బ్రహ్మంగారు సిద్దయ్యను అడిగాడు "సిద్దా! లోకం ఎట్టా ఉందిరా?"
సిద్దయ్య చెప్పాడు " ఎవరిలోకం వారిది గురు దేవా
సైకాలజికి పునాది ఈ పోకడే. మనలో ఎవరికి వారం ఒక బుల్లి లోకాన్ని సృష్ఠించుకొని ఆ లోకంలోనె బతికేస్తున్నాం. మనం ఈ లోకంలో బతుకుతున్నం. ఈ లోకాన్ని ఉన్నదున్నట్టు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అలా అర్థం చేసుకున్నవారు ఎంత మంది?
Every man is an island అనీ అంటారు. Man is a social animal అనీ అంటారు. ఎంతటి వైరుధ్యం !
ఇందులో ఏది సత్యం? రెండూ సత్యాలే . మనిషి తన అవసరాలు తీరేంత వరకు సంఘ జీవిగా సర్దుకుంటాడు. తన వ్యక్తిగత అవసరాలు తీరాక ధీవిగా మారి పోతాడు.
ప్రాణి అన్నాక అది వ్యాప్తి చెందాలి. ( సెక్సు ద్వారా తన విత్తును వ్యాపింప చెయ్యడమే కాదు. )శారిరకంగా,మానసికంగా, సామాజికంగా వ్యాప్తి చెందాలి. స్వార్థం కృంగి పోవడానికి ప్రతీక. నిస్వార్థం వ్యాప్తి చెందడానికి ప్రతీక.
భలహీనులు కృంగి పోతారు. ఒక గూటిలో తమర్ని తామే భంధించుకుంటారు. (స్త్ర్రీలు వీకర్ సెక్స్ కాబట్టే వారికి రాజకీయాల పై, రాష్ఠ్ర్రం దేశం ,ప్రపంచ పోకడల పై ఆసక్తి ఉండదు. అస్తమానం కిచెన్లో కారుతున్న ట్యాప్ గురించి, పక్కింటి పద్మ గురించే ఆలోచిస్తారు.
కాని ఆధునిక జీవితం పురుషునిలోను భలహీనతను చొప్పించింది. అతనూ అభద్రతా భావంలోనే ఉన్నాడు. అందుకే వైవాహిక జీవితాలు చిక్కుల పాలవుతున్నాయి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. స్త్ర్రీకి స్త్ర్రీ పై ఎటువంటి ఆసక్తి ఉండదు.
దగ్గర భందుత్వాల్లో , ఒకే కులంలో వధూ వరుల ఎంపిక జరుగుతూ వచ్చింది కాబట్టి పురుషుల్లో పుంసత్వం నశించి పోయింది. (ఇటీవలి సర్వేలు కూడ దీనినే ధృవీకరిస్తున్నాయి) దీంతో ఆడా మగా తేడా లేక ఎవరికి వారు వారి లోకంలో ఉండటం జరిగి పోతుంది.
గతంలో కనీశం తమ అవసరాలను నెరవేర్చుకోవడానికన్నా సమాజంతో కమ్యూనికేట్ చేసే ఓపిక తగ్గి పోతూంది. వీరి ఊహలకి నిజాలకి పొత్తు కుదరడం లేదు .కాని అనివార్యమైనప్పుడు మెజారిటి వారు సర్ధుకుంటారు. కాని కొందరు మానసిక రుగ్మతలకు గురై పోతారు.
నిజానికి మానవ మస్తిష్కం (మనస్సు) ఎంతో శక్తిమంతమైంది. జ్నాపకాలను సేఖరించుకునే న్యూరాన్లను ఇసుకంత పెద్దది చేస్తే ఒక లారి లోడుకు సరిపోతాయట. అయినా ఎందుకు మానసిక రుగ్మతలు భాధిస్తాయంటే.. వీరి మనోభలం వృధా అయి పోతూంది.
