జగన్ గారు ! 1967లో పుట్టిన నేను 1972లో పుట్తిన మిమ్మల్ని ఇలా జగన్ అని సంభోదించడం తప్పు కాదనుకుంటాను. ఈ టపాను మీరు చదివే లోపు ఏ .బి. ఎన్ వారు మీకు షో కాస్ నోటీసులు జారి చేసి ఉంటారు. అచ్చు తప్పు కాదు. వారి కుతూహలం చూస్తుంటే వారే నోటీసు జారి చేసేలా ఉన్నారు.
నాయకుల మాటలకెందుకు విలువల్లేక పోయింది
ఓట్లకెందుకు మార్కెట్ వేల్యూ వచ్చిందని
వేదాలు వల్లించే వీరు కూడ ఈ పాపంలో భాగస్తులే అన్న మాటను ఎవరు చెప్పాలి? ఓకే పాయింటుకొచ్చేస్తా..
వీరుడు ఒకే సారి మరణిస్తాడు. ప్రిరికి వాడు రోజూ చచ్చి బతుకుతాడని అంటారు. దీనిని తమిళ నాడు సి.ఎం మరింత పదును పెట్టి " వీరునికి మరణమే లేదు ( మరణించినా ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు), పిరికి వానికి జీవితమే లేదు (వాడు బతికున్నా చచ్చిన శవంతో సమానం) అన్నారు. వారి సూక్తిని వారే మరిచి శ్రీలంకలోని తమిళుల ఊచ కోతలను చూస్తుండి పోయి పిరికివారైన మాట మనకొద్దు.
నేను తొలినుండి మీకు చెబుతూ వచ్చాను కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భలపడింది కాబట్టి రాష్ఠ్ర్రంలో సీట్స్ తగ్గడంతో సోనియా ఆలోచనా విదానం మారిందని, మరో ఇందిరమ్మలా తయారవుతున్నారని.
స్వీప్ చేసిన వై.ఎస్.నే ముప్పై చెరువుల నీళ్ళు తాగించిన వారు, ప్రస్తుతం వై.ఎస్. సైతం లేని స్థితిలో న్యాయం చెయ్యరని, భల ప్రదర్శనకు దిగాలని చెబుతూ వచ్చాను.
వై.ఎస్. మరణించిన తరువాత వచ్చిన మొదటి అమావాశ్యకే ముహూర్తం పెట్తి అనుకూలురైన ఎం.ఎల్.ఏలతో గవర్నరును కలవాలని కొరియర్ ద్వారా కూడ తెలిపాను. ప్రస్తుతం ఎలాగో వాస్తవం గ్రహించి తిరుగుభాట పట్టినందుకు అభినందనలు.
ఈ క్లీష్ఠ పరిస్థితిలో మీ వెంట నిలిచిన వారికి , నడిచిన వారికి మీ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి ఉన్న మార్గాలు రెండే.
* స్వంత పార్టి ఏర్పాటు
* అదిష్ఠానం ఎంతకు దిగి వచ్చినా మెత్త పడకుండా నిబ్బరంగా ఉండడం
ఒక వేళ అదిష్ఠానం పూర్తిగా తన తప్పు తెలుసుకుని జరిగిన నష్ఠానికి చింత వ్యక్తం చేసి అసెంబ్లిలో మద్దత్తు కోరితే అప్పుడు మాత్రం భయిట నుండి మద్దత్తు ఇచ్చే విషయం గురించి ఆలోచించ వచ్చు. ( కొన్ని నిభందనలతో ఉ. వై.ఎస్. పథకాలను తు చ తప్పకుండా అమలు చెయ్యడం)
ఈ దశలో వెనుకడుగు వేస్తే మాత్రం జగన్ గారూ .. మీరు చరిత్ర హీణులై పోతారు.
నేను నిజానికి చెప్పదలచిందేమంటే ఈనెల 20 నుండి సెప్టంబరు 5 వరకు కన్యలో కుజ శనుల కలయక దానిద్వార తలెత్తగల అతలాకుతల పరిస్థితిని పట్టి మాత్రమే.
అవును . జగన్ గారూ..మీ రాశి మిథునం. మీకు చతుర్తమున ఉన్న శని కుజునితో కలవడం చేత మీ మీత పార్టి వేటు వేయ వచ్చు. పైగా రోడ్డు ప్రమాదం కాని దాడి గాని జరుగ వచ్చు దానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాలి. అలానే రోశయ్య వంటి వృద్ద నాయకులకు కూడ ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది సుమండి.
