ఎందుకూ కొరగాని సాధనతో, హృదయమంతట వేధనతో
విడిచి పెట్టలేని సత్య శోధనతో
తిలకిస్తున్నా వీరి ఆగడాలను
నువ్వు ఉలిక్కి పడతావని
వీరు హుష్ కాకీ అవుతారని.
చందమామ పాఠక బాలుని వలే
ఎదురు చూస్తున్నా
ఇక్కడివి ఏవీ నాకు నచ్చడం లేదు
నా మనస్సు మెచ్చడం లేదు
వీరికి ముచ్చమటలు పుట్టించే మార్గం తెలిసిన వాడ్ని
నా కలం కదిలితే దాని వెంట త్రిశూలం కదులుతుందని తెలుసు
కాని కాని...
జరిగిపోతూందే కిరాతక ఖూనీ
నీ గురించిన ఊహల్లోనే బతికి ఈ అపోహలతోనే
అకాలంగా అంతమై పోతాననుకోకు
నేను మిన్నంటే లక్ష్యంతో పాటు
ఎలుకకన్నా హేయంగా బతుకుతున్న
ఈ అనామక జీవితాన్ని సైతం
అంగీకరించాను
అందలానిలకైనా ఇందులకైనా సిద్దమే
ఈ అక్షరాలు మూగవాని కలలా
ఈ చెవిటి ప్రపంచానికి
చేరకుండానే పోయినా డోంట్ కేర్!
నా ఈ ఆవేశానికి అక్షర రూపం ఇవ్వగలగడమే
చెబుతూంది. నీ దైవ శక్తికన్నా నా ఆత్మ శక్తి గొప్పదని
తేల్చుకోవలసింది నువ్వే
అర్థం, పర్థం లేని వ్యర్ధ వేదాల పుటల్లో,
రారాజుల కోటల్లో
నాలుగు గోడల ఇరుకులో
బాపలు పరచే పరుపులో
విని విని విసుగెత్తిన పొగడ్తల నిషాతో
నీ భక్త జనుల సొల్లు వేడుకోళ్ళ తమాషాతో
భంధీగా ఉండి పోతావో? .. లెక
నా మదిన చెలరేగే కలకలం దాటికి ,
నా కలం కదలికల పోటుకి
రాసుకుంటే రవ్వ రాలు నా మాటల ఏటుకి
బండ బారిన నీ గుండె
మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించాకనన్నా
చేత త్రిశూలం పట్టి ,నా దేశాన్ని అభివృద్ది భాటలో నెట్టి
అవినీతి చేతులను కట్టి
నీ ఉనికిని చాటుకుంటావో?
తేల్చుకోవలసింది నువ్వే !
అమ్మా!
నిద్రించేవారిని చంపడం ధర్మం కాదే వీరు నిద్రిస్తున్నారే.
నా ఈ అక్షరాల్లోకి నా అత్మ శక్తి
విద్యుత్సక్తిలా ప్రవేశించినా నా అక్షరాలు సైతం
జాగృత పరచలేనంత ప్రగాఢ నిద్రలో ఉన్నారే
కాసింత గడువిస్తే నా ప్రయత్నం ఏదో చెయ్యనిస్తే
ఆపై చెయ్యవే ప్రళయ కాల ఘోర నృత్యం
ఆపై మోగనీయవే మరణమృదంగం
Showing posts with label ammoru. Show all posts
Showing posts with label ammoru. Show all posts
Sunday, October 17, 2010
Monday, October 11, 2010
అందమైన కలలే ప్రాణ వాయువుగా
అమ్మా అమ్మోరు తల్లి !
నేనే నిన్ను తలచినట్టు
నేనే నిన్ను పిలిచినట్టు
నేనే నీ వద్ద ఏదో కోరినట్టు,పొందినట్టు నమ్మిస్తున్నావు
పొందిన దానిని పంచటానికి మరెవరినో వెతికినట్టు భ్రమింప చేస్తున్నావు
కాని అమ్మా!
నువ్వే తలచావు.
నువ్వే పిలిచావు.