( నేనిక్కడ మానసిక రోగుల గురించి ప్రస్తావించడం లేదు సుమండి -మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నామన్న భ్రమలో ఉన్నవారి గురించే ప్రస్తావిస్తున్నాను)
అనుకోవడం ఒకటి - చెప్పడం మరొకటి - చేయడం మరొకటి- చేసినట్టుగా చెప్పుకోవడం మరొకటి.
ఈ అష్ఠావదానం శతావదానంగా మారినప్పుడు.. వీరి మనస్సు దేనినైతే బేస్ చేసుకుని ఇన్ని తంటాలు పడిందో అది చెదిరినప్పుడు, లేదా శారీరక భలహీనత మనస్సుకు సోకినప్పుడు, పరిస్థితి అడ్డం తిరిగినప్పుడు కుప్ప కూలి పోతారు.
"అబద్దము ఆడరాదు" అన్నారు.ఆడితే ఏం పోతుంది అని ప్రశ్నించవచ్చు. మీ మనస్సు రెండుగా చీలి పోతుంది. మీ మనోభలం సగమవుతుంది. మీరాడిన అబద్దం ఒక ట్రాక్లో వాస్తవం మరో ట్రాక్లో ప్లే అవుతుంటుంది. పైగా మీ మనస్సు ఎప్పటికప్పుడు ట్రాక్ మార్చటానికి మీ కాన్షియస్ అప్రమత్తంగా పని చెయ్యాలి. సూటిగా చెబితే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. బస్ స్టాండ్ అంటే ఒక సారి ఊహించుకొండి. టీ టీ .. బటాన్లే బటాన్లే.. ప్రయాణికులకు విజ్నప్తి.. ఇల సవా లక్షా వినవస్తూ కనవస్తూ ఉంటాయి.
అబద్ద్దాలు ఇతరులకు మాత్రం చెబుతూ వచ్చే వ్యక్తి ఒక దశలో ఆ అబద్దాలను తనకే చెప్పుకోవడం ప్రారంభించి , తనే నమ్మడం మొదలు పెడ్తాడు . అది మరింత జటిలమవుతుంది. ఇతరులు కూడ ..మరీ మేసస్ దానిని నమ్మడం మొదలు పెడితే వాడు మరో సత్య సాయి అవుతాడు.ప్రజలు ఎ.పూ అవుతారు.
ఈ గజి బిజిలో అతనికి అసలైన లోకం మీద అవగాహణ పోతుంది.ఆసక్తి పోతుంది. తనలోకంలో తను ఉంటాడు. ఆ లోకంలో వాన కురుస్తే వాస్తవ లోకాన గొడుగు పడతాడు. ఆ లోకంలో వరద వస్తే పెట్టా బేడా సర్దుకుంటాడు.
దీనిని జనం చూసి పిచ్చి అంటారు. కాని ఎవరి పిచ్చి వారికి ఆనందమేగా. ( కొన్ని కేసుల్లో కుటుంభ సభ్యులందరు ఒకేలా - అంటే ఎవరి లోకం వారివిగా ఉంటే ఇంకేముంది భూత వైద్యులు, కేరళ మాంత్రీకం, చేతబడి అంతా ఒక రౌండేసుకుని చివరికి సైక్రియాట్రిస్ట్ లేదా పిచ్చాసుపత్రే.
నా సలహా ఒక్కటే .. మీ లోకమంటూ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ( ఇది - మీ సెల్ఫ్ -యొక్క సృష్ఠి మాత్రమే) కాని దాని పరిమాణం వాస్తవలోకానికంటే పెద్దదై పోకుండా చూసుకొండి. రెండింటిలో వాస్తవలోకమే వాస్తవం అన్న సత్యాన్ని అనుక్షణం గుర్తుంచుకొండి.
