Sunday, December 13, 2015

கலைஞருக்கு !

படைப்பாற்றலின் உச்சம் சிற்பம். அதன் நீச நிலை கட்டுரை. இடைப்பட்டவையே வண்ண ஓவியங்கள்,கோட்டோவியங்கள்,கவிதைகள்.
கவிதையில் ஆரம்பித்து கட்டுரைக்கு இறங்கி வந்திருக்கும் ஆசுகவி நான்.இந்த கட்டுரை கவிதை போல் காட்சியளித்தால் அது பழைய "வாசனையே"

என் சகல செயல்பாடுகளின்  மூலம் என் சிந்தனை. என் சிந்தனைகளின் மூலம் பிறப்பறுத்தல்.

மானிடராய் பிறத்தலரிது என்ற அவ்வையின் வரிகள் எனக்கு ஏற்புடையவை அல்ல. சக மனிதர்களின் சமாதி வாழ்க்கை என்னைஅவளுடன் முரண்பட செய்துவிட்டது.

சில யுக புருடர்களின் -அதிமனிதர்களின் சாதனைகளே என்னை தற்கொலையில் இருந்து தப்புவித்தது.

நான் கானமயிலாட கண்டிருந்த வான் கோழி அல்ல. கீழ் வான் மிசை ஒளிர்ந்த சூரியர்களின் ஒளியை உறிஞ்சிய சந்திரன்.

என் சூரியர்கள் அனைவருமே மரண ராகுவால் விழுங்கப்பட்டுவிட்டனர். சமகாலர்களின் சரித்திர சொரணையற்ற போக்கால் அவர்களின் நினைவும் சமுதாய நீரோட்டத்தில் இருந்து நீங்கி வருகின்றன.

எனக்கு ஒளி தந்த சூரியர்களில் மேலைக்கடல் மிசை கடைசி கிரணங்களை வீசிக்கொண்டிருக்கும் கலைஞரே உமக்காகத்தான் இந்த கட்டுரை.
உமக்காக என்பதை விட கடல் கடந்தும் பரவி வாழும் தமிழர்களுக்காக என்பதே சரியாக இருக்கும்.உமக்கான மடல் எனில் தபாலில் சேர்த்திருக்கலாமே.

எந்த நதியும் புனிதமாகத்தான் புறப்படுகிறது .இடைப்பட்ட பயணத்தில் தானே அத்தனை அழுக்குகளும் சேர்ந்து கொள்கின்றன.

நதியையேனும் ஒரு பெருமழை-வெள்ளம் சுத்திகரித்து விடுகிறது. 93 வருடங்களாய் பயணித்து வரும் இந்த நதி ..

கடலில் விழும் முன்னேனும் தன்னை புனிதப்படுத்தி கொண்டே ஆகவேண்டும்.கடலுக்காக அல்ல தாகத்தால் தவிக்கும் உயிர்களுக்காக

இந்த  நதியின் கரைகள் ஆக்கிரமிப்புக்குள்ளாகியதும் இதன் நலிவுக்கு ஒரு காரணம். நதிதான் தன் கரைகளை தீர்மானிக்க வேண்டுமே தவிர நதிக்கரை மனிதர்கள் அல்ல.

பாதையில் மேடு பள்ளங்கள் வரலாம்.மேட்டை கரைத்தும்,பள்ளத்தை நிரப்பியும் ஓடவல்லது நதி.

இந்த நதி தன் பாதையில் தானே உருவாக்கிய மேடுகளே அதிகம்.மேடுகள் இதை சில காலம் நிறுத்தியிருக்கலாம்.

அந்த கால கட்டத்தில்  இது பக்கவாட்டில் பரவியது.இலக்கிய சோலைகள் ,கலை பூங்காங்கள் செழித்தன.

பரவியதே தவிர வற்றிவிடவில்லை. திசையை மாற்றிக்கொண்டு விடவில்லை.

சில மேடுகளை காலம் கரைத்தது - சிலவற்றை இதுவே கரைத்தது.
மேடுகளை கரைத்ததில் நதியின் நிறம் சற்றே மாறியது .

ஆனாலும் என்ன ஓடிக்கொண்டே தான் இருக்கிறது.
கடல் கண்ணுக்கு தெரிய நதிக்கு உத்வேகம் பிறக்குமாம்.

அது போல் கலைஞரே !
குறுக்கப்பட்ட கரைகளை விஸ்தரித்து
சோர்வுற்ற மனதை சொஸ்தப்படுத்திக்கொண்டு
பாய்ந்தே ஆகவேண்டும்.

வாழும் போது இந்த வையகம் எந்த சாதனையாளனைத்தான் தலையில் தாங்கியது?
அவன் விழும் போது மடியில் தாங்கியது !
உலகம் பேசட்டும் ..
அதற்கு உம் கடந்த காலம் மட்டுமே தெரியும்.
எதிரிகள் ஏசட்டும்.
அவர்களுக்கும் அதுவும் முழுமையாக தெரியாது.

கழுகின் உயரம் தெரிந்தும் பிணந்தின்னி என்று பே(ஏ)சுவது ஒரு மன நோய்.
உம் வேலை அந்த மன நோயாளிகளுக்கு மருத்துவம் பார்ப்பதில்லை.

நீர் விழும் போது உமை தாங்கி
நீர் எழும்போது விலகி நின்று வியக்கும் வ்யக்திகளுக்கு என்ன செய்யப்போகிறீர்?

உம் சரித்திர தப்பிதங்களுக்கும் சாணக்கிய கற்பிதங்கள் செய்து உமை தூக்கி பிடிக்கும் தொண்டனுக்கு என்ன செய்யப்போகிறீர்?

பல கல்ப்பங்களுக்கு பேசப்பட வேண்டிய உம் வாழ்வு உமது அல்ப்ப ஆசைகளால்
ஏச்சுக்கும் பேச்சுக்குமே ஆளாகிவிட்டதை இப்போதேனும் உணர்கிறீரா?

தோல்விகளில் இருந்து பாடம் கற்கலாம்
எதிரிகளிடம் இருந்து அல்ல.
எதிரிகளிடம் கற்ற "இலவச" பாடங்களை இப்போதே எரித்து போடுங்கள்.
இலவசங்கள் உம்மை எம்.ஜி.ஆர் ஆக்கப்போவதில்லை.
ஆனால் உம்மிலான கலைஞரை மட்டும் காயடித்துவிட்டன.

சரித்திரத்தில் ஒரு எம்.ஜி.ஆர் தான் ஒரு கலைஞர் தான்.
எம்.ஜி.ஆர் எம்.ஜி.ஆர் தான்
கலைஞர் கலைஞர் தான்.
கலைஞர் எம்.ஜி.ஆராக முடியாது.ஆனால் கலைஞர் கலைஞராக  மீண்டு வர முடியும்.