ఇక మీ విజయానికి కొన్ని సలహాలు:
* ఆంథ్ర రాజకీయాల్లో మానవీయత పాలన అందించిన సి.ఎంలు ఇద్దరే . వారు ఎన్.టి.ఆర్ మరియు వై.ఎస్. గార్లే. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కూడ వారి వారసులే. కాబట్టి జగన్ ఎన్.టి.ఆర్ వారసులను, ఎన్.టి.ఆర్ అభిమానులను కూడ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి.
*ప్రజా రాజ్యాన్ని దగ్గర తీసుకోవడం చిరంజీవి పూర్వం చేసిన ఆరోపణలను (వై.ఎస్. రాష్ఠ్ర్రాన్ని దోచి సోనియాకు పెడుతున్నారన్న ఆరోపణ) అంగీకరించినట్టు కాదా అని నిల దీయాలి.
*సమైఖ్యాంద్ర వాదాన్ని భలపరచాలి.
* వై.ఎస్.కున్న పేరు ప్రఖ్యాతలను చెరచి వెయ్యాలని చూసే చంద్రబాబులాంటివారి నోళ్ళు ముయ్యించేలా వారు తమకు చెవుడొచ్చినా మంచిదేమో అని భావించేటంత ధీటుగా వారి విమర్శలను తిప్పి కొట్టాలి
Showing posts with label Odarpu yathra. Show all posts
Showing posts with label Odarpu yathra. Show all posts
Monday, July 12, 2010
Friday, May 28, 2010
జగన్ బెటర్ లేట్ దేన్ నెవర్
వై.ఎస్. మరణానంతరం జగన్లోని ఎన్నో లోపాలను నేను చూడ కలిగాను. వాటిని సరి దిద్దుకునేందుకు ఎన్నో సలహాలను నా టపాల ద్వారానే కాకుండా వ్యక్తిగత ఫ్యేక్సు, కొరియర్ ద్వారా కూడ పంపాను. ఆయన వాటిలో కొన్నింటిని పాటించటం కాకతాళీయమే కావచ్చు. అయినా సరే వై.ఎస్.ఆర్లో ఎన్.టి.ఆర్ని చూసుకు(న్న)నే ఎన్.టి.ఆర్ అభిమానిగా మళ్ళీ ఈ టపా వ్రాస్తున్నాను. ( దీని ప్రతిని జగన్ కు కొరియర్ ద్వారా కూడ పంపుతాను.
జగన్ !
కాంగ్రెస్ పార్టి ఆదిష్ఠానం ఉన్నది దిల్లిలో అక్కడ పొద్దు పొడిచేదే పగలు 10 గంటలకు.అక్కడ ఉన్న చలికి ఇక్కడి యువతలోని రక్తపు వేడి సోకాలంటే చాలా కాలం పడుతుంది. వారికి కావల్సింది శక్తి,యుక్తి గల నాయకులు కారు. వారికి కావల్సింది కాళ్ళు మ్రొక్కే భజన పరులు.అందుకే వై.ఎస్. అంతటి వాడు 33వ ఏట పి.సి.సి.అయినప్పటికి సి.ఎం కావటానికి 22 సం.లు వెయిట్ చెయ్యవలసి వచ్చింది. చంద్రబాబు ఇంద్రజాలంతో నేడు గొంతు చించుకుంటున్న ముసలి నక్కలన్ని తోక ముడిచి నోళ్ళు మూత పడిన వేళ, ఇక చేసేది ఏమి లేక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ స్థితి గతులు అధోగతి పాలై పోతున్న వేళ తప్పని సరి పరిస్థితిలో వై.ఎస్. ను సి.ఎం చేసి ఆయనగారికి కొంత మెరకు స్వేచ్చను ఇచ్చారేగాని అది వారి నైజం కానే కాదు. పైగా వై.ఎస్. తనకెంతో ప్రజా బలమున్నా, నాయకత్వ లక్షణాలున్నా కొంత మెరకు భజన కూడ చేయ కలిగారు. అందుకే మనగలిగారు. వై.ఎస్. సి.ఎం అయిన కొత్తలో సెంట్రల్ ఇంటలిజెన్స్ ద్వారా ఒక సర్వే కూడ చెయ్యించారు .ముఖ్యమంత్రిని మారుస్తే ఎలా ఉంటుందని. (ఈ విషయం అప్పటి ఆంద్రప్రభలో కూడ వచ్చింది.) మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుంది. వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలడంతో ఆగే పీచే భంధ్ చేసుకున్నారు)
వై.ఎస్ ప్రదర్శించిన విధేయత కేవలం ఒక షో మాత్రమే ఆయన విధేయుడు కాడని సోనియా మేడంగారికి ఎప్పుడో తెలుసు. పైగా రెండవ విడత జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవడం సోనియా మేడంకు కొంత మనోధైర్యాన్ని కూడ కలిగించినట్టుంది. వై.ఎస్. బతికుంటే వై.ఎస్.ను కూడ రోశయ్య రేంజిలో ట్రీట్ చేసేవారే (అందుకు వై.ఎస్. ఎలా స్పందించేవారు/ఎలా భుద్ది చెప్పేవారన్నది వేరే కథా)
మీ విషయంలో సోనియా మేడం వైఖరేమో అర్థం చేసుకోవడానికి బుర్ర కూడ అవసరం లేదు. కిడ్ని చాలు. కడప పులితోనే ఏగ లేక చచ్చాం. ఇక పులి బిడ్డతో కూడా ఏగాలా అన్న విసుగే ఈ వైఖరికి కారణం. వై.ఎస్. ఎంతటి విధేయత ప్రదర్శించినప్పటికి ఆయన విధేయుడు కాడని/తామే ఆయన గెలిచి పెట్టే ఎం.పి.సీట్లకు గాను విధేయులమని వారికి తెలుసు. వై.ఎస్. వెర్సస్ హై కమాండ్ రిలేషన్ ఎలా ఉండేదో ఒక్క తిరుపతి మెడికల్ కళాశాలకు భూమి కేటాయింపు వ్యవహారమే గీటు రాయి.