లేకుంటే కొన్ని బ్లాగర్లవలే వారి లోకానికే పరిమితమై పోతారు. జన బాహుళ్యంతో అనుసంథానం కాకుంటే ప్రతి వ్యక్తి పిచ్చేవాడే అవుతాడు. (కాస్త ముందు వెనుక)
Showing posts with label psycho analysis. Show all posts
Showing posts with label psycho analysis. Show all posts
Friday, October 22, 2010
Sunday, October 10, 2010
"శక్తి పూజ" - సైకో అనాలసిస్
(ఈ టపాలో నేను ప్రస్తావించిన, వెలిబుచ్చిన అభిప్రాయాలకు పూర్తి విరుద్దంగా గతంలో నేను అమ్మవారిని తల్లిగా భావించి వ్రాసిన కవిత ఒక దానిని పోస్ట్ చేసాను. దానిని చదవడానికి ఇక్కడ నొక్కండి. చదివి మీ అభిప్రాయాలు /విమర్శలు తెలిపితే సంతోషిస్తాను)
దసరా/నవరాత్రుల గురించి ఎన్నో పౌరాణిక కథలు చెలామణిలో ఉన్నాయి. ఒక మార్పు కోసం ఈ ఉత్సవాల వెనుక ప్రచారంలో ఉన్న వృత్తాంతాలను సైకలాజికల్గా నలైజ్ చెయ్యాలని నిర్ణయించాను.
ఒక స్త్ర్రీ 9 రోజులపాటు దుష్ఠ శక్తులతో చేసిన యుద్దం, 10వ రోజు ఆవిడ సాధించిన విజయం. ఆ విజయం సందర్భంగా ప్రజలు చేసుకున్న సంబరాలు - ఈ మూడు అంశాలు కలిసినదే దసరా.
ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం పితృస్వామ్య సమాజం. అంటే ఒక బిడ్డకు తల్లి ఎవరనేది ముఖ్యం కాదు. తండ్రి ఎవరన్నదే ముఖ్యం. ఉదా: మాజి గవర్నరు తివారి కేసు. నేటి సమాజంలో పురుషులదే పై చెయ్యి .స్త్ర్రీలు కేవలం భానిసలు. సమాజంలో ఆవిడ ఒక కలెక్టర్ అయినప్పటికి భర్తకు బెడ్ కాఫి ఇస్తేనే ఆవిడ పుణ్య స్త్ర్రీ కాగలదన్న అప్రకటిత నిభంధనలు అమల్లో ఉన్నవి.
అందుకే మన సినిమాలు సైతం నూటికి 99.99 శాతం హీరో ఓరియంటడ్ గానే ఉంటాయి. పొరభాటున హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలొచ్చినా ఆవిడ ఒక స్త్ర్రీగా , స్త్ర్రీపై సమాజం విధింఛిన ఆంక్షలను కేవలం 00.01 శాతమే అతిక్రమించి చివరికి పురుష ప్రపంచపు ప్రతిదుల దయా భిక్షలతో పురుష ప్రపంచం యొక్క మన్నెనలు పొందటంలో సక్సెస్ అవుతుంది.
( కళల,కళా కారుల పై సంఘంయొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది - కళాకారుడు సైతం ఈ సమాజం నుండేగా వస్తాడు - కాని కొందరు కళాకారులు సమాజాన్ని పొరకపుల్లలా భావించి తొలినుండి దాని పై తిరుగు భాటు చేస్తుండి తమ కళా కాండాల్లో సైతం దానినే కొనసాగిస్తారు)
ఇది ఇప్పటి స్థితి. కాని మానవులు ఆఠవిక జీవితం సాగిస్తున్న రోజుల్లో,సంచార జీవితం గడుపుతున్న రోజుల్లో స్త్ర్రీ పురుషుల మద్య ఎటువంటి బేదం ఉండేది కాదు. స్వేచ్చాయుతమైన సెక్సువల్ లైఫ్ కారణంగా కన్న బిడ్డకు తండ్రిని నిర్ణయించే ఏర్పాట్లు అప్పట్లో లేవు కాబట్టి తల్లికే ఎనలేని ప్రాధన్యత ఉంటుంది.