மக்கள் மாறி விட்டார்கள் .
ஈழத்தில் இனம் அழிந்தால் என்ன தாம் வாழ்ந்தால் போதும் என்பவர்களாகி விட்டார்கள். ஈழத்துக்காக இருமுறை ஆட்சி இழந்த உமக்கு - மீட்க முடியாது போன உமக்கு, நாற்பதும் வென்ற உமக்கு  நான் சொல்ல தேவையில்லை .

நீரிட்ட முட்டைகள் வாக்கு குஞ்சுகளை பொரித்திருந்தால் அது வேறு கதை. நீர் தந்த தொலைக்காட்சி பெட்டிகள் வாக்கு ஒளிபரப்பை செய்திருந்தால் அது வேறு கதை .பிறகு ஏனிந்த வதை?

இன்றைய மக்களுக்கு தேவை தமிழோ -தமிழின் பெருமையோ -எதுகை மோனைகளோ -பழம் பெருமையோ -குறியீடுகளோ -மானில உரிமைகளோ, மானில சுயாட்சியோ -சுயமரியாதையோ  அல்ல.

சின்ன கூட்டுக்குள் அடைந்து கொள்ள - கொஞ்சம் பொருள் -அந்த பொருள் தேட ஒரு தொழில். ஈட்டிய பொருள் டாஸ்மாக்கிலோ -முகமூடி கொள்ளையர்களாலோ பறி போய்விடாத நிலை. இதற்கு தேவை நிர்வாகம். சீரிய நிர்வாகம்.

வெந்ததை தின்று விதி வந்தால் சாக இந்த மக்கள் தயார்.
நிர்வாகம் என்ற ஒன்றே  நிர்மூலமாகிப்போன இந்த நிலையில் மக்களுக்கு தேவை ஒரு கலைஞர் -கலைஞர் மட்டுமே..

இந்த ஆட்சியில் பால் விலை ஏறியது ,பஸ் கட்டணம் உயர்ந்தது ,மின் கட்டணம் ஏற்றப்பட்டது .கூடவே கடனும் இருமடங்கானது .
சமீபத்திய உமது ஆட்சியில் இந்த விலையேற்றம் -கட்டண உயர்வு நடந்திருந்தால் தமிழகத்தின் முன்னேற்றம் பத்தாண்டுகளுக்கு முன்னோக்கி தவ்வியிருக்கும்.

நீங்களோ எம்.ஜி.ஆர் ஆகிவிடவேண்டும் என்ற கனவில் எதையும் ஏற்றவில்லை .ஆனாலும் மக்கள் உம்மை போற்றவில்லை.

 நீர் நீராக இருக்கவேண்டும் -வேறாக வேண்டாம்.

வேர்களை மறந்த மரம் உயர்வதில்லை.
பழுத்த இலைகளை உதிர்க்காத மரம் துளிர்ப்பதில்லை.
விதைகளை உதிர்க்காத மரம் பரவுவதில்லை.

வான பிரஸ்த வயதில் போருக்கு தயாராக சொல்லவில்லை.
போருக்கு தயாராக இருக்கும் தளபதிக்கு வீரத்திலகமிட சொல்கிறேன்.

உமது வாழ்க்கை காவியம் தான். இல்லை என்பதற்கில்லை.
ஆனால் அதன் திருத்திய பதிப்பே இன்றைய காலத்தின் கட்டாயம்.

 நீர் பிழை திருத்தத்துக்கு  தயாராகி விட்டால் இனி உமக்கோ -தமிழகத்துக்கோ வருத்தத்துக்கு வழியே இல்லை.
செய்வீரா?

Tuesday, January 25, 2011

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

నేస్తం!


ఒకే దిశలో ఒకే గమ్యానికేసి సాగుతున్నవారం.

కొందరు పడవల్లో,కొందరు నావల్లో ..

అయినా నావైనా,పడవైనా చివరికి చేరేది మరణ తీరాన్నేగా

ఆలోపు తొందరేలా..



నాకూ ఈ ప్రపంచం పోకడ నచ్చడం లేదు.

అందుకని బాయ్ కాట్ చేసెయ్యాలా?

అది చేతగాని ప్రజా ప్రతినిదులు చేసే పని.



మనముందాం.. ఏ గృడ్డి ప్రపంచమా!

నీ పోకడ మాకు నచ్చలేదందాం.

మన వాణి వినిపిద్దాం

బోణి కాకుంటే బాణి మారుద్దాం

కాణీలకోసం ఖూనీలు చేసేసే

చెత్తనా కొడుకులకు తెలీదు

వారు ఎవరినో చంపినప్పుడు

వీరిలో కూడ ఏదో చస్తుందని

వారే బతికేస్తుంటే మనం చావడం దేనికి?



ప్రపంచానికి అనువుగా తమరిని తాము మలుచుకునే

పిరికి పందలు వీరంతా..

ఈ ప్రపంచాన్ని మన కలలకనుగుణంగా మార్చ చూసి

మార్చలేమేమోనన్న దిగులుతో బతుకు మీద నిరాసక్తతతో

చావు గురించి ఆలోచించామే గాని

వీరిలా "బతక" లేక చావు వంక చూసామేగాని

మోసానికి గురై యమ పాశానికి మెడలు వంచాలనుకున్నామే గాని



నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరికీ బతకాలని లేదు.

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

చచ్చే ధైర్యమే మనకుంటే బ్రతకడం ఎంతో సుళువు



చావడానికే సిద్దమైనవాడు మరి దేనినైనా బతికించగలడు

చచ్చిన మానవత్వాన్ని

చచ్చి పోతున్న ప్రజాస్వామ్యాన్ని



పేదరికం మనలను మనకు పరిచయం చేస్తుంది..

తిరస్కారం మనలను మనకు దగ్గర చేస్తుంది



మనలను మనం పరిచయం చేసుకుని

మనకు మనం దగ్గరై దగ్దం చేస్తాం పేదరికాన్ని

ప్రేమిద్దాం సమస్త విశ్వాన్ని..

Monday, January 24, 2011

పాత సినిమాలు Vs కొత్త సినిమాలు

పా.........త సినిమాల్లోను విలన్స్ ఉండేవారు ( ప్రస్తుత సినిమాల్లోని హీరోలకంటే బెటర్). తొలూత క్లైమేక్సులో ఒక కానిస్టబుల్ "పున్య్! పున్య్!" అంటూ వచ్చి విలన్ని కస్టడిలోకి తీసుకునే వాడు.శుభం కార్డు పడుతుంది. ఆతరువాతి సినిమాల్లో కానిస్టబుల్ అవినీతి పరుడు ఎస్.ఐ మంచోడు, ఆతరువాతి సినిమాల్లో ఎస్.ఐ కూడ విలన్లతో చేతులు కలుపుతాడు. డి.ఎస్.పి వచ్చి న్యాయం చేసేవాడు. ఆతరువాతి సినిమాల్లో డి.ఎస్.పి విలన్ డెన్లో మందు కొట్టి పడుకోనుంటాడు (స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్?)