ఉత్తుత్తి సుత్తెందుకు సూటిగా చెబుతున్నా:
ఎటూ ఇక ఆదిష్ఠాణంతో తెగదెంపులు జరిగి పోయినట్టే .. ఇప్పటికైనా పార్టిలీ చీలిక తెచ్చి కొత్త పార్టిగా అవతరించండి. రాష్ఠ్ర్రాన్ని మానవీయ కోణంలో పరిపాలించినవారు ఇద్దరే ! ఒకర్ ఎం.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు అన్యాయమే జరిగింది. ఇద్దరు సమైఖ్య వాదులే. కాబట్టి ఎన్.టి.ఆర్ వారసులను కలుపుకెళ్ళే ప్రయత్నం చెయ్యండి .స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి. యువతరానికి మరింత దగ్గర కావడానికి ఫేస్ బుక్ /ట్విటర్ లో ఖాతా తెరవండి. బ్లాగుల్లో మీ గురించి వచ్చే కథనాల పై స్వయంగా స్పందించండి. వై.ఎస్. ఆర్ జీవిత చరిత్రను తెలుగు,ఉర్దూ బాషల్లో వ్రాయించి పది లక్షల ప్రతులన్నా ప్రజలకు అందేలా చూడండి. (సరళమైన భాషలో) వై.ఎస్. ఆర్ జీవితం పై ఒక సి.డి విడుదల చెయ్యండి. డా.రాజశేఖర్ ప్రారంభించిన వై.ఎస్. గురించిన సినిమాలో మీరే టైటిల్ రోల్ పోషించండి. వ్యాపారాలు, బెంగళూర్లకు గుడ్ బై చెప్పండి. మీ పని ఇక్కడే ! మీ శతృత్వమన్నా, మైత్రి భంధమన్నా ఇక్కడి వారితోనే. ఓబుళాపురం మైన్స్ త్రవ్వకంలో సాంకేతిక లోపం కారణంగా కేవలం కొన్ని మీటర్ల విస్తీర్ణంలో జరిగిన తప్పిదానికి జనార్దన్ రెడ్డిని / మీ తండ్రిగారిని ఆడి పోసుకున్న చంద్రబాబే మీ ప్రధాన శతృవు కావాలి. ఇక్కడి భజన పరులలో ఎవ్వడూ మీకు శతృవు కాడు.స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చాటితే ఎగ్గు సిగ్గు లేని ఆదిష్ఠానం మీ పార్టితో సైతం పొత్తుకు సై అంటూ భజన చేస్తుంది. మీ యుద్దం భజన పరుల పై కాక ఆదిష్ఠానం పై ఉండాలి. ఇక్కడి భజనపరులు పాపం ఏదో రోజు మీ గుమ్మం ముందు వచ్చి వాలే వారే. కొత్తా పార్టి పెడితే మొత్తం హై టెక్ పద్దతిలో జరిగేలా చూడండి. పార్టికి వెబ్ సైట్, ఆన్ లైన్ మెంబర్ షిప్, ఆన్ లైన్ చాట్, వారంలో ఒక దినం మీరే ఆన్ లైన్ లో ఉండి కార్యకర్తలతో ఇంటరేక్ట్ అవ్వండి.