నాడు నెలకొన్న మాతృ స్వామ్య సమాజంయొక్క ప్రభావంతోనే షన్మతాల్లో శాక్తేయం చోటు చేసుకుంది. ( అమ్మవారే ప్రధాన ఆరాధ్య మూర్తిగా ఉండటం) .తర్క రీత్యా చూస్తే శైవం,వైష్ణవం,గాణపత్యం తదితర మతాలకంటే శాక్తేయమే సీనియర్ మోస్ట్ అయ్యుండవచ్చు. మానవులు ఆఠవిక జీవితం,సంచార జీవితాలకు భరత వాఖ్యం పలికిని తరువాత స్థిరవాసంలోనే స్త్ర్రీ భానిసైంది ( అదెలా సంభవించిందో మరో టపాలో వివరిస్తా) మాతృ స్వామ్య సమాజం అంతరించిన తరువాతే , పితృస్వామ్య సమాజంలోనే పై శైవం,వైష్ణవం,గాణపత్యం వంటి మతాలు వెలుగులోకి వచ్చి ఉండాలి.
ఇప్పట్లో కూడ వితంతువులు, డైవోర్సీల పిల్లలను ఇతరులు పేర్కొన్నప్పడు తల్లికి కొడుకుగానే చెబుతుంటారు. ఉదా: జానకమ్మ కొడుకు, సీతమ్మ కొడుకు . గతంలో మంగమ్మ గారి మనవుడు, ఇటీవల తమిళంలో విడుదలైన ఎం.కుమరన్ s/o హాలక్ష్మి సినిమాలు. ఈ వ్యవస్థను మాతృ స్వామ్య సమాజం అంటారు.
భర్తలు జీవనోపాయార్థం విదేశాల్లో సం.లు తరబడి స్థిర బడి పోతే పిల్లలు తల్లి సంరక్షణలోనె పెరుగుతారు. కుంతి ఒక్కో దేవత ద్వారా ఒక్కో బిడ్డను కనడం, ద్రౌపది ఏక కాలంలో ఐదుగురు భర్తలను చేసుకోవడం కూడ అప్పట్లో నెలకొన్న మాతృ స్వామ్య సమాజానికి ఆధారాలే.
ఇటీవల కుటుంభాల్లో స్త్ర్రీ/తల్లి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ క్రమేణా పునరావృతం అవుతూంది .స్త్ర్రీ విద్య, ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు, చట్ట సవరణలు రిజర్వేషన్, ఉద్యోగవకాశం తద్వ్రారా లభ్యమైన ఆర్థిక స్వేఛ్చ వంటి అంశాలు ఇందుకు ఒకింతవరకు దోహదపడ్డాయి.
స్త్ర్రీలకు సెక్స్ పట్ల భావ ప్రాప్తి పట్ల చైతన్యం - పురుషుల్లో పుంసత్వ నశింపు:
స్త్ర్రీకి పెరిగిన ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా soft ware companies, call centers కారణంగా స్త్ర్రీ ఆర్థిక స్వేచ్చను పొందింది. దీంతో స్త్ర్రీ తన హక్కులను సంరక్షించుకునే స్థాయికి ఎదిగింది. సెక్స్ పట్ల భావ ప్రాప్తి పట్ల చైతన్యం పెరిగింది. దీనిని తమ హక్కుగా భావించే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల ఈ కారణాన్ని చూపుతూ విడాకులు కోరే స్త్ర్రీల సంఖ్య భాగా పెరిగిందంటూ సమాచారం.
కులవ్యవస్థ, కులాంతర వివాహాలు జరుగుతున్నప్పటికి వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండటం, సైంటిఫిక్ డెవలప్ మెంట్స్,మెకనైజేషన్ కారణంగా శారీరక శ్రమ తగ్గడం, మానసిక వత్తిడి పెరగడం ,జీవన విదానం, ఆహారపద్దతులు మారడం,(ప్రక్తికి విరుద్దంగా - అర్ద రాత్రిదాక మేలుకోవడం, సూరీడు నడినెత్తి మీదికి వచ్చేవరకు నిద్ర పోవడం) , మద్యం,గుట్కా తదితర కారణాలవలన పురుషుల్లో పుంశత్వం శరవేగంగా అంతరించిపోతూంది.