ఇది క్రమేనా డెవల్ప్ అయ్యి హోమ్ మినిస్టర్ చెడ్డోడు సి.ఎమ్ మంచోడనే స్థాయికి పోయింది. ( డా.రాజశేఖర్ రెడ్డి సినిమా) . ఆతరువాత రాజకీయనాయకులందరు చెడ్డోళ్ళు పత్రికల్లోళ్ళే ఉత్తములని చూపారు ( ఆఖరి పోరాటం). ప్రస్తుతం మీడియా బతుకెంతే అందరికీ తెలిసి పోయింది.

ఈ దశాబ్దంలో కోర్టులు చురుగ్గా/ చక్కగా  పని చేస్తున్నాయనే ఇమేజ్ వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక నవశకాన్నే ప్రారంభించాయి. ప్రస్తుతం స్పెక్ట్ర్రం కుంభకోణం విషయంలోనూ ఇదే జరిగింది.

న్యాయశాఖకు  దినకరన్ వంటి న్యాయమూర్తులు మాయని మచ్చ తెచ్చిన మాట అవతల ఉంచుతాం, తమిళనాడులో ఒక కేసు విషయమై బెయిల్ మంజూరు చెయ్యాలని తన పై వత్తిడి తెస్తూ "కేంద్రమంత్రి లైన్లో ఉన్నారని" పబ్లిక్ ప్రాసిక్యూటర్  బదిరించినట్టు న్యాయమూర్తి సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తికి లేఖ వ్రాసారు. అందులో ఆ మంత్రి పేరు పేర్కొన్నట్టు మీడియాకు చెప్పారు.

కాని అప్పటి  సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారు ఆ లేఖలో మంత్రి పేరు లేదని చెప్పడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతకీ ఆ మంత్రెవరో తెలుసా? టెలికాం స్కామ్ కింగ్ రాజా.

ఇప్పటి మానవహక్కుల కమిషన్ కె.జి.బాలకృష్ణన్ భంధువులపైనా ఆరోపణలొచ్చిన నేపథ్యంలో కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టు న్యాయశాఖ కూడ ఇటువంటివాటికి అతీతం కాదనే భావన ప్రజల్లో కలింగింది.

గతంలో నేను 1997 నవంబరు నుండి నాటి సి.ఎమ్.చంద్రబాబుగారికి నా ఆపరేషన్ ఇండియా2000 ప్రాజక్టును ప్రతిపాదిస్తూ వచ్చి -సమాదానం రాక విసిగి వేసారి -తిరుగు టపా ఖర్చులకై పది రూపాయలు ఎం.ఓ పంపాను -అదీ తీసుకున్నారే గాని స్పందించలేదు.

ఈ యవ్వారం పెయిడడ్ సర్వీసుగా మారినందున జిల్లా వినియోగదారుల ఫోరమ్ కు ఫిర్యాదు చేసాను "ఇందులో సేవా లోపం"లేదని కొట్టేసారు. రాష్ఠ్ర్ర ఫోరానికి అప్పీల్ చేసాను. నో రెస్పాన్స్. ఈ విషయమై తమిళనాడు ,ఆంద్రా హై కోర్టులకే కాదు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు సైతం డజనుకు పైగా అన్ని ఆధారాలతో లేఖ వ్రాసాను.

కాని నా ఒక్క లేఖను సైతం సుమోటాగా స్వీకరించలేదు. కాని శంకర్ రావు కేవలం ఒక రాజకీయ నాయకుడు. అధికారం కోసం/అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ మాటైనా చెప్పగల వ్యక్తి. ఇంతకీ అతని లేఖ మీడియా వారికి అడ్రెస్ చేయబడినది.

దానిని సుమోటాగా స్వీకరించిన కోర్టు మరి నా లేఖలనెందుకు పట్టించుకోలేదో? ఎవరన్నా న్యాయ నిఫుణులు సమాదానమిస్తే సంతోషిస్తా..

గమనిక:
హై కోర్టు ,సుప్రీమ్ కోర్టులకు నేను లేఖలు పంపినందుకు డాకుమెంటరి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. మీలో ఎవరైనా కోరితే స్కాన్ చేసి పెడతాను.

హై కోర్టు నోటీసులతో జగన్ పని గోవిందా!

ఇదే  ఈ రోజు స్టుడియో ఎన్ చానల్లో ప్రముఖంగా ప్రసారమిన కథనం యొక్క సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటి?.గతంలో  మంత్రి శంకర్ రావు జగన్ సంస్థల్లో పెట్ట్టు బడుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసేరు. వాటిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై 52 మందికి నోటీసులు జారి చేసింది ( గమనించండి: తీర్పు వినిపించలేదు)

ఈ మాత్రానికి ఇంత అత్యుత్సాహం చూపుతున్నారంటే జగన్ దెబ్బకి ఎంతకి దిమ్మతిరిగి ఉన్నారో అర్థమవుతూనే ఉంది.  వారి ముఖ్య ఆరోపణ ఏమంటే ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే షేర్లెలా అమ్ముడు పోయాయి? వాటి విలువా ఏటా ఎలా పెరిగాయి?

వారి ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాన్ని,వై.ఎస్.ని మచ్చిగ చేసుకోవడం కోసం "ఎవరో" పెట్టుబడులు పెట్టారన్నదే.

మీరో నేనో వెళ్ళి ఒక సినిమా తియ్యాలనుకుంటే ఆ సినిమాకయ్యే ఖర్చు మొత్తం హాట్ కేష్ గానో, బ్యాంక్ బేలన్సుగానో కలిగి ఉండాలి. ఇదే ఒక "విశ్వసనీయత"గల సంపన్నుడు / ప్రముఖుడు సినిమా తీయాలనుకుంటే ఒక ఏ4 కాయితం మీద ఒక్క రూపాయి స్కెచ్ పెన్నుతో ప్రొడక్షన్ నెం. వన్ అని వ్రాసి బొట్టు పెట్టి  హారతి ఇస్తుంటే ఆ హారతి తాలూకు  కల్పూరం ఆరే లోపల ఏరియాలు సేల్ అయిపోతాయి. అడ్వాన్సులు కోట్లల్లో అందుతాయి.

దీనిని అవినీతి అంటారా? జగన్ ఉత్సాహవంతుడు,సమర్థుడు, విద్యావంతుడు, ఎప్పట్లోనుండో కార్పోరేట్ రంగంలో ఉంటూ అనుభవం గడించినవాడు. పైగా వై.ఎస్. తనయుడు. మాట తప్పను -మడమ తిప్పను అనే పంచ్ డైలాగుతో రీ ఎంట్రి ఇచ్చి దుమ్మురేపిన ప్రాక్టికల్ హీరో వై.ఎస్.. ఇన్ని అంశాలను పట్టి పెట్టుబడి పెట్టేవారు పెడతారు.

ఇందుకు జగన్ని భాధ్యుడ్ని చెయ్యడం ఎంతమెరకు తర్కం? ఇంతకీ నత్తి-సుత్తికి పేటెంట్ రైట్ కలిగి  ఊక దంపుడు మాటలు విసిరే శంకర్ రావు మాటల్లో ఏమెరకు పస ఉంది? నాకేమో ఇది జగన్ కు పరీక్షలా అనిపించడం లేదు.  శంకర్ రావు మాటలు ఆధార రహితమని తేలడం ఖాయం.

మీరు నేను టీ కొట్లో మాట్లాడుకోవడం వేరు.. బ్లాగుల్లో బండ భూతులు వ్రాసుకోవడం వేరు. కాని శంకర్ రావు ఒక మంత్రి .అతని మాటలు నిరాధారమైనవని తేలితే కోర్టు అభిశంసించవచ్చు. జగన్
మంత్రి పైన , దూకుడుగా ఏక పక్ష వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్ళ పైన లక్షల కోట్లకు పరువు  నష్ఠదావా వేయ వచ్చు.

అదే జరిగితే చానళ్ళకు కాపలా కాస్తున్న సెక్యూరిటి కుర్చీ సైతం జప్తుకు గురికావచ్చు.

విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం.. అంతేనా?

ఇటీవల సైకలాజికల్ స్ట్ర్రెస్ కి జ్యోతిష పరిష్కారం చూపే ఒక బృహత్తర భాధ్యత నా మీద పడింది.  స్ట్ర్రెస్ కి గురైన వారు ఫోన్ చేస్తారు (ప్రతి రోజు రా.9 నుండి10 లోపు) వారి మానసిక వత్తిడికి కారణమేమో తెలుసుకుని జ్యోతిష రీత్యా ఒక పరిహారం/పరిష్కారం చూపడం చెయ్యాలి.

ఈ కార్యక్రమం ద్వారా నేను ఇప్పటికి వందకు పైగా ఫోన్ కాల్స్ అట్టెండ్ చేసాను. కాని వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళికి సంభంధించినవే. జీవితమంటే ఈ నాలుగేనా? వీటికి అవతల గాని ఇవతల గాని  ఏమీ లేదా? అనిపించింది నాకు. ఇదిలా సాగడం వెనుక కారణాలేమిటి? ఇది సబబేనా?దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం పై నాలుగు ముక్కలు రాద్ద్దామని మొదలు పెట్టా. 

పాయింటుకొచ్చే ముందు ఈ సదవకాశం నాకెలా దక్కిందో పది ముక్కలు..పదే ముక్కలు .

గూగుల్ వారు రకరకాల సదుపాయాలు కల్పిస్తుండటం అందరికి విదితమే. అందులో ఒకటి ఎస్.ఎమ్.ఎస్. గ్రూపులు ఏర్పాటు చేస్కోవడం. అలా ఏర్పాటైన ఒక గౄపు స్ఫూర్తి . ఈ గృపును ఏర్పాటు చేసి స్వంత డబ్బు వేలల్లో వెచ్చించి పత్రికా ప్రకటనలిచ్చి మరి దానిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ( సైట్లో పెట్టిన యాడ్ కు నేను డబ్బు తీసుకోలేదు బాసు)  . ఆ గ్రూపులో ఇప్పటికి ముప్పై వేల మంది ఉన్నారని  విన్నాను. గౄపు సభ్యులకు ప్రతి రోజు ఒక పాజిటివ్ ఎస్.ఎమ్.ఎస్. పంపుతారు.

ఈ గృపును ఏర్పాటు చేసి ప్రమోట్ చేస్తున్నది చిత్త్రూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ యజమాణి శ్రీ జితేంద్రబాబు జైన్. వారు తమ గౄపు సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగలరా అని అడగడం  - నేను సై అనడంతో ఈ అవకాశం దక్కింది.

జీవితమంటే విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం ఈ నాలుగేనా? ఒకే ఒక్క ఫోన్ కాల్ కూడ ఈ నాలుగింటికి అవతలగాని ఇవతలగాని రాలేదు. వీటికున్న గొప్పతనం ఏంది? వీటి మధ్య ఉన్న సంభంధం ఏమి? వీటికి అవతల ఏముంది?

ఈ సృష్ఠి అంతటా వ్యాపించి ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. ప్రకృతి మగ ఏనుగుకి దంతాలిచ్చింది ఆడ ఏనుగును ఆకర్షించడానికే.  నెమలి పుంజుకి పురి ఇచ్చింది , పెట్టను ఆకర్షించటానికే. పువ్వులు పూచేది తేనెటీగలను ఆకర్షించడానికే. మరి ఇవన్ని ఎందుకు?

సృష్టి ఆగిపోక సాగడానికి.

ప్రతి ప్రాణియొక్క ప్రప్రధమ కర్తవ్యాలు కొన్నే. ప్రాణలతో కొన సాగడం . తన జాతి అంతరించి పోకుండా చూడటం. తన జాతి+ తాను వ్యాప్తి చెందేలా ప్రయత్నించడం.

ఇందుక్కావల్సిన పవర్ సృష్ఠినుండే అందుతుంది.  అదే పవర్  మనిషిలోను  ఉన్నది. మనిషిలో నున్నది  ఒకే పవర్.అది సెక్స్ పవర్. అది ఊర్ద్వముఖంగా సాగితే యోగిక్ పవర్. అధోముఖంగా సాగితే సెక్స్ పవర్.

విద్య దేనికి? ఉధ్యోగం వస్తుంది కాబట్టి.. ఉధ్యోగం దేని? అప్పుడే పెళ్ళి అవుతుంది కాబట్టి. పెళ్ళి దేనికి సెక్స్ ఆ పై సంతానం ( జాతిని వ్యాపింప చెయ్యడం).

పరిమితమైన పవర్ గల ప్రాణులు ఇక్కడికి తమ సర్వ శక్తులను పోగొట్టుకుని నిర్వేదానికి జారిపోతాయి. 
పోనీ ఈ ప్రాణులు అవతలకి దూకకుంటే పీడా పోయింది. కనీశం   వీటికి అవతల ఏముందనైనా తెలుసుకోవచ్చుగా?

ప్రతి ఒక్కరికి వీటికి అవతలకెళ్ళే శక్తి సామర్ధ్యాలను ప్రకృతి ఇచ్చింది. కాని మనమే వాటిని గుర్తించడం లేదు. విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం వీటికి అవతల ఏదో ఉందనడానికి ఆధారం ఈ నాలుగింటిని పొందినాక కూడ మనలో ఉన్న అశాంతి,అసంతృప్తులే.

ఈ అశాంతి,అసంతృప్తులు స్మశాన వైరాగ్యంలా కరిగి పోవడంతో మనస్సు ఈ నాలుగింటి వైపే మొగ్గుతుంటుంది. తొలూత ఈ నాలుగింటిని తాను పొందాలని ఉవ్విళ్ళూరే మనస్సు ఆ పై తన వారసులు పొందాలని కుత కుతలాడుతుంది. ఇంకా వయస్సుండి -బతికే ఉంటే ఇవే విషయాలను తన మనమళ్ళకు అందించే ప్రయత్నం కూడ జరుగుతుంది. ఇదో విష వలయం. ఇందులో చిక్కుకున్న తరం అతిత్వరలో అసంతృప్తికి అశాంతికి గురవుతుంది. ఆలోపే సమాజం బ్రష్ఠు పట్టి పోయుంటుంది.