ఎలాగూ ఎన్.టి.ఆర్ జన్మ దినోత్సవం నాడు ఎన్.టి.ఆర్ అంతటి/వై.ఎస్. ఆర్ అంతటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించేరు. వై.ఎస్,ఆర్ కు అసమ్మతి రాజకీయాలేమి కొత్త కావు. ఇందిరమ్మ పైకే చెప్పులెయ్యించాడన్న ఖ్యాతి కూడ ఉంది. ఎన్.టి.ఆర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎలాగో తెగించారు. తెగకొట్టుకుని భయిట పడండి. ఇద్దరు మహా నేతలు మిమ్మలి ఆశీర్వదిస్తారు.
జగన్ !
కాంగ్రెస్ పార్టి ఆదిష్ఠానం ఉన్నది దిల్లిలో అక్కడ పొద్దు పొడిచేదే పగలు 10 గంటలకు.అక్కడ ఉన్న చలికి ఇక్కడి యువతలోని రక్తపు వేడి సోకాలంటే చాలా కాలం పడుతుంది. వారికి కావల్సింది శక్తి,యుక్తి గల నాయకులు కారు. వారికి కావల్సింది కాళ్ళు మ్రొక్కే భజన పరులు.అందుకే వై.ఎస్. అంతటి వాడు 33వ ఏట పి.సి.సి.అయినప్పటికి సి.ఎం కావటానికి 22 సం.లు వెయిట్ చెయ్యవలసి వచ్చింది. చంద్రబాబు ఇంద్రజాలంతో నేడు గొంతు చించుకుంటున్న ముసలి నక్కలన్ని తోక ముడిచి నోళ్ళు మూత పడిన వేళ, ఇక చేసేది ఏమి లేక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ స్థితి గతులు అధోగతి పాలై పోతున్న వేళ తప్పని సరి పరిస్థితిలో వై.ఎస్. ను సి.ఎం చేసి ఆయనగారికి కొంత మెరకు స్వేచ్చను ఇచ్చారేగాని అది వారి నైజం కానే కాదు. పైగా వై.ఎస్. తనకెంతో ప్రజా బలమున్నా, నాయకత్వ లక్షణాలున్నా కొంత మెరకు భజన కూడ చేయ కలిగారు. అందుకే మనగలిగారు. వై.ఎస్. సి.ఎం అయిన కొత్తలో సెంట్రల్ ఇంటలిజెన్స్ ద్వారా ఒక సర్వే కూడ చెయ్యించారు .ముఖ్యమంత్రిని మారుస్తే ఎలా ఉంటుందని. (ఈ విషయం అప్పటి ఆంద్రప్రభలో కూడ వచ్చింది.) మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుంది. వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలడంతో ఆగే పీచే భంధ్ చేసుకున్నారు)
వై.ఎస్ ప్రదర్శించిన విధేయత కేవలం ఒక షో మాత్రమే ఆయన విధేయుడు కాడని సోనియా మేడంగారికి ఎప్పుడో తెలుసు. పైగా రెండవ విడత జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవడం సోనియా మేడంకు కొంత మనోధైర్యాన్ని కూడ కలిగించినట్టుంది. వై.ఎస్. బతికుంటే వై.ఎస్.ను కూడ రోశయ్య రేంజిలో ట్రీట్ చేసేవారే (అందుకు వై.ఎస్. ఎలా స్పందించేవారు/ఎలా భుద్ది చెప్పేవారన్నది వేరే కథా)
మీ విషయంలో సోనియా మేడం వైఖరేమో అర్థం చేసుకోవడానికి బుర్ర కూడ అవసరం లేదు. కిడ్ని చాలు. కడప పులితోనే ఏగ లేక చచ్చాం. ఇక పులి బిడ్డతో కూడా ఏగాలా అన్న విసుగే ఈ వైఖరికి కారణం. వై.ఎస్. ఎంతటి విధేయత ప్రదర్శించినప్పటికి ఆయన విధేయుడు కాడని/తామే ఆయన గెలిచి పెట్టే ఎం.పి.సీట్లకు గాను విధేయులమని వారికి తెలుసు. వై.ఎస్. వెర్సస్ హై కమాండ్ రిలేషన్ ఎలా ఉండేదో ఒక్క తిరుపతి మెడికల్ కళాశాలకు భూమి కేటాయింపు వ్యవహారమే గీటు రాయి.