పై తెలిపిన రెండు అంశాల కారణంగా సమాజం మళ్ళీ మాతృస్వామ్య సమాజంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గ్లోబలైజేషన్, ప్రవైటైజేషన్, లిబరలైజేషన్, మారిన ప్రభుత్వ కార్మిక విదానం, ఉధ్యోగ భద్రత లేమి కారణాల వలన ఎన్నో అవాంతరాలు చోటు చేసుకున్నప్పటికి ,వీటి కారణంగా స్త్ర్రీలు చాలా వరకు నష్ఠ పోతున్నప్పటికి పురుషాధిక్యం క్రమేణా తగ్గి పోతుండటం ఒక శుభ పరిమానమే.
కొడుకు తల్లి పై ఆధారపడటం నార్మల్ ( ఆపోజిట్ సెక్స్ కాబట్టి) , కాని కూతురు తల్లిపై ఎక్కువగా ఆధారపడటం అబ్ నార్మల్ దీంతో ఆవిడ లెస్బియన్ గామారిపోయే ప్రమాదం ఉంది.
కొడుకు తల్లి పై ఆధారపడటం నార్మల్ అన్నప్పటికి క్రమేణా అతను తన దృష్టిని ఇతర స్త్ర్రీల పై మళ్ళించాలి లేకుంటే ఈడిఫస్ కాంప్లెక్సుకు గురవుతాడు. ( తల్లిపై అప్రకటిత కామవాంచ కలిగి ఉండటం - తండ్రిపై అకారణ వైరుధ్యం) . భాల్యంలో తల్లిపై ప్రేమ ఆరాధ్య భావం ,ఆమె పట్ల విధేయ భావం ఉండడం మామూలే. (పిల్లల్లో పెద్దగా చైతన్యం లేనివారే ఇలా ఉంటారు -చైతన్య వంతులు తండ్రిని తమ రోల్ మాడల్గా ఎంచుకుంటారు)
భగవంతుడ్ని తల్లిగా, తండ్రిగా భావించడం ఇమ్మెచ్యూర్డ్ మైండుకు తార్కానం. శాక్తేయమే కాదు భగవంతుడ్ని తల్లిగా ,తండ్రిగా భావించి ఆరాధిచే ఏ వ్యక్తి కూడ 100శాతం మెచ్యూర్డ్ మైండ్ గలవాడని చెప్పలేం.
దసరా ఉత్సవాల్లో,ఆ పది రోజుల్లో అమ్మవారిని రకరకాలుగా అలంకరించి పూజించినా "తల్లి!" అన్న భావం,సంభోదన,పిలుపు మాత్రం మారదు. ఇది ఇందాక చెప్పినట్టుగా ఇమ్మెచ్యూర్డ్ మైండుకు తార్కానం.
మరేం చెయ్యాలి?
నారధ భక్తి సూత్రంలో రకరకాలైన భక్తి మార్గాలు ప్రస్తావించ బడ్డాయి. భవంతుడ్ని స్నేహితునిగా( కుహుడు,శుగ్రీవుడు,విభీష్ణుడు), శతృవుగా( రావణేశ్వరుడు) ఇలా ఏదో విదంగా పరిగణించి భక్తి చూపొచ్చట. కాని సైకాలజి పట్ల కాసింత అవాగాహన ఉన్న వ్యక్తిగా నా సలహా ఏమంటే స్త్ర్రీలు భగవంతుడ్ని పురుష రూపంలో , కొడుకుగా (యశోధ, కౌశల్యా) పరిగణించి,ఊహించుకుని, భావించి భక్తి చూపితే బెటర్. అవివాహితులు ప్రేమికుడిగా కూడ ఊహించి భక్తి చెయ్యొచ్చు.అలా చేస్తే త్వరిత గతిన మనస్సు లగ్నమవుతుంది.(రాధలా)
పురుషులైతే స్త్ర్రీ రుపాన్ని ఎంచుకోవడం బెటర్. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే అమ్మవారిని శ్రీబాలా త్రిపుర సుందరి రూపాన కన్న కూతురిగా పూజించి,ద్యానించడం బెస్ట్. ఇదే మెచ్యూర్డ్ మైండడ్ పీపుల్ గా ఎదిగే మార్గం. ఇది మనలను మరింత భాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దుతుంది.
Subscribe to:
Posts (Atom)