మరి ఈ నాలుగింటికి అవతల ఏముంది?వాటిని అందుకోవాలంటే  ఏం చెయ్యాలి? (తదుపరి టపాలో కొనసాగిస్తా)

Saturday, January 22, 2011

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు అంటూ తమిళనాడు రాజకీయ నాయకుల్లో కొందరు నేతలు (వైగో, నెడుమారన్,సీమాన్) చెబుతూ వచ్చినప్పటికి శనివారం నాడు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ బై వీక్లి నక్కీరన్ కవర్ స్టీరి విడుదల చేసింది. ఆ కథనం ప్రకారం : ఇటీవల అన్నా టెర్మినల్స్ లో దిగిన ఒక జంట ప్రముఖ తమిళ నేత ఒకరిని పిలిపించుకుని " ప్రభాకరన్ బతికే ఉన్నారని - వెస్ట్ ఇండీస్ ధీవుల్లో ఉన్నారని తాము కూడ అక్కడికే వెళ్తున్నామని చెప్పేరు. ఆ జంటలో పురుషుడు చిన్న రూబన్ అనే కమేండర్ అని అతను యుద్దంలోని చరమ గట్టాన తన రెండు చేతులూ పొగొట్టుకున్నవారని నక్కీరన్ తెలిపింది.

ఇది కాక ఇటీవల కెనడా దేశపు గూడచార సంస్థ "లంక యుద్దంలోని చరమ గట్టంలో చనిపోయినట్టుగా భావిస్తున్న ముఖ్యుల్లో చాలామంది బతికే ఉన్నట్టు" కెనడా  ప్రభుత్వానికి నివేదించినట్టూ వార్తలు వస్తున్నాయి.

హెష్చరిక:
మరి ఈ విషయలో సాంబారుగాడికి ఏమిటా తుత్తర అని అడగొచ్చు. చెబుతా? ప్రభాకరన్ జాతకాన్ని అనలైజ్ చేసి జూలై 11,2010 నాడు నా తమిళ బ్లాగులో "ప్రభాకరన్ మరణించ లేదు" అంటూ ఒక టపా వ్రాసాను .దానిని చూడటానికి (ఎలాగూ చదవలేరుగా) ఇక్కడ  క్లిక్ చెయ్యండి. అందులో 2011,నవంబరు 26తరువాత ఈ సంగతి ధృవీకరించ బడుతుందని కూడ పేర్కొన్నాను

ప్రేమ వైఫల్యాలు - ఆత్మ హత్యలు

ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా.

వస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా, పది మందితో పడుకొన్నా ప్రేమిస్తూ ఉండాలంతే.

ప్రేమకు  మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.

ఇటువంటి ప్రేమలను ప్రపోజల్ అని చెప్పొచ్చు. ప్రపోజల్ అన్నది చాలా స్థూలమైన విషయం.  మీరు ప్రపోజ్ చేసినప్పుడే ఎదుటి వారు డిస్పోస్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో  మనతో పాటు చావరు.

ఏ ప్రపంచ సుందరితో నాకు ప్రేమ(?) సక్సెస్ (?) అయినా వృద్దాప్యమూ ఆగదు, నా చావు ఆగదు.   నేను జీవించాలంటే నాకు ఆక్సిజన్ అవసరం.నీరు అవసరం. తిండి అవసరం. ఇవి స్థూలమైన అవసరాలు.ఇవి లేకుంటే చస్తానేమోగాని ప్రేమ లేకుంటే చస్తానా? నెవర్ !

కేవలం ఒక్క  జీవ కణంగా భయలు దేరి, మిల్లియన్ల కొద్ది జీవకణాలతో పోటీ పడి తల్లి గర్భాయశానికి చేరి పసి కందువుగా, చంటి బిడ్డగా, బాలునిగా,యాంగ్రి యంగ్ మ్యేన్ గా మారుతూ వచ్చిన ఈ ప్రాసస్ లో మనకు దోహద పడిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో..

ఎవడో సైంటిస్ట్ ఒక టీకా కనుగొన్నాడు. లేకుంటే తల్లి గర్భమే సమాధి అయ్యేది. మరేదో సైంటిస్ట్ మరేదో టీకా కనుగొన్నాడు. లెకుంటే చంటి బిడ్డగానే చచ్చుండేవారం. ఇల ఒకటి కాదు లక్షల మంది మనలను బ్రతకనిచ్చేరు.పునర్ జీవం పోసేరు. ముందుకు నడిపేరు.

వారికి మనం మనం ఎలా  కృతజ్ఞతలు చెప్పాలి? ఆత్మ హత్య చేసుకునా? అసలు మన ప్రాణం మన సొత్తనుకుంటున్నారా? ఇది కోట్లమంది మనకు పెట్టిన భిక్షం. ఎవరో పిచ్చి ముండ నిన్ను తిరస్కరించిందని ఆత్మ హత్య చేసుకుంటావా?

ఈడ్ని మిస్ అయ్యామే అని ఆమె జీవితాంతం కృంగి కృశించి నశించేలా బతకాలే కాని చచ్చి పోవడమా? షిట్ !

ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి,  ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.

నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..

ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని  చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?

జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..

విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.

స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు.

అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది.

లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్  సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..

Friday, January 21, 2011

ఆత్మ హత్య తలంపు- పుట్టు పూర్వోత్తరాలు

మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం  అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.

డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.

కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.

ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?

సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్.  మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..

బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..

వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?

మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు

Thursday, January 20, 2011

ఆత్మహత్య ఆలోచనను సైతం వాయిదా వెయ్యగల కొటేషన్స్

*ఈ జీవితం వద్దనుకునేగా ఈ నిర్ణయానికొచ్చేరు. తనను వద్దనుకున్న వానికి వరంగా మారడమే జీవితంయొక్క స్పెషాలిటి. విజయపథంలో మీ తొలి అడుగు ఈ ఆలోచన.

*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో  నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?

*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.

*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.

*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.

*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి

*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో  కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.

*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.

నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది. 
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన  మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు  చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.

మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్  వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై  సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.

Wednesday, January 19, 2011

చంద్రబాబు రాష్ఠ్ర్రానికి పెద్ద దిక్కై వ్యవహరించాలి





మూరెడు ఎం.పిలను పెట్టుకుని బారెడు మంత్రి పదవులు తన్నుకు పోయిన కరుణానిది స్వార్థంతో ఆ పని చేసాడో -లేక తెమిళుల సత్తా చాటడానికి చేసాడో అది వేరేకథ. కాని కరుణానిధి ప్రవర్తనను  చూసి యావత్ భారత దేశం బెంబేలెత్తింది.

వై.ఎస్. హయాంలో కూడ బారెడు ఎం.పీలున్నప్పటికి మూరెడు మంత్రి పదవులే దక్కాయి. వై.ఎస్. ఎందుకు ఆ నాడు నిలదీయలేక పోయాడంటే ఒకటి 2009 ఎన్నికల్లో సీట్లు తగ్గడం -రెండు ఈయన గారు కాస్త గొంతు పెంచితే ఆదిష్ఠానం పంచన చేరి వంచన పూరిత నాటకాలాడటానికి కొందరు ముసలి నక్కలు సిద్దంగా ఉన్నారు.

నరసింహరావు పి.ఎం అభ్యర్ధిగా ఖరారయ్యాక నంద్యాల్లో  ఆయన కంటెస్ట్ చేసారు. ఎన్.టి.ఆర్ ఒక్క క్షణం కూడ ఆగక తె.దే.పా పోటి చెయ్యదని ప్రకటించారు.

ఇక్కడ కాన్సెప్ట్ పి.వి శతృ పార్టికి చెందినవారే అయినా అతను ఓ తెలుగు వాడు అన్నదే.
నేడు ఎన్.టి.ఆర్ లేడు. ఎన్.టి.ఆర్ అంత లేకున్నా ఒకింతవరకైనా కేంద్రాన్ని,ఆదిష్ఠానాన్ని  వారి వెక్కిలి వేషాలను అదుపు చెయ్యగల నాయకుడు వై.ఎస్. అతనూ లేక పోయాడు.

ఇక మిగిలింది చంద్రబాబు. ఎంతటినీచ చరిత్ర కలిగి ఉన్నప్పటికి రాష్ఠ్ర్రం యొక్క పెద్ద దిక్కు పోయాక ఆ ఖాళిని పూరించ గల సత్తా- అనుభవం కలిగిన ఏకైక నేత చంద్ర బాబే. ఎన్.టి.ఆర్ ని అమరుడి చేసింది తనే. తీరా అమర్ రహే అని నినదించేదీ ఆయనే.

చంద్రబాబులో ఏ మాత్రం ఎన్.టి.ఆర్ పట్ల గౌరవం ఉన్నా రాష్ఠ్ర్రంలోని పార్టీలు,నాయకులను ఒక్క త్రాటి పై  తెచ్చి ,నడిపించి తెలుగు ఆత్మ గౌరవాన్ని దేశానికి ప్రపంచానికి చాటాల్సిన నైతిక భాధ్యత చంద్రబాబు పైనే ఉంది.

గతంలో తాను సి.ఎం గా ఉన్నప్పుడు  "ప్రతి దాన్ని రాజకీయం చెయ్యడమేనా? అసలు రాజకీయమంటే ఎన్నికలప్పుడే ఉండాలి" అనే బాబు ప్రస్తుతం 365 రోజులు రాజకీయమే చేస్తున్నారు.

వై.ఎస్. పూర్తి మెజారిటితో అధికారానికొచ్చినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మెజారిటి కాస్త తగ్గాక ఆసన్నమైన స్థితిగతులు వేరు. ఆదిష్ఠానం క్రమేనా తన అసలు స్వరూపాన్ని భయిట పెట్టడం మొదలైంది.

ఏదో వై.ఎస్. పుణ్యకార్యాలు అతన్ని అలా అలా పైలోకాలకు తీసుకెళ్ళి పోయాయి కాని,ఆయన బతికుంటే జగన్ పొజిషన్లో వై.ఎస్. ఉండి ఉండేవారు. పైగా సోనియమ్మకు తాను ఇందిరమ్మకంటే ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చేసింది. (ఇంతకీ ఇందిరమ్మ కాలి గోటికి సరిపోదు సోనియమ్మ)  ఉంటే నాతో లేదా మీరంతా నా శతృవులే అన్న చందంగా ఆమె బిహేవియర్ మారింది. రాష్ఠ్ర్ర ఎం.పికలు మంత్రి పదవులు దక్కక పోవడం సోనియమ్మలో ముదిరిపోతున్న అహంకార జబ్బుకు సూచికలు మాత్రమే . ఇది కాస్తా ముదిరిందంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లడం గ్యారంటి. అది రాష్థ్ర్రపతి పాలన కావచ్చు,ఎమెర్జెన్సి కావచ్చు, చట్ట సభను నిద్రావస్థలో ఉంచడం కావచ్చు.

ఈ పరిస్థితిలో రాష్ఠ్ర్రం పెద్ద దిక్కుగా ఉండి పార్టిలను ఒక్క త్రాటిపైకి తెచ్చే భాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. తమిళనాట ఎం.జి.ఆర్ మరణానంతరం కరుణకు ఇట్టి అవకాశమే వచ్చింది. కాని అతను ఆ పెద్దరికం అలవాటు చేసుకోక ఇప్పటికీ కాంగ్రెస్ చంక నాకే దుస్థితిలో ఉన్నాడు.

కాంగ్రెస్ ను రాష్ఠ్ర్రం నుంది తరిమి కొట్టడమే దేయంగా రాష్ఠ్ర్రం యొక్క అభివృద్ది,పరువు ప్రతిష్ఠల పరిరక్షణే లక్ష్యంగా, తెలుగు గౌరవాన్ని నిలిపే విదంగా బాబు ఒక వినూతన స్ట్ర్రేటజిని ప్రకటించాలి.

మనలో మనకు వెయ్యి వైషమ్యాలుండొచ్చు -కాని దిల్లి /కేంద్రం మాటకొస్తే మాత్రం ఒక్క మాట మీద నిలబడాలి . అప్పుడే తెలుగువారమన్న గౌరవం మనకు దక్కుతుంది.

ఈ బృహత్తర భాద్యతను స్వీకరించి బాబు కార్యాచరణ మొదలు పెడితే దిల్లీ వీథుల్లో పొర్లు దండాలు పెట్టే చంచాగాళ్ళు, స్వంత గల్లీల్లో సైతం ప్రజాబలం లెక సిల్లి రాజకీయం చేసే భజన పరుల బెడద పోతుంది.

చూద్దాం ఇప్పటికైనా చంద్రబాబు ఎన్.టి.ఆర్ స్థానాన్ని అందుకుంటారో ?లేక కనీశం వైఎస్ లేని ఖాళినన్నా పూరిస్తారో? లేక కరుణలా తయారవుతారో?

Tuesday, January 18, 2011

సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !

ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)

రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో  ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.

కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.

ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)

విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.

హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.

ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో  స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.

కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.

ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.

ఈ కథనంతో చిర్రెత్తి  2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి

ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.

Monday, January 17, 2011

తూ! నా బతుకు..

ఎవరికైనా సరే తమ బతుకు" పై తూ!  నా బతుకు.." అనే భావం కలిగిందంటే చాలా కష్ఠమవుతుంది. ఇలా అనిపించ కూడదంటే కాషాయం కట్టి కాశికి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మొదట మన సంపాదన -జీవన విధానంలోని నిరర్థకతను అర్థం చేసుకోవాలి. నిన్నటి నా టపా చదవని వారు ఇక్కడ నొక్కి ఒక మారు చదవండి. 