మరి నువ్వే కోరనిచ్చావు.(కోరింది) ఇచ్చావు
ఇవన్ని చేసినట్టే ఇచ్చింది పంచటానికి
నువ్వే జనభాహుళ్యాన్ని నా వద్దకు పంపుతావన్న
జ్నానం ఇప్పుడిప్పుడే నాలో విచ్చుకుంటూంది
అమ్మా అమ్మోరు తల్లి !
ఇవన్ని నా మనోరాజ్యపు పతాక శీర్షికలు
కాని యధార్థంగా చూసినప్పుడు
ప్రజాకంఠకుల పై కలబడటం,తల బడటం,
జన భాహుళ్యం బ్రహ్మరథం పడుతుందని భావించటం
నా వెనుక ఉన్న పది మందిని పోగొట్టుకుని
మూలన పడటం ఇవి తప్ప మరొకటి జరుగదా తల్లీ..?
నా పయణం ఎటు సాగుతూందో కూడ అర్థం కావడం లేదు
లక్ష్యానికేసి ముందుకా? లక్ష్యం నుండి వెనక్కా?
నా పయణం తీరు అధోముఖమా? ఊర్ద్వముఖమా?
అసలు సాగుతూందా? ఆగిందా కూడ అర్థం కావడం లేదు
అమ్మా !
నా భుద్దిని నమ్ముకున్న రోజులు ఎప్పుడో పోయాయి
కేవలం చిత్తాన్ని,చిద్విలాసాన్ని నా చిత్తాన మెరిసే
నీ చిరునవ్వును మాత్రం నమ్ముకునే స్థితికి జారి(చేరి)పోయాను.
నా దిక్చూచి నీ నయనం
నీ నయనం చూపిన వైపే నా పయణం
అమ్మా అమ్మోరు తల్లి !
తనను పెద్ద బాక్సర్ అనుకుని తండ్రితో తలబడే చిన్న పిల్లవాని స్థాయిలో ఉన్నాను
ఇక్కడ తండ్రికి బదులు నా ముందున్నది రాక్షసులను సైతం వనికించే మానవ రూపంలోని దానవులు.
నాటి రాక్షసులే నేడూ ఉండి వారిని సంహరిస్తే వారు నామరూపాల్లేక పోతారు. మరీ తప్పదంటే వాహనమై నన్ను మోస్తారు.
ఎనలేని కీర్తి నాకు దక్కుతుంది
మరి నేటి మానవ రూప దానవులను సంహరిస్తే విగ్రహాలై లేస్తారు. మరో పిల్ల రాక్షసునికి సానుభూతి ఓట్ల వర్షం కురిపిస్తారు. నన్ను అడవుల్లోకి తరిమి వేస్తారు.
బట్టలు దరించిన మృగాలన్ను ఊళ్ళో ఉండగా నేను తల దాచుకోవాలి అడవుల్లో
మరి ఏది పరిష్కార మార్గం?
ఏ ప్రజలైతే వీరిని అందలమెక్కిచ్చారో వారి చేతే
గాడిదల పై ఊరేగించేలా చూడాలి (గాడిదల సంఖ్య సరి పోతే - గాడితలు అంగీకరిస్తే)
ప్రహల్లాదునికన్నా తండ్రితోనే ముప్పు,
కృష్ణునికన్నా మామతోనే హాని
మరి నాకు?
నేనెవరి భవిష్యత్ కోసం ఈ అక్షర యజ్నంలో నన్ను నేనే ఆహుతి చేస్తున్నానో
వారే నా శతృవులు. వారితోనే నాకు హాని
కొరివితో తల గోక్కుంటున్నారని నేనంటే నా పై
విమర్శల నిప్పుల వర్షం కురిపిస్తున్నారు...
ఎలా నెట్టుకొస్తున్నావో నాకే అర్థం కావడం లేదు
అటు చూడు.. సర్వ శక్తి సంపన్నులు. మేమే శక్తిమంతులం, మేమే శక్తి పుతృలం
అసలా శక్తియే మేమని విర్ర వీగుతున్నారు.
ఇటు చూడు ..నన్ను చూడు
అశక్తుడనై, వారిని విర్ర వీగేలా చేస్తున్న శక్తుల పట్ల నిరాసక్తుడనై,
నా దేశం గురించిన అందమైన కలలే ప్రాణ వాయువుగా ,
నా ప్రజల అబివృద్ది గురించిన కలలే ఆహారంగా,
రేపటి తరాల భద్రత గురించిన కలలే నీరుగా
బతుకుతున్నాను.
కేవలం సాక్షి భూతంగా వీక్షిస్తున్నా వారు రక్తి కట్టిస్తున్న ఘోర కళిని..
ఏం చెయ్యను?
నా మానస సరోవరం నిర్లిప్తంగా ఉన్నప్పుడు
నీ చాయ ఓ మాయలా ప్రవేశించి కనుమరుగై పోతూంది
నకిలి వైద్య్లుల నెలసరి టూరులా ఉంది నీ రాక పోక
వారైనా నిర్ణీత రోజుల్లో సాగిస్తుంటారు క్యేంపు
మరి నీ రాక,బసలకు ఆ ఏడుపు సైతం లేదు
ప్రియురాలు ప్రియుడ్ని ఆట పట్టించినట్టుంది నీ వ్యవహార శైలి
స్త్ర్రీని నీవిచ్చిన నిధిగా - నీకు ప్రతిగా - నీ ప్రతినిధిగా ఫీలై
సరి పెట్టుకుంటున్నా నీ ఆట విడుపులు కలిగించే భాధను
స్థిరవాసం ఏర్పరచుకోవే ..
నాలో , నా నాడుల్లో ప్రవహించు
రాసుకుంటే రవ్వ రాలు నా వ్రాతల్లో నృత్యం చెయ్యి
నా దేశంతో సరిపెట్టుకుంటానని నన్ను నిర్లక్ష్యం చెయ్యకు
వీలైతే ఈ విశ్వాన్నే విశ్వాసంతో నింపాలి. విశ్వ ప్రేమ వికసించేట్లు చెయ్యాలి
అదే నా ఉద్దేశం.
ఓం శక్తి
నేనే నిన్ను తలచినట్టు
నేనే నిన్ను పిలిచినట్టు
నేనే నీ వద్ద ఏదో కోరినట్టు,పొందినట్టు నమ్మిస్తున్నావు
పొందిన దానిని పంచటానికి మరెవరినో వెతికినట్టు భ్రమింప చేస్తున్నావు
కాని అమ్మా!
నువ్వే తలచావు.
నువ్వే పిలిచావు.
మరి నువ్వే కోరనిచ్చావు.(కోరింది) ఇచ్చావు
ఇవన్ని చేసినట్టే ఇచ్చింది పంచటానికి
నువ్వే జనభాహుళ్యాన్ని నా వద్దకు పంపుతావన్న
జ్నానం ఇప్పుడిప్పుడే నాలో విచ్చుకుంటూంది
అమ్మా అమ్మోరు తల్లి !
ఇవన్ని నా మనోరాజ్యపు పతాక శీర్షికలు
కాని యధార్థంగా చూసినప్పుడు
ప్రజాకంఠకుల పై కలబడటం,తల బడటం,
జన భాహుళ్యం బ్రహ్మరథం పడుతుందని భావించటం
నా వెనుక ఉన్న పది మందిని పోగొట్టుకుని
మూలన పడటం ఇవి తప్ప మరొకటి జరుగదా తల్లీ..?
నా పయణం ఎటు సాగుతూందో కూడ అర్థం కావడం లేదు
లక్ష్యానికేసి ముందుకా? లక్ష్యం నుండి వెనక్కా?
నా పయణం తీరు అధోముఖమా? ఊర్ద్వముఖమా?
అసలు సాగుతూందా? ఆగిందా కూడ అర్థం కావడం లేదు
అమ్మా !
నా భుద్దిని నమ్ముకున్న రోజులు ఎప్పుడో పోయాయి
కేవలం చిత్తాన్ని,చిద్విలాసాన్ని నా చిత్తాన మెరిసే
నీ చిరునవ్వును మాత్రం నమ్ముకునే స్థితికి జారి(చేరి)పోయాను.