ఉత్తుత్తి సుత్తెందుకు సూటిగా చెబుతున్నా:
ఎటూ ఇక ఆదిష్ఠాణంతో తెగదెంపులు జరిగి పోయినట్టే .. ఇప్పటికైనా పార్టిలీ చీలిక తెచ్చి కొత్త పార్టిగా అవతరించండి. రాష్ఠ్ర్రాన్ని మానవీయ కోణంలో పరిపాలించినవారు ఇద్దరే ! ఒకర్ ఎం.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు అన్యాయమే జరిగింది. ఇద్దరు సమైఖ్య వాదులే. కాబట్టి ఎన్.టి.ఆర్ వారసులను కలుపుకెళ్ళే ప్రయత్నం చెయ్యండి .స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి. యువతరానికి మరింత దగ్గర కావడానికి ఫేస్ బుక్ /ట్విటర్ లో ఖాతా తెరవండి. బ్లాగుల్లో మీ గురించి వచ్చే కథనాల పై స్వయంగా స్పందించండి. వై.ఎస్. ఆర్ జీవిత చరిత్రను తెలుగు,ఉర్దూ బాషల్లో వ్రాయించి పది లక్షల ప్రతులన్నా ప్రజలకు అందేలా చూడండి. (సరళమైన భాషలో) వై.ఎస్. ఆర్ జీవితం పై ఒక సి.డి విడుదల చెయ్యండి. డా.రాజశేఖర్ ప్రారంభించిన వై.ఎస్. గురించిన సినిమాలో మీరే టైటిల్ రోల్ పోషించండి. వ్యాపారాలు, బెంగళూర్లకు గుడ్ బై చెప్పండి. మీ పని ఇక్కడే ! మీ శతృత్వమన్నా, మైత్రి భంధమన్నా ఇక్కడి వారితోనే. ఓబుళాపురం మైన్స్ త్రవ్వకంలో సాంకేతిక లోపం కారణంగా కేవలం కొన్ని మీటర్ల విస్తీర్ణంలో జరిగిన తప్పిదానికి జనార్దన్ రెడ్డిని / మీ తండ్రిగారిని ఆడి పోసుకున్న చంద్రబాబే మీ ప్రధాన శతృవు కావాలి. ఇక్కడి భజన పరులలో ఎవ్వడూ మీకు శతృవు కాడు.స్థానిక ఎన్నికల్లో మీ సత్తా చాటితే ఎగ్గు సిగ్గు లేని ఆదిష్ఠానం మీ పార్టితో సైతం పొత్తుకు సై అంటూ భజన చేస్తుంది. మీ యుద్దం భజన పరుల పై కాక ఆదిష్ఠానం పై ఉండాలి. ఇక్కడి భజనపరులు పాపం ఏదో రోజు మీ గుమ్మం ముందు వచ్చి వాలే వారే. కొత్తా పార్టి పెడితే మొత్తం హై టెక్ పద్దతిలో జరిగేలా చూడండి. పార్టికి వెబ్ సైట్, ఆన్ లైన్ మెంబర్ షిప్, ఆన్ లైన్ చాట్, వారంలో ఒక దినం మీరే ఆన్ లైన్ లో ఉండి కార్యకర్తలతో ఇంటరేక్ట్ అవ్వండి.
ఎలాగూ ఎన్.టి.ఆర్ జన్మ దినోత్సవం నాడు ఎన్.టి.ఆర్ అంతటి/వై.ఎస్. ఆర్ అంతటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించేరు. వై.ఎస్,ఆర్ కు అసమ్మతి రాజకీయాలేమి కొత్త కావు. ఇందిరమ్మ పైకే చెప్పులెయ్యించాడన్న ఖ్యాతి కూడ ఉంది. ఎన్.టి.ఆర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎలాగో తెగించారు. తెగకొట్టుకుని భయిట పడండి. ఇద్దరు మహా నేతలు మిమ్మలి ఆశీర్వదిస్తారు.
Saturday, April 10, 2010
జగన్ ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు
డా. వై.ఎస్ మరణానంతరం ఆ బాధ తట్టుకోలేక మరణించిన కుటుంభాలను ఓదార్చటానికంటూ జగన్ చే పట్టిన ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఇంత ఆలశ్యంగా ప్రారంభించటం. వై.ఎస్. మరణించి వారం పది రోజుల్లో తమ కుటుంభ పెద్దను / ముఖ్యులను పోగొట్టుకున్న కుటుంభాలను ఓదార్చటానికి ఆరు నెలలనంతరం వెళ్ళటమే.
ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.
సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి
పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే
ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది. ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు
జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.
ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.
జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే. ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .
కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్తును భయిట విక్రయించుకునే వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.
ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం. ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.
ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.
ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.
సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి
పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే
ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది. ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు
జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.
ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.
జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే. ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .
కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్తును భయిట విక్రయించుకునే వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.
ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం. ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.
ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.
Subscribe to:
Posts (Atom)