ఇక పాయింటుకొస్తా:

క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!

1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం  సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.

ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక  ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?

ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.

మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.

సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.

కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.

మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల  సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి?  కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?

ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.

ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.

వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...

మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.

జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి.  ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.

న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.

సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే  భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.

సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.

రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.

నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.

లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.

నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.

నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.

దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.

నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.

ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..

నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.

మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"

డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?

పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.

మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.

మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?

మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.

మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.

మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.

ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.

ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..

ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో  గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!

Sunday, January 16, 2011

శాంతికాముకులమని చెప్పుకునే వారికి కోపం వచ్చింది.

అందరికీ సమాదానం ఇస్తూ పోతే ఇక మరో పని చేసుకోలేను కాబట్టి సవివరంగా కమెంటు వ్రాసి ఎన్నో పాయింట్లు అందించిన శంకర్ గారికి ఈ సుధీర్ఘ సమాదానం ఇస్తున్నాను.

నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎటువంటి వైషమ్యం లేదు. వ్యక్తిగతంగా అందరూ నా స్నేహితులే.కాని జయేంద్ర వంటి క్రిమినల్ ను కేవలం కులప్రీతితో వెనకేసుకొచ్చే వారి తత్వాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.

ఇక శంకర్ గారి విమర్శ + నా ప్రతి విమర్శ ఇక్కడ:
శంకర్ గారూ,
ఇది మీ టర్న్ .మీ వ్యాఖ్యలోని ముక్క ముక్కకి ముక్కల మద్య ఖాళీలకు సైతం సమాధానమిస్తా. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్నిదాచుకోవాలంటే ఒక్క చక్కటి మార్గముంది.అదేమంటే "మౌనంగా ఉండడం" లేదా "అతి తక్కువగా మాట్లాడటం/వ్రాయడం. పాపం ! మీకీ సూక్తి తెలిసుండ లేక పోవడంతో ఇలా నోరు (చెయ్యి) పారేసుకున్నారు)

//నేనొక “సాంబారు గాణ్ణి” అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ కాబట్టి, నీ పోస్టులకి ఇంత విలువ ఇవ్వక్కర్లేదు, //
సాంబారుగాడు అంటే తమిళుడని అర్థమంతే. తమిళులంటే మీకు పడదనే భావం వస్తూంది. రూపాయికి సింబల్ డిసైన్ చేసినవాడూ ఒక తమిళుడే ..దాన్ని సైతం వాడరా?

//అందుకే కనీసం ఎవరూ కామెంట్స్ రాయాట్లేదు, అంతేగాని నీకు భయపడి కాదు.//
సాహసవంతుడు ఎంత దాచుకున్నా అతనిలోని సాహసం ఇట్టే భయిట పడినట్టే భయస్తుల భయం కూడ ఇలా -మీ కమెంటులా భయిట పడి పోతుంది. భయస్తుడే సదా సర్వకాలం తనకు భయంలేదని బాహుటంగా  చాటుకుంటుంటాడు

//ఇక పాయింట్ కొస్తే, రాజుల పరిపాలన, బ్రాహ్మణ వ్యవస్థ కుప్పకూలి, నేటికి సుమారు వెయ్యి సంవత్సరాలు కాలేదా (మన దేశాన్ని ముస్లిమ్ లు, ఆంగ్లేయులు ఆక్రమించుకొని ఎన్నాళ్ళయ్యింది?//

బాసూ రేపు మావోలు జనజీవన శ్రవంతిలోకొచ్చి  ప్రభుత్వం ఏర్పాటు చేసినా అప్పటికీ కొనసాగుతుందీ ఈ వ్యవస్థ. పునాది నేటిది మొన్నటిది కాదు. యుగ యుగాల పునాది ఇది.

//ఆ తర్వాత స్వంతంత్ర వుద్యమ కాలంలో కుల, మత, జాతులను మర్చిపోయి, అంతా సమానంగా పోరాడి, మన దేశాన్ని మనమే పాలించుకుందాం అనే సదుద్దేశంతో అంతా ప్రాణాలు అర్పించారు//

సమానంగా పోరాడారని ఎలా చెప్పగలము బాసూ..వారి జనాభాఎంత బహుజనుల జనాభా ఎంత? వారిలో నూటికో కోటికో ఒక్కరు రంగంలోకి దిగి పోరాడి ఉండొచ్చు.ఇతరులు బ్రిటీషువారిచ్చిన అవార్డులు,రివార్డులు,రాయితీలు అనుభవిస్తూ వచ్చినవారేగా? ప్రభుత్వ సేవలో తరించిన వారేగా? ఇందులో పోలీసు శాఖలో ఉన్నది ఎంత మంది. దుభాషీలుగా పబ్బం కడుక్కున్నదెంతమంది?

// సరిగ్గా అప్పుడే బ్రిటీష్ వాదులు మనలో ఈ జాతుల చిచ్చు, కుల చిచ్చు పెట్టేరు//
అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి బాసూ.. రాముడు వద్దకు ఒక ఫిర్యాదు వస్తుంది." శూద్రుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు " ఇది ఫిర్యాదు యొక్క సారాంశం .వెంటనే రాముడు విల్లమ్ములతో భయలు దేరి ఒక్క బాణంతో ఆడ్ని చంపేసాడు. -ఇదీ బ్రిటీషువాడు పెట్టిన చిచ్చేనా?

//, అది ఇప్పటికీ రావణ కాష్టంలా కాలుతునే వుంది, వుంటుంది కూడా…//
స్థూలంగా కాలుతున్నా బహుజనుల గుండెలు మాత్రం గతంలో వారు పెట్టిన చిత్రహింసల చిచ్చు కాస్త చల్లారాయనే చెప్పాలి. చాలా మంది తెర వెనుక జరుగుతున్న "కుట్ర్లల"గురించి తెలీక "హ..ఇంకా ఏం బ్రాహణత్వం పాపం వారి మానాన వారు బతుకున్నారని అని చెప్పేవారు కూడ ఉన్నారు.

అయితే జయేంద్ర వంటి వారి చేష్ఠలు,వారి చేష్ఠలకు వత్తాసు పలికేవారు మాటలు/వ్రాతలు  ఆ మంటలో పెట్రోల్ పోస్తున్నవి.

//ఎందరో మహానుభావులు రాసారు మన ఈనాటి రాజ్యాంగాన్ని//
ఇక్కడే ఉంది అసలైన జిష్ఠు అంటే మీ ఉద్దేశం బి.ఆర్ అంబేద్కర్ పాత్రను చిన్నది చేసి చూపడమే. అయ్యా వెదవ సలహాలు లక్ష ఇవ్వొచ్చు .కాని వాటినంతా ఏరి, కూర్చిన అసలైన పాత్రను అంబేద్కర్ పోషించారు. ఇదే కీలకం.

