Sunday, January 9, 2011

నాడు అనచివేత -నేడు స్వేచ్చ : రెండింటితోనూ నష్ఠం స్త్ర్రీకే

పుట్టడమే తల్లిగా పుదుతుంది ఆడపిల్ల. ఆరు సం.ల వయస్సుగల పాప ఏం చక్కా  అన్నం వడ్డిస్తుంది. తల్లికో,తండ్రికో అనారోగ్యం చేస్తే ఓర్పుతో వారిని కనిపెడుతుంటుంది.

కాని 50 సం.ల వయస్సున్న మగవాడు సైతం చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. ఆడపిల్ల కేవలం ఆడపిల్లే అయితే ఆమె ఎలా ఉన్నా సమస్య లేదు.

కాని ఒక విదంగా ప్రకృతి సిద్దంగానే స్త్రీ వికలాంగురాలు. శారీరక దౌర్భల్యాన్ని అధిగమించవచ్చు గాని దాంతో సంక్రమించిన మానసిక దౌర్భల్యాన్ని ఓవర్ కం కావడం ఎంతో కష్ఠం. అందుకే నేను మొత్తుకుంటున్నాను.

మొదట మీ శారీరక దౌర్భల్యాన్ని పారాద్రోలండి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడి. మీరెంత అందంగా ఉంటారు, ఎంత మందిని ఆకర్షిస్తారన్నది మీ భలం కాదు. మీ శారీరక బలహీనతను అంగీకరించడమే అవుతుంది.

నేను 1987లో జిల్లా ఖజాణాకార్యాలయంలో సెక్షన్ రైటరుగా పనిచేసాను అక్కడ  సావిత్రి  అని ఒకావిడ. (పేరు మార్చాను లెండి) బక్క చిక్కిన శరీరం, పొంతనలేని పొట్ట, కొత్తమిరి కట్టకన్నా ప్రేలవంగా జుట్టు, గుళ్ళ గూబ కళ్ళు.

అయితే మనం (నేను) ఆత్మనే చూద్దాం కాబట్టి ఆమెతో కూడ క్యేషువల్ గానే ఉన్నాను. దీంతో ఆమె  నాకు దగ్గరై తన ఫ్యేమిలి ఆల్బం చూపింది. అందులో ఆమె చిన్ననాటి ఫోటో చూసి బిత్తర పోయాను . ఆ రూపం అచ్చం  భానుప్రియాలా ఉండే . జస్ట్ ఒక టైఫాయిడ్ ఇంత పని చేసిందట.ఆమె ఒక డైవోర్సీ, విడాకులకు ఆమె కురూపానికి సంబంధం లేదు. ఇతర కారణాలవలనే విడాకులైంది.  అందం సంగతి ఇది.

 స్త్రీ భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన సవాళ్ళు అనేకం ఉ. పీరియడ్స్, డెలివరి, ఆ సమయంలో సక్రమంగా తినలేక పోవడం , ఇప్పట్లో ఆ సవాలు డబుల్ అయ్యింది. స్త్రీ స్వాతంత్రయం పేరిట ఉధ్యోగాలు కూడ చేసి పెట్టాలిగా.

అప్పట్లో కొన్ని పనులు ఆమెకు తప్పేది. ప్రస్తుతం టూ వీలర్ నడుపుతుంది కాబట్టి అవీ ఆమె నెత్తినపడ్డాయి. ఫాస్ట్ నెస్స్ అన్నది గమ్యాన్ని చేరుకోవడంలో వస్తే ఫర్వ్చాలేదు గాని నిరర్థక, భవిష్యత్తుకు వినాశకరంగా తయారయ్యే కార్య కలాపాలవలన నష్ఠ పోయేది స్త్రీయే.

కాలం మారిందని ఎంతగా రొమ్ము బాదుకున్నా పురుషుడు మాత్రం ఆఠవిక యుగంలోనే ఉన్నాడు. తనతో పాటు పది మందితో తిరిగే ఆడ పిల్లను పెళ్ళి చేసుకోడు. కేవలం తనతో మాత్రం తిరిగుంటే అది వేరే సంగతి. కాబట్టి ఈ ఫాస్ట్నెస్స్ వలన లూజర్ స్త్రీయే.

అప్పట్లో సమాజం స్త్రీని అనచి వేతతో దోచుకుంటే ఇప్పుడు స్వాతంత్ర్యం పేరిట దోచుకుంటూంది. నేను మహిళలను కోరేది ఒక్కటే మీరు  ఫస్టఫాల్ మనుష్యులు. ఆ తరువాతే లింగ బేదం.

మీరు మీ ప్రియునికో, మీ భర్తకో ఆ గంటో /పావు గంటో స్త్రీగా ఉంటే సరిపోయేది గా. 24 గంటలు వేష ధారణ, హావ భావాలు, సిగ్గు పడటాలు, బుగ్గలు ఎర్ర బడటాలు ఎందుకనే.

ఇవి మిమ్మల్ని ఎదుటివారి ముందు నిలబెడతాయని మీరు భ్రమిస్తున్నారు. కాని వీటి వలన మీరు పండుకోవలసి వస్తుందేమో కాని నిలబడటం కల్ల. ( నా ఈ మాట సూటిగా మీ బుర్రలోకి ఎక్కాలనే కఠినమైన పదాలు వాడాను. క్షమించండి)

ఇక్కడ కలిసి తిరగడంలో ఉన్న చిక్కేమంటే ఇందులో నష్ఠ పోయేది కేవలం స్త్రీయే. గర్భ ధారణ, ఎయిడ్స్, సుఖ రోగాల సమస్య లేనప్పటికి ( కేండోంస్ ఉన్నాయి కాబట్టి) అపఖ్యాతి పాలు కావడం మాత్రం తప్పదు. లో క్లాసు, హై క్లాసు కథ ఎటో ఉన్నా మిడ్డిల్ క్లాస్ స్త్రీలకు మాత్రం ఇది గొడ్డలి పోటే కాబట్టి తస్మాన్ జాగ్రత్త ..

మనుష్యులుగా ఉండండి. మనుష్యులుగా ప్రవర్తించండి. మనుష్యులుగానే సాధించవచ్చు. మీరు స్త్రీ అన్న సంగతి కేవలం మీ జీవిత భాగస్వామికి రుజువైతే చాలు సుమా !

యుగ యుగాల్గా మిమ్మల్ని కృంగ దీస్తున్న శారీరక బలహీనతకు స్వస్తి పలకండి. పౌష్థిక ఆహారం, తగినన్ని వ్యాయామం ,అవసరమిన విశ్రాంతి విషయంలో స్వార్థ పరులు కండి.

మిమ్మల్ని కేవలం స్త్ర్రీగా చూసేవారి పట్ల జాగ్రత్త వహించండి. వారు మీకు తాత్కాలికంగా  మేలే చేసినా వారు మిమ్మల్ని మనుష్య్లులుగా తిరస్కరిస్తున్నారన్న సంగతి మరిచి పోకండి.

చాలు నాడు అనచివేతతో, నేడు స్వేచ్చతో దోపిడికి గురైంది చాలు. మెల్కొండి..

Saturday, January 8, 2011

చిత్తూరు షుగర్ ఫ్యేక్టరి - పర్యావ"రణం"

చిత్తూరు సహకార చెక్కిర ఫ్యేక్టరి - పర్యావ "రణం"

జయేంద్ర వంటివారు మతాన్ని,ఆథ్యాత్మికాన్ని కలుషితం చేస్తుంటే గళం విప్పినట్టే చిత్తూరు సహకార సెక్కిర ఫేక్టరి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే  గొంతెంతి నినదిస్తున్నాను.

నేను పసలేని గీతలు చెప్పే భగవంతులకన్నా సృష్ఠిని భగవంతునిగా చూడటానికే ఇష్ఠపడతాను. సృష్థి భగవంతునికన్నా సీనియర్.

సృష్ఠితో పోల్చుకుంటే మనం అత్యల్పులం. పైగా సీనియారిటి ప్రకారం చూసినా సృష్ఠి సీనియర్ మోస్ట్. మనం కొన్నాళ్ళు  ఉంటాం. చస్తాం. ఇక ఎన్నో లక్షల తరాలు పుట్టాలి. కాని మన భాధ్యతా రాహిత్యం వలన కేవలం పర్యావరణ కలుషితం కారణంగా పిల్లలు  పుట్టలు పుట్టలుగా చస్తారనిపిస్తుంది కాని పది కాలాల పాటు బతుకుతారనిపించలేదు.

సరే విషయానికొస్తున్నా. ప్రజల కొసం పజలు చేసుకునే రాజ్యం ప్రజాస్వామ్యం. సభ్యులు సభ్యుల కోసం చేసుకునేది సహకారం. పైగా ఈ షుగర్ ఫేక్టరి రైతులకోసం  రైతులచే నడిపించబడే ఫ్యేక్టరి.

దీనివలన జరిగే ఇతరత్రా కలుషితాల కథ పెద్దగా తెలీక పోవచ్చు కాని (తప్పక ఉంటాయి)
ఒక్క వాయు కాలుష్యం ద్వారానే గిన్నెస్ రికార్డు స్థాయికి "పని"చేసేస్తున్నారు.

వీరు ఏం కాలుస్తున్నారు? ఎందుకు కాలుస్తున్నారు? తెలీదు కాని ఫ్యేక్టరి చిమ్ని నుండి దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగలోనుండి బొగ్గు తునకలు వచ్చి పడతాయి. (బెంచి రవ సైజులో ఉంటాయి) గాలికి అవి పట్టణ ప్రజలందరిని వారి ఇళ్ళ మేడల మీదికి వచ్చి మరీ పలుకరిస్తాయి.

గాలీవాటంగా పట్టణమంతటా వ్యాపిస్తాయి. అంతేగా అని మీరనుకోవచ్చు. కాని వీటివలన ఫ్యేక్టరి పరిసరప్రాంతాల్లో ఉన్న ప్రజలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. (కట్టమంచి,దొడ్డిపల్లె).

పొలాలపై,గొడ్డు గోదల పై, పితికిన పాలు పై, మనుషుల శరీరం పై పడేవి వానొచ్చినప్పుడు,కడిగినప్పుడు పోతాయంటారేమో? పాలు వడపోస్టే సరిపోతుందనుకుంటారేమో? స్నానాలు చేస్తే శుభ్రమై పోతాయంటారేమో?

కాలుకి చెప్పుల్లేకుండా నాలుగడుగులు వేసి కాళ్ళు కడిగితే లీటర్ల కొద్ది నీళ్ళు వినియోగించినా నలుపు నలుపే అంటే చూసుకొండి.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ బొగ్గు తునకలు మనుష్యుల స్వాశ కోశల్లోకి వెళ్తే? మానవ శరీరం తనలోకి అన్యవస్తువులను అనుమతించదు. పసి పిల్లలకు మలబద్దకం ఉంటే తమలపాకు  కాడెను దాని ఆసనద్వారంలోకి దోపుతారు.వెంటనే మలవిశర్జణ జరుగుతుంది. శరీరం అన్యవస్తువైన కాడెను భయిటకు తోసి వెయ్యడానికే అంత ఆతృతతో మలాన్ని భయిటకు పంపుతుంది.

ఇంత ఎందుకు ఒక నూలు పోగును ముక్కు దగ్గరకు తీసుకెళ్తే వెంటనే తుమ్మొస్తుంది. ఇదెందుకంటే దానిని భయిటకు తరిమే ప్రయత్నం.

పై తెలిపిన బొగ్గు తునకలు పొరభాటున స్వాశ ద్వార స్వాశకోశంలోకి చేరిపోతే శరీరం దాన్ని భయిటకు పంపి వెయ్యడానికి ప్రయత్నిస్తుంది. స్వాశకోశ గల్ల ఉత్పత్తి చేసి గల్లద్వార దానిని భయిటకు పంపాలని ప్రయత్నిస్తుంది.అదృష్ఠం భావుండి ఆ తునక భయిటపడితే సరే సరి. ఒక వేళ అది ఊపిరితిత్త్లుల్లో నాటుకు పోతే ?

శరీరం ఆ తునక నాటుకు పోయిన భాగం కుళ్ళి పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ తునక రిలీజై పోతుందని శరీరం ఉద్దేశం. కాని కాని.. దీనిని మనం టి.బి అంటాం గుర్తుందో లేదు దీనికి క్షయరోగమని మరో పేరుకూడ ఉంది.

క్షయం అంటే క్షీణించడం. కరగడం.కృంగడం. శరీరమే కృంగి పోతుంది. సాధారణ వస్తువైతేనే ఈ ఎఫెక్టు. పై తెలిపిన బొగ్గు తునకలో ఏముందో? ఏమో? అది ఊపిరితిత్తుల్లో నాటుకు పోతే ఏం చేస్తుందో ఏమో?

ఇప్పటికి లక్షల టన్నుల బొగ్గు తునకలు గాలిలో కలిసి పట్టణమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎందరి ఊపిరి తిత్తుల్లో ఆశ్రయం పొందాయేమో? ఎంత మంది క్షయరోగానికి గురయ్యారేమో? అందులో ఎంతమందికి అది లంగ్ క్యేన్సర్ స్థాయికి వెళ్తుందేమో?

జిల్లా కేంద్రంలోనే ఇంతటి దుస్థితి అంటే మారుమూల గ్రామాల్లో, అఠవి ప్రాంతాల్లో కలుషితం ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకొండి.

గమనిక:
ఈ విషయమై పలువురు ఔత్సాహికులు ఇప్పటికే పలుమార్లు  యాంటి  పొల్యూషన్ బోర్డు, కోర్టుతలుపులు సైతం తట్టేరు .కాని ప్రయోజనం ఏమో శూన్యం.

కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో దాచినా, మంచి గాలి,నీరు,సారవంతమైన నేలను మిగల్చకుంటే తమ వారసులు సైతం కుక్కచావు చావవలసిందేనన్న చిన్న సత్యం మన నాయకులకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో? షిట్ !

Friday, January 7, 2011

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన " జయేంద్ర : భాగం2

నిజానికి శంకరా కమిషన్ రిపోర్టు గురించి ఒక టపా వ్రాయడమే ఎక్కువ. జయేంద్ర సరస్వతి ఏదో సమస్త హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అన్న అపోహ చాలా మందిలో ఉన్నా అతను కేవలం ఒక కులానికి పరిమితం అన్న సంగతి అందరికీ తెలుసు. పైగా అతను ఓ మాటన్న మాత్రాన విభజన జరిగిపోయేది లేదు.. ఆగేది లేదు.

దీని పై టపా వ్రాయడంలో నా ఉద్దేశం పూజ్యులుగా చలామణి అయ్యేవారు సైతం సందర్భాలను పట్టి స్టాండ్ మార్చుకుని  పూజ్యాలుగా మారిపోతారని చూపడమే.

కాని గత జన్మలో జయేంద్రుడు ఏం చేసాడో ఏమో తెలీదు గాని మితృలు రాజేష్ జయేంద్ర తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. నన్ను రెచ్చ కొట్టి రచ్చకీడ్చి మరో టపా వ్రాసేలా చేసారు.

గతంలో ఒక సారి ఇలానే ఏదో వాగితే మరెవరో భాగా భుద్ది చెప్పారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ మాట పాపం ఆ మితృనికి తెలీక పోవడం అతని ఖర్మ.

నిజంగా నాకు టపా వ్రాయడానికి సైతం టైమ్ లేదు. తమిళంలో ఐదు వందలకు తక్కువ లేకుండా హిట్స్ కొట్టే నా రచనలు బ్లాగ్లోకంలో వంద రెండొందలకే పరిమితం కావడం కారణంగా ఉత్సుకత కుడ తక్కువే.అయినా ఏదో రోజు నిజం నిలకడ మీద తేలనీ అని వ్రాస్తున్నా.

మరీ  ఈ పొడవాటి కమెంటు పై కమెంటు చెయ్యడం తెలివితక్కువ పనేమో అనిపిస్తూంది. ( ఈ సమయంలో ఒక జాతకానికి ఫలితం పంపితే రూ. 250  నాదవుతుంది. కనీశం ఉచిత జ్యోతిష సలహా క్రింద వచ్చి పెండింగ్లో ఉన్న ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపితే పుణ్యమన్నా వస్తుంది.)

అయినా ఇలా వ్రాస్తూ పోవడం రాజేష్ కు సమాదానం చెప్పే వంకతో  జయేంద్ర గురించిన మరిన్ని సత్యాలను తెలుగు బ్లాగ్లోకానికి చాటాలనే .

రాజేష్ గారి కమెంటులోని ప్రతి మాట వెనుక,  మాటకు  మాటకు నడుమ ఉన్న పెడర్థాలు,వెటకారాలు  వక్ర బాష్యాలను కడిగెయ్యకపోతే నేను వై.ఎస్. అభిమానిని ఎలా అవుతాను?

(గుర్తుకు తెచ్చుకొండి అసెంబ్లి లో వై.ఎస్. డవులాగు - బాధితులు శ్రీ చంద్రబాబు - " నీ అమ్మ ఎందుకు నిన్ను కన్నానా అని బాధ పడేలా కడిగేస్తా)


// "
ఏరా అర్థం అయిందా, ఏవన్నా?//

నాది మృగరాజైన సింహ రాశి. మనుషుల బాసలకే కాదు మృగాల హూంకరింపులను  సైతం అర్థం చేసుకోగలను. తమరు ఏరా అని సంభోధించి జయేంద్రకు తగిన శిష్యులనిపించేరు. శభాష్!

కానీ తమరు ఎంతో బెటర్ లెండి. ఊక దంపుడు కమెంట్ వ్రాసేరు. ఆయన గారైతే నన్నూ శంకర్ రామన్ని  నరికించినట్టుగా నరికించేవారు.

//అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. //
జయేంద్రకు ఓటు హక్కుంటే సాలు .లేకున్నా బాధలేదు.భారతీయుడుగా అతని అభిప్రాయం అతను చెప్పే హక్కు అధికారం మస్తుగా ఉన్నవి. కాని సం.నికోసారి సం.పేరు మారినట్టు అభిప్రాయం మారితే ఎలా? ఆయనగారి ఉపదేశాలూ ఇలా మారి పోతాయేమో? సమాజంలో ఆదర్శనీయులుగా,ఆచరణ యోగ్యులుగా చలామణి అయ్యేవారు కనీశం అలా నటించాలి కదా . మరీ రాజకీయ నాయకుల్లా మాట మారుస్తే ఎల్లా అని ప్రశ్నించడమే నా ఉద్దేశం

//సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!. //

సత్య సాయి బాబా అంటే .. నేనే భగవంతుడంటుంటారు. ఎవరో చంపడానికొస్తే అలార్మ్ మ్రోగనిచ్చి బతికి బయిట పడ్డారే ఆ మహానుభావులేగా..ఉటంకించడానికి మరో వ్యక్తి మాట గుర్తుకురాలేదా బాసు..

//అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది. //

అవున్లెండి .ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంటుకి ?. ( కొత్త డాక్టరు కన్నా పాత రోగి నయమంట కదా?)

//.ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?//

రామకృష్ణ పరమహంస  ఎక్కువగా తీపి తింటున్న బాలునికి అది మానమని చెప్పే ముందు తాను మానారు కదా? ఇదే జయేంద్రవంటి మిడి మిడి జ్నానంతో రోజుకో వాగుడు  వాగే జయేంద్రలను కొలిచే కొలబద్దం..

ఒక కంపెనీ భాగా ఎదిగిపోతే సూపర్ టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విభజిస్తారు బాస్..

//ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా? //
గతంలో నా బ్లాగును నిషేదింప చేసినవారెవరో వారి ఆత్మ సాక్షికి తెలియాలిగాని వారితో నాకేంపని.వారి పాపాన వారు పోతారు అని నా ఉద్దేశం

//స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.

http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm


తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి. .//

మీకు నామీద ఎంత కోపమున్నప్పటికి మీడియాను నన్నూ ఒకే దొడ్డిన కట్టేస్తారా? మీరు సూచించేది ఏదో ఒక కేసుకు సంభంధించిందేకాని శంకర్ రామన్ హత్య కేసుకు సంభంధించింది కాదు కదా? దివంగత తమిళ రచయిత్రి అనురాధా రమణన్ పాపం ఆమె అప్పటికే పేషంట్ .రోజులు లెక్కపెట్టుకుంటుంటే ఆ సంఘఠన జరిగిందని ఆరోపణ. దీనికి సంబంధించి ఏదైనా పంచి పెట్టుంటే దాని తాలూకు లింకుకూడ ఇవ్వండి

//అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//

ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు.  నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన"జయేంద్ర సరస్వతి




కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమైఖ్య వాదానికి చెయ్యిచ్చారు. ప్లేటు ఫిరాయించేరు.గతంలో సమైఖ్య రాష్ఠ్ర్రమే శ్రేయస్కరమని చెప్పిన "పెద్దమనిషి"ఇప్పుడు మాట మార్చారు.హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా రాష్ఠ్ర్రాన్ని రెండు ముక్కలు చెయ్యొచ్చని చెప్పేరు. ఇందుకు  తెలంగాణావారు ఒప్పుకోరుగా..ఆందోళనలు జరుగుతాయిగా అని విలేకర్లు ప్రశ్నిస్తే రెండ్రోజులు జరుగుతాయి,తరువాత సర్దుకుంటాయని శెలవిచ్చేరు.
ఇప్పటికే శంకర్ రామన్ హత్య కేసులో ఇరుక్కుని సతమతమవుతున్న జయేంద్ర వారికి ఈ ఉచిత సలహాల జబ్బు ఎలా సోకిందో అర్థం కావడం లేదు. జయేంద్రకు దమ్ముంటే తమిళ నాడును రెండు రాష్ఠ్ర్రాలుగా చెయ్యాలని శలవివ్వాలి.

మఠానికి ఆస్త్లులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ఆతరువాత ఉచిత సలహాలిస్తే మేలన్నది నా అభిప్రాయం.

(ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు పెట్టి నా బ్లాగు నిషేదింప చెయ్యడం ఖాయం కాబట్టి ఆపుతున్నా)

గమనిక: స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ.. బాధితురాలు ఒక రచయిత్రి,

Thursday, January 6, 2011

శ్రీ కృష్ణా కమిటి మాటను ముందే చెప్పిన సాంబార్గాడు

జగన్ కొత్త పార్టి ఇలా ఉంటే మేలని ఒక టపా వ్రాస్తూ అందులో తెలంగాణ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపాను. దాని తాలూకు స్క్ర్రీన్ షాట్ చూస్తున్నారు. పూర్తి టపా చదవ కోరేవారు ఇక్కడ నొక్కండి

బొమ్మ పెద్దదిగా కనబడాలంటే దాని పై క్లిక్ చేసి కంట్రోల్ మరియు + బటన్ నొక్కండి

Wednesday, January 5, 2011

కేతు గ్రహం గురించిన మర్మాలు

జ్యోతిష్యంలో  అందరూ శనికి వనుకుతారు కాని వారికి కేతు ప్రభావమేమిటో తెలీదు. శనియన్నా దుస్థితిలో ఉంటేనే  దుష్ఫలితాలు ఇస్తాడు. కాని కేతు?

ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కీడే చేస్తాడు. ఇదెక్కడి పంచాయితీరా బాబూ అని జుట్టు పీక్కోకండి.

ఆయన జ్నాన కారకుడు.జ్నానాన్ని ఇవ్వడం ఆయన ధర్మం. జ్నానం ఎప్పుడు  వస్తుంది? కష్థాలొస్తేనే గా జ్నానం వచ్చేది అందుకని కష్ఠాలిస్తాడు కేతువు.

ఇలాంటి గ్రహాన్ని సృష్థించిన దేవుడు ఒక విలన్ అనిపిస్తుందా?

అవును బాసు అందరం అలానే అనుకుంటున్నాం. కాని ఆయన నూటికి నూరు పాళ్ళు హీరోనే.మన రక్షకుడే.

మరి ఎందుకీ కమ్యూనికేషన్ గ్యేప్ వచ్చింది? గత జన్మం ముగిసాక మనం ఆత్మ స్వరూపులమై ఉన్నప్పుడు మనమే అతన్ని ప్రార్థించాం. స్వామీ! ముక్తి కోసమని జన్మమెత్తి
ఈ జన్మంతా వృధా చేసాను. ఈ జన్మలో ఏ ఏ అంశాలైతే నా ముక్తికి అడ్డుగా ఉన్నాయో అవేమి తదుపరి జన్మలో నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడు అని మనమే ప్రార్థించాం.

ఉ.గత జన్మలో నేను మన యండమూరి వీరేంథ్రనాథ్ లాగా లీడింగ్ రైటరుగా ఉంటూ మాస్ ఫాలోయింగ్ కోసం చెత్త చెత్తవి వ్రాస్తూ టైం వేస్ట్ చేసి ఉంటాను. కాబట్టి ఈ జన్మలో నాకంత సీనొద్దు.

ఏదో నా మనస్సులో మాట భయిటకు చెప్పుకుని ఊరట పొందే అవకాశం ఉంటే చాలు స్వామి.. అని ప్రార్థించి ఉండవచ్చు.

ఇలా నేను ప్రార్థించినప్పుడు నా ఉద్దేశం ముక్తి. మరి ఈ రోజు "ఇదేంది బాయి..ముచ్చటగా మూడు వేలై మందైనా చదవని బ్లాగులో ఏం వ్రాసి ఏం పుణ్యం అని నేనే విసుక్కోవచ్చు. ఇందుకు భగవంతుడెలా భాధ్యుడవుతాడు?

ఇంతకీ నేను చెప్పనొచ్చిందేమంటే  మనకేదన్నా కీడు జరిగితే పెద్దలు అంతా మన మంచికే
నాయనా పోతే పోనీ అనే వారు.మరి అందులో లాజిక్ ఉందా? నిజముందా అని ఒక జ్యోతిష్కునిగా ఆరాదీసి నివ్వెర పోయాను. వాళ్ళ పాయింట్ 100% కరెక్ట్.మరెలా అంటారా? చెబుతా..

నా పుత్రికా రత్నం ఏడో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. ( మనకేమో ఎస్.ఎస్.సి.లో 72%). ఇదేందిరా ఖర్మా.. మనమేమో అది పాపం, ఇది పాపం,వారి పాపాన వారు పోతారని ,అన్యాయానికి సైతం రెక్కల కష్ఠం దోచి పెట్టి ఊరుకున్నాం. మన బిడ్డెందుకిలా తయారైందని తెగ బాధ పడి పోయేవాడ్ని.

కాని నేను ఆమెకు పరిచయం చేసిన కంప్యూటర్, పెయింట్ ఆమెను అడోబ్ ఫోటో షాప్ మీదికి ఉసికొలపగా ఈ రోజు నాకు సమానంగా కొన్ని సందర్భాల్లో నాకంటే ఎక్కువే సంపాదిస్తూంది.

పేరుకు స్టుడియో పని చేస్తున్నా ఆ స్టుడుయోకి ఏ టు జెడ్ ఆవిడే. ఇదెలా సాధ్యమైంది?
ఇంతకీ ఆమెకు తమిళం,తెలుగు,ఆంగ్లం ఏది చదవడం, వ్రాయడం రావు. మరెలా సాధ్యమైంది?

నేనైతే 1987 కాలేజినుండి భయిట పడిన నాటినుండి2007దాక ఎన్ని ప్రతిభలున్నప్పటికి రోలింగ్ స్టోన్లా అడుక్కు తిన్నా. మరి ఈ రోజు వద్దన్నా డబ్బులు. ఇదెలా సాధ్యమైంది?

నా పుత్రికా రత్నం జాతకంలో పదిన కేతు. నా జాతకంలో పదో స్థానాధిపతితో కేతు కలిసారు. కేతు అంటే సన్యాసం -భిక్షాటన. ఇవే పూర్వం జరిగాయి.

భవిష్యత్తులో ఆచరణకు రానున్న అన్ని అన్వేష్ణలు కేతుగ్రహ శాఖ క్రిందే వస్తాయన్నది శాస్త్ర్రం. జ్యోతిష శాస్త్ర్రాన్ని రూపొందించినప్పుడు కంప్యూటర్లు ఉండేవి కావు. భవిష్యత్తులో వచ్చిందే. కాబట్టి ఇది కేతు శాఖకు చెందింది. అందుకే నేను నా పుత్రికా రత్నం కంప్యూటర్ పరిజ్నానంతో రెండు చేతుల్లో సంపాదించకలుగుతున్నాం.

ఆనాడు భిక్షాఠన చెయ్యకుంటే ఈ రోజు ఈ సంపాదన లేదుగా?

Tuesday, January 4, 2011

2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

గతంలో చంద్రబాబు ఊతపదం "నిర్దిష్ఠ ప్రణాళికతో ముందుకు పోతాం"అన్నదే. ఆయనగారి ముందుకు పోవడంతో ఎన్.టి.ఆర్ రెక్కల కష్ఠంతో /భా.జా.పా రెండు శాతం ఓట్ల బిచ్చంతో మనుగడ సాగించిన తె.దే.పా విజయవంతంగా రెండో సారి ప్రతిపక్షంలో పడ్డది.

అందుకే నాకు ప్రణాళిక అంటేనే పరమ చికాకు. ఉద్దేశం మంచిదైనప్పుడు తిక్క తిక్కగా చేసినా పిచ్చ పిచ్చగా సక్సెస్ అవుదాం.

దురుద్దేశంతో ఎంత చక్కటి ప్రణాళికలు రూపొందించుకున్నా షెడ్డైపోతాం. అయినా చంద్రబాబు ఫోబియా కాస్త తగ్గడంతో 2011లో బ్లాగ్లోకంలో  నా అజెండా ఏమిటో ఈ టపా ద్వారా పంచుకుంటా.

నా రచనలు కేవలం క్రింది విషయాల పైనే ఉండాలని ప్రయత్నిస్తా. నిజానికి జ్యోతిషం చివరన ఉన్నా కేవలం హిట్స్ కోసం అడపా తడపా వ్రాయాల్సి వస్తూంది. పది మంది చదువుతున్నప్పుడు మంచి విషయాలు వ్రాస్తే పది మందికి చేరుతుందన్న కకృత్తితోనె జ్యోతిషం మీద దృష్ఠి పెడుతున్నాను .

తమిళ బ్లాగ్లోకంలో ఉన్న స్వేచ్చ ఇక్కడ లేదు .లేకుంటేనా సంచలనం మా ఇంటి పేరు.

*ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ? ( హత్యలు,ఆత్మ హత్యలు,దాడులు,ప్రమాదాలను వారించే మార్గాలు)

*విద్యా,విద్యా విదానంలోని లోపాలు సవరించుకునే మార్గాలు. యువతరం మాట బాట ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి?

* ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను తమ స్వయం కృషితో ఎలా సమకూర్చుకో వచ్చు అన్న విషయం పై సూచనలు (వృత్తి,ఉధ్యోగం,వ్యాపారం, సెర్వీసెస్ ఏదైనా సరే చట్ట బద్దంగా,దర్మ బద్దంగా)

*వివాహం సంతానం పిల్లల పెంపు

*ఆథ్యాత్మికం జ్యోతిష్యం

*ద్యానం యోగం
ఇవే శీర్షికలతో నా బ్లాగులో ఇంకెవరన్నా వ్రాయడానికి ముందుకొచ్చినా ఆహ్వానిస్తాను. పైగా నాకు నచ్చిన టపాలకు రూ.వంద పారితోషికం కూడ పంపుతా.