్లేదు.
ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు.
మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఏడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక.
Subscribe to:
Posts (Atom)