నా దిక్చూచి నీ నయనం
నీ నయనం చూపిన వైపే నా పయణం
అమ్మా అమ్మోరు తల్లి !
తనను పెద్ద బాక్సర్ అనుకుని తండ్రితో తలబడే చిన్న పిల్లవాని స్థాయిలో ఉన్నాను
ఇక్కడ తండ్రికి బదులు నా ముందున్నది రాక్షసులను సైతం వనికించే మానవ రూపంలోని దానవులు.
నాటి రాక్షసులే నేడూ ఉండి వారిని సంహరిస్తే వారు నామరూపాల్లేక పోతారు. మరీ తప్పదంటే వాహనమై నన్ను మోస్తారు.
ఎనలేని కీర్తి నాకు దక్కుతుంది
మరి నేటి మానవ రూప దానవులను సంహరిస్తే విగ్రహాలై లేస్తారు. మరో పిల్ల రాక్షసునికి సానుభూతి ఓట్ల వర్షం కురిపిస్తారు. నన్ను అడవుల్లోకి తరిమి వేస్తారు.
బట్టలు దరించిన మృగాలన్ను ఊళ్ళో ఉండగా నేను తల దాచుకోవాలి అడవుల్లో
మరి ఏది పరిష్కార మార్గం?
ఏ ప్రజలైతే వీరిని అందలమెక్కిచ్చారో వారి చేతే
గాడిదల పై ఊరేగించేలా చూడాలి (గాడిదల సంఖ్య సరి పోతే - గాడితలు అంగీకరిస్తే)
ప్రహల్లాదునికన్నా తండ్రితోనే ముప్పు,
కృష్ణునికన్నా మామతోనే హాని
మరి నాకు?
నేనెవరి భవిష్యత్ కోసం ఈ అక్షర యజ్నంలో నన్ను నేనే ఆహుతి చేస్తున్నానో
వారే నా శతృవులు. వారితోనే నాకు హాని
కొరివితో తల గోక్కుంటున్నారని నేనంటే నా పై
విమర్శల నిప్పుల వర్షం కురిపిస్తున్నారు...
ఎలా నెట్టుకొస్తున్నావో నాకే అర్థం కావడం లేదు
అటు చూడు.. సర్వ శక్తి సంపన్నులు. మేమే శక్తిమంతులం, మేమే శక్తి పుతృలం
అసలా శక్తియే మేమని విర్ర వీగుతున్నారు.
ఇటు చూడు ..నన్ను చూడు
అశక్తుడనై, వారిని విర్ర వీగేలా చేస్తున్న శక్తుల పట్ల నిరాసక్తుడనై,
నా దేశం గురించిన అందమైన కలలే ప్రాణ వాయువుగా ,
నా ప్రజల అబివృద్ది గురించిన కలలే ఆహారంగా,
రేపటి తరాల భద్రత గురించిన కలలే నీరుగా
బతుకుతున్నాను.
కేవలం సాక్షి భూతంగా వీక్షిస్తున్నా వారు రక్తి కట్టిస్తున్న ఘోర కళిని..
ఏం చెయ్యను?
నా మానస సరోవరం నిర్లిప్తంగా ఉన్నప్పుడు
నీ చాయ ఓ మాయలా ప్రవేశించి కనుమరుగై పోతూంది
నకిలి వైద్య్లుల నెలసరి టూరులా ఉంది నీ రాక పోక
వారైనా నిర్ణీత రోజుల్లో సాగిస్తుంటారు క్యేంపు
మరి నీ రాక,బసలకు ఆ ఏడుపు సైతం లేదు
ప్రియురాలు ప్రియుడ్ని ఆట పట్టించినట్టుంది నీ వ్యవహార శైలి
స్త్ర్రీని నీవిచ్చిన నిధిగా - నీకు ప్రతిగా - నీ ప్రతినిధిగా ఫీలై
సరి పెట్టుకుంటున్నా నీ ఆట విడుపులు కలిగించే భాధను
స్థిరవాసం ఏర్పరచుకోవే ..
నాలో , నా నాడుల్లో ప్రవహించు
రాసుకుంటే రవ్వ రాలు నా వ్రాతల్లో నృత్యం చెయ్యి
నా దేశంతో సరిపెట్టుకుంటానని నన్ను నిర్లక్ష్యం చెయ్యకు
వీలైతే ఈ విశ్వాన్నే విశ్వాసంతో నింపాలి. విశ్వ ప్రేమ వికసించేట్లు చెయ్యాలి
అదే నా ఉద్దేశం.
ఓం శక్తి
Sunday, October 10, 2010
సరి కొత్త ఉషస్సు
Note: "శక్తి పూజ" - సైకో అనాలసిస్ శీర్షికన వ్రాసిన టపాను ఇక్కడ క్లిక్ చేసి చదవండి
ఒక తల్లి నలుగురు బిడ్డలను పోషిస్తుంది.
కాని ఆ నలుగురు కలిసి ఒక తల్లిని పోషించ లేక
ఓల్డేజ్ హోమ్ పాలు చేస్తారు
హే మహోదరి!
ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా
కడుపులో ,కళ్ళల్లో పెట్టుకుని
దాచుకుంటున్న నిన్ను వీరిలో ఏ ఒక్కరన్నా
తమ గుండెలో దాచుకోలేక
నాలుగు గోడల మద్య భంధించడం విడ్డూరం
త్యాగేశుడు అని శివయ్యను కీర్తించే ఈ లోకంలో నిన్ను
త్యాగేశ్వరిగా ఎందుకు గుర్తించటం లేదు?
రా ..నీ విశ్వరూపంకన్నా విశాలమైన నా గుండెలో దాచుకుంటా..
ఆ నాలుగు గోడల మద్య ఉండి నువ్వు సాధించిందేమి
వాస్తు దోషాలు,గ్రహ దోషాలు అంటని నా గుండెలో స్థిర వాసం చెయ్యి
నా గుండెలో ఉప్పొంగే కవితామృతాన్ని కడుపారా త్రాగు
నా శతృవులు,ద్రోహాలు, నా పేదరికం నా గుండెలో ఉన్న రక్తాన్ని పూర్తిగా పీల్చి వేసినా హిమాలయంతో పోల్చ తగ్గ తెల్ల దనం ,చల్లదనం, నువ్వైనా ఊహించలేని కొత్తదనం, ఉట్టిపడే గట్టి గుండె ఇది.
నువ్వు సరదా పడే త్రిశూలం చేత బట్టి ,ప్రళయ కాల రుద్ర నాట్యం చేసినా అదరదు,బెదరదు.చెదరదు
నేను వ్రాసిన పిచ్చి గీతలకే మురిసి పోయి కాలాగ్నిలో సైతం
స్వర్ణంలా మెరిసేట్లు చేసావు
నా పేదరికానికి కోత విధించావు
వ్రాత మార్చావు
ఈ ప్రపంచమే వినాశానికేసి బుల్లెట్ లా దూసుకుపోతున్నా
నా గుండె ద్రోహాలతో బండ బారినా కొండ శిఖరాల ఇరుకునుండి ఉరకలేస్తూ పరుగు తోసే నదిలా దిగి వచ్చావు
నా కవిత ఈ భూతలం పై చెవిటి రాజ్యమే సాగుతున్నా
సమస్త ప్రజానీకం సృష్ఠి పరిసమాప్తికే సాయ శక్తులా కృషి చేస్తున్నా
ఋషిలా బ్రతకనిచ్చావు
బతుకు నా ద్యేయం కాదు.
జీవించడం నా లక్ష్యం కాదు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా మానవత్వాన్ని జీవింపచెయడమే నా లక్ష్యం.
కక్ష్య దాటుతున్నానని, తక్షణం నీ తీర్పు అమలు చెయ్యాలని అనిపిస్తూందా రా!
ఈ జనులు ఏ ప్రమోషన్ కోసమో, ఇన్ క్రిమెంట్ కోసమే ఇబ్బంది పెడతారని భయపడకు. వీరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి.
నువ్వు సర్వాలంకార భూషితురాలై, సింహ వాహణమెక్కి, త్రిశూలం చేతపట్టి సిటి జంక్షన్లో కనబడినా పగటి వేషగత్తెని పక్కకు పోతారు.
నా కథ వేరు..
నువ్వే రూపాన వచ్చినా గుర్తు పడతా .. శిరస్సు వంచుతా
తరచూ రాక్షసులనే వధిస్తుంటే
ఏమున్నది మజా..వెరైటిగా నా తల నరుకు.
నా మస్తిష్కమంతటా నిండి ఉన్న విశ్వప్రేమ రక్త రూపేణా నీకు పాదాభిషేకం చెయ్యనీ
ఆ చల్లదనంతో కలి పురుషిని కేకలతో గమ్యం మరచిన వ్యర్థ మానవుల ,వ్యర్థ జీవితాలతో వేడెక్కిన నీ శిరస్సు చల్లబడనీ ! ఆ చల్లదనంతో, నీ తల్లి గుండే కరగనీ !
సరి కొత్త ఉషస్సును ప్రసాదించు నా జాతికి
పట్టం కట్టు నీతికి
ఒక తల్లి నలుగురు బిడ్డలను పోషిస్తుంది.
కాని ఆ నలుగురు కలిసి ఒక తల్లిని పోషించ లేక
ఓల్డేజ్ హోమ్ పాలు చేస్తారు
హే మహోదరి!
ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా
కడుపులో ,కళ్ళల్లో పెట్టుకుని
దాచుకుంటున్న నిన్ను వీరిలో ఏ ఒక్కరన్నా
తమ గుండెలో దాచుకోలేక
నాలుగు గోడల మద్య భంధించడం విడ్డూరం
త్యాగేశుడు అని శివయ్యను కీర్తించే ఈ లోకంలో నిన్ను
త్యాగేశ్వరిగా ఎందుకు గుర్తించటం లేదు?
రా ..నీ విశ్వరూపంకన్నా విశాలమైన నా గుండెలో దాచుకుంటా..
ఆ నాలుగు గోడల మద్య ఉండి నువ్వు సాధించిందేమి
వాస్తు దోషాలు,గ్రహ దోషాలు అంటని నా గుండెలో స్థిర వాసం చెయ్యి
నా గుండెలో ఉప్పొంగే కవితామృతాన్ని కడుపారా త్రాగు
నా శతృవులు,ద్రోహాలు, నా పేదరికం నా గుండెలో ఉన్న రక్తాన్ని పూర్తిగా పీల్చి వేసినా హిమాలయంతో పోల్చ తగ్గ తెల్ల దనం ,చల్లదనం, నువ్వైనా ఊహించలేని కొత్తదనం, ఉట్టిపడే గట్టి గుండె ఇది.
నువ్వు సరదా పడే త్రిశూలం చేత బట్టి ,ప్రళయ కాల రుద్ర నాట్యం చేసినా అదరదు,బెదరదు.చెదరదు
నేను వ్రాసిన పిచ్చి గీతలకే మురిసి పోయి కాలాగ్నిలో సైతం
స్వర్ణంలా మెరిసేట్లు చేసావు
నా పేదరికానికి కోత విధించావు
వ్రాత మార్చావు
ఈ ప్రపంచమే వినాశానికేసి బుల్లెట్ లా దూసుకుపోతున్నా
నా గుండె ద్రోహాలతో బండ బారినా కొండ శిఖరాల ఇరుకునుండి ఉరకలేస్తూ పరుగు తోసే నదిలా దిగి వచ్చావు
నా కవిత ఈ భూతలం పై చెవిటి రాజ్యమే సాగుతున్నా
సమస్త ప్రజానీకం సృష్ఠి పరిసమాప్తికే సాయ శక్తులా కృషి చేస్తున్నా
ఋషిలా బ్రతకనిచ్చావు
బతుకు నా ద్యేయం కాదు.
జీవించడం నా లక్ష్యం కాదు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా మానవత్వాన్ని జీవింపచెయడమే నా లక్ష్యం.
కక్ష్య దాటుతున్నానని, తక్షణం నీ తీర్పు అమలు చెయ్యాలని అనిపిస్తూందా రా!
ఈ జనులు ఏ ప్రమోషన్ కోసమో, ఇన్ క్రిమెంట్ కోసమే ఇబ్బంది పెడతారని భయపడకు. వీరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి.
నువ్వు సర్వాలంకార భూషితురాలై, సింహ వాహణమెక్కి, త్రిశూలం చేతపట్టి సిటి జంక్షన్లో కనబడినా పగటి వేషగత్తెని పక్కకు పోతారు.
నా కథ వేరు..
నువ్వే రూపాన వచ్చినా గుర్తు పడతా .. శిరస్సు వంచుతా
తరచూ రాక్షసులనే వధిస్తుంటే
ఏమున్నది మజా..వెరైటిగా నా తల నరుకు.
నా మస్తిష్కమంతటా నిండి ఉన్న విశ్వప్రేమ రక్త రూపేణా నీకు పాదాభిషేకం చెయ్యనీ
ఆ చల్లదనంతో కలి పురుషిని కేకలతో గమ్యం మరచిన వ్యర్థ మానవుల ,వ్యర్థ జీవితాలతో వేడెక్కిన నీ శిరస్సు చల్లబడనీ ! ఆ చల్లదనంతో, నీ తల్లి గుండే కరగనీ !
సరి కొత్త ఉషస్సును ప్రసాదించు నా జాతికి
పట్టం కట్టు నీతికి
Tuesday, June 22, 2010
అమ్మవారి శత నామావళిలోని నామాల పరమార్థాలు
2000,డిసెంబరు,23 నుండి శాక్తేయంలో అడుగుపెట్టిన నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలిగినవి. వాటిలో ఒకటి అమ్మవారి దివ్య నామాల్లోని గూడార్థాలు. వాటిలో రెండింటికి నాకు స్ఫురించిన అర్థాలను ఈ టపా ద్వారా మీకంద చేస్తున్నా. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అంద చేస్తారని భావిస్తున్నా.
అంబికాపుర వాసిని:
అంబరం అంటే ఆకాశం. మూలాధార చక్రం భూ తత్వం. సహస్రారం ఆకాశ తత్వం. కుండలి సహస్రాన్ని అందుకుంటే అంబ సాక్షాత్కరిస్తుంది. ఆకాశాన్ని సూచించే సహస్రారాన్ని అంబరం అని అర్థం చేసుకుంటే అంబ వసించే స్థానాన్ని అంభికాపురమని చెప్ప వచ్చుగా. ఈ నేపథ్యంలో ఆవిడ అంబికాపుర వాసిని కాదా?
అన్న పూర్ణేశ్వరి :
అన్నమంటే అందరికి తెలుసు. ఈ ప్రాణుల శరీరాలను నడిపే ఇందనం. అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారుగా. ఉత్తిదే అన్నేశ్వరి అంటే సరి పోయేదిగా . అన్న పూర్ణెశ్వరి అనడం దేనికి? పూర్ణం అంటే తెలుసు నిండుతనం. అన్నానికి నిండుతనాన్ని ఇవ్వడం ఏంది?
అన్నం అన్నమేగా అని మీరు ప్రశ్నిస్తారు.
ఈ రోజు పెగ్గి ఎక్కువై దొడ్డు బియ్యాన్ని ముట్టే వారు లేరు. ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రతి ఒక్కరు ఫైన్ రకమే వాడుతున్నారు.ఒకే ఇంట ఒకే తల్లి చేతి వంట తిన్న నలుగురు కొడుకుల్లో ఇద్దరు దుర్మరణం/అకాల మరణం పాలయ్యేరు. ఒకతను స్వార్థానికి పరిమితమై భంధు సముద్రానికి, మిత్రమండలికి సైతం దూరమయ్యేడు. ఆ నలుగురిలో ఒకడినైన నేను మాత్రం ఇలా ఉ న్నాను. ఇదెలా సాధ్యమైందంటే వారు ఆరగించిన అన్నానికి ఆ అన్న పూర్ణేశ్వరి పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు.
అన్నానికి పూర్ణత్వం ఏమని మీ ప్రశ్న అంతేగా? కేవలం మాంశాన్ని మాత్రమ్ పెంచే అన్నం పూర్ణమైంది కాదు. మరి భుద్దిని పెంచే అన్నం పూర్ణమైందా అంటే అది కాదు. మరి ఏది పూర్ణత్వం గల అన్నమంటే..
ఏదైతే మనిషి హృదయాన్ని పెంచుతుందో, ఏదైతే అతని హృదయంలో సంస్థ ప్రపంచానికి చోటు కలిగిస్తుందో ఆ అన్నమే పూర్ణత్వం సమ కూరిన అన్నం. అన్నానికి పూర్ణత్వం కల్పించే సత్తా ఒక్క అంబకే ఉంది .అందుకే అందుకే ఆవిడకు అన్న పూర్ణేశ్వరి అన్న బిరుదు.
అంబికాపుర వాసిని:
అంబరం అంటే ఆకాశం. మూలాధార చక్రం భూ తత్వం. సహస్రారం ఆకాశ తత్వం. కుండలి సహస్రాన్ని అందుకుంటే అంబ సాక్షాత్కరిస్తుంది. ఆకాశాన్ని సూచించే సహస్రారాన్ని అంబరం అని అర్థం చేసుకుంటే అంబ వసించే స్థానాన్ని అంభికాపురమని చెప్ప వచ్చుగా. ఈ నేపథ్యంలో ఆవిడ అంబికాపుర వాసిని కాదా?
అన్న పూర్ణేశ్వరి :
అన్నమంటే అందరికి తెలుసు. ఈ ప్రాణుల శరీరాలను నడిపే ఇందనం. అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారుగా. ఉత్తిదే అన్నేశ్వరి అంటే సరి పోయేదిగా . అన్న పూర్ణెశ్వరి అనడం దేనికి? పూర్ణం అంటే తెలుసు నిండుతనం. అన్నానికి నిండుతనాన్ని ఇవ్వడం ఏంది?
అన్నం అన్నమేగా అని మీరు ప్రశ్నిస్తారు.
ఈ రోజు పెగ్గి ఎక్కువై దొడ్డు బియ్యాన్ని ముట్టే వారు లేరు. ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రతి ఒక్కరు ఫైన్ రకమే వాడుతున్నారు.ఒకే ఇంట ఒకే తల్లి చేతి వంట తిన్న నలుగురు కొడుకుల్లో ఇద్దరు దుర్మరణం/అకాల మరణం పాలయ్యేరు. ఒకతను స్వార్థానికి పరిమితమై భంధు సముద్రానికి, మిత్రమండలికి సైతం దూరమయ్యేడు. ఆ నలుగురిలో ఒకడినైన నేను మాత్రం ఇలా ఉ న్నాను. ఇదెలా సాధ్యమైందంటే వారు ఆరగించిన అన్నానికి ఆ అన్న పూర్ణేశ్వరి పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు.
అన్నానికి పూర్ణత్వం ఏమని మీ ప్రశ్న అంతేగా? కేవలం మాంశాన్ని మాత్రమ్ పెంచే అన్నం పూర్ణమైంది కాదు. మరి భుద్దిని పెంచే అన్నం పూర్ణమైందా అంటే అది కాదు. మరి ఏది పూర్ణత్వం గల అన్నమంటే..
ఏదైతే మనిషి హృదయాన్ని పెంచుతుందో, ఏదైతే అతని హృదయంలో సంస్థ ప్రపంచానికి చోటు కలిగిస్తుందో ఆ అన్నమే పూర్ణత్వం సమ కూరిన అన్నం. అన్నానికి పూర్ణత్వం కల్పించే సత్తా ఒక్క అంబకే ఉంది .అందుకే అందుకే ఆవిడకు అన్న పూర్ణేశ్వరి అన్న బిరుదు.
Subscribe to:
Posts (Atom)