//కాని ఈ రాజకీయ వేత్తలు వాళ్ళకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తూ //
ఈ మార్చడాలకు కావల్సినంత తెలివి తేటలు శూద్రులకు ఏదీ? వారికి ఇటువంతి దిక్కుమాలిన సలహాలిచ్చి బ్రష్థు పట్టించిందెవరంటారూ? తమ కులాన్ని క్రాపు,కోటు ,సూట్ల వెనుక దాచుకున్న బ్రాహ్మణోత్తములైన సెక్రట్రీలు,ఆడిటర్లు కాదంటారా?

//అడ్డగోలు గా కోట్లు సంపాదిస్తున్నారే,,//
అలా సంపాదించిన వారికి యజ్న ,యాగాదులు చెయ్యిస్తామంటూ దోచుకుంటున్నారే వీరికి ఆ దోపిడిలో భాగం ముట్టినట్టేగా?

//వీళ్ళలో ఎంత మంది బ్రాహ్మలున్నారు?//
ఇదేగా వారి వైవిధ్యం. ప్రయోగించే వీలు,వెసలుబాటు ఉన్నప్పుడు అధికారం ఏ ఎదవ దగ్గర ఉంటే ఏమనిగా వారు తెరవెనుక భాగోతాలు నడిపిస్తున్నది.

//(స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? నీ ద్రుష్టిలో గుంటనక్కలని పిలవబడే బ్రాహ్మలు కాదే?)//
ఇదేంటి బాసూ.. జయేంద్రలాగా పారా పారాకు మాట మారుస్తున్నావు? ఓహ్.. రాజ్యాంగాన్ని రూపొందించింది  అంబేద్కర్ కాదు "మేధావులు". రాజ్యాంగానుగునంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది మాత్రం బహుజనులే అన్నది మీ ఉద్దేశం అవునా?

నేనెక్కడ కూడ బ్రాహ్మణులు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని చెప్పను. చెయ్యిస్తున్నారు. అదీ బహుజనుల్లో నుండి అధికారంలోకి వచ్చిన బహుజనుడి చేత తమ చేతికి రక్తం అంటకుండా చెయ్య్సిస్తున్నారు. తమ వద్ద ఉన్న భూమిల్ని -అగ్రకులస్తులు-వారివద్దనుండి బహుజనులు తీసుకున్నారన్న అక్కసుతో కదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో క్షవరం చెయ్యిస్తున్నారు?

// మరి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎంత దారుణంగా వుంది//
అన్నీ కరెక్టే బాసు..ఇలా దిగజారేలా  చెయ్యించింది ఎవరు అన్న పాయింటు మీదేగా మీకు నాకు విభేదం. మీరేమో బహుజనులే చేసారంటారు. నేనేమో మీ వారే చేతికి మట్టంట కుండా చేసారని చెబుతున్నా.

//అసలు సామాన్యుడు (ఏ కులం వాడైనా) బతికే రోజులున్నాయా?//
ఇదేంది బాసూ.. మొన్నేగా ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడు మావాళ్ళు మాత్రం లక్షలు సంపాయిస్తున్నారని చెప్పేరు. బహుజనులు ఎమ్.ఎల్.ఏలు,ఎం.పీలు,మినిస్టర్లైనంత మాత్రాన వీటన్నింటికి వారే కారణమని ఎలా చెప్పగలం.

ఒక్క ఎన్.టి.రామారావు తప్ప, జయలలిత తప్ప మరెవ్వరైనా సరే ప్రభుత్వ ఉధ్యోగుల జోలికి పోయి బతికి బట్ట కట్ట కలిగారా? సరే వీరిలో కూడ మా సంఖ్య అల్పమంటారేమో? అత్యధికంగా ఉన్న బహుజనులను నడిపే పొజిషన్ మీదే కద బాసూ.. ఒక వేళ బహుజనుడే యూనియన్ లీడర్ అయినా ఆడ్ని నడిపేది మీరే కదా?

ఇస్లాం తప్పు చేసిన అంగాన్ని తెగ కొయ్యమని చెప్పినట్టుంది మీ వాదన. అసలు ఆ అంగాన్ని కదిలించింది బుర్రేగా. ఆ బుర్రలాంటి వారు బ్రాహ్మణులు.అయితే బుర్రకు శిక్ష ఉండదు. దాని ఆదేశానుసారం పని చేసిన అంగాన్ని మాత్రం నరికి వేస్తారు.
 ఉ. కేంద్ర మంత్రి రాజా - అతనికి ఈ స్కామ్ చేసే" సాంకేతిక" సహకారం అందించిన "ఆళ్ళు" కాలో చెయ్యో స్వతంత్రించి పని చెయ్యవు కాక చెయ్యవు.

// ఒక ఆడ పిల్లకి పట్ట పగలే రక్షణ లేదు(ఎన్ని యాసిడ్ దాడులు జరుగుతున్నాయి?//

ఇందుకుకారణం వేదం -వెళంకాయ్,పురాణం, పునీతం అంటూ సెక్సును దాదాపుగా నిషేదించడమే. ఈ పుణ్యం కూడ తమదేగా.

//ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు,//
కాళ్ళు చేతుల్లాంటివారే -వీరికి మతమనే మత్తు ఇచ్చి - సెక్సు గురించిన గిల్టి తెప్పించి -వారిని కామ పిశాచాలుగా మార్చింది అహేతుకమైన ప్రవచనాలేగా

// వాళ్ళకి కొమ్ము కాస్తుందీ కూడా బ్రాహ్మలేనా తండ్రీ?//
ఇటువంటి కేసులు వాదిస్తున్న లాయర్లు ఎంతమంది వారిలో బ్రాహ్మణులెంత ? ఒక లెక్క తేల్చండి చూద్దాం

//ఒక కులం వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతూ తరతరాలుగా కోట్ల ప్రజల సొమ్ముని మింగేస్తూ వుంటే నీ లాంటి సాంబారు నా…(ఇంకో తిట్టు) అంతా ఏం చేస్తున్నారు?//

వారి వెనుకనుండి స్కెచ్ ఇస్తూ చేతికి మట్టి అంటకుండా భాగం పొందుతున్నవారిని చూసి గోళ్ళు గిల్లుకుంటున్నాం

//ఇక ప్రబుత్వ వుద్యోగుల్లో ప్రతిభ వున్నా, లేక పోయినా సీనియర్లని వెనక్కి తోస్తూ అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేస్తూ, పని చేసినా చెయ్యక పోయినా జీతాలు తీసుకుని, లంచాలను తీసుకుంటూ అటు ప్రజల సొమ్ముని, ఇటు ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్న వాళ్ళలో బ్రాహ్మలెంతమంది వుంటారు?//
వారలా ప్రవర్తించడానికి కారణం అతని హక్కులను కాల రాసి, ఆడ్ని జంతువుకన్నా హీనంగా  చూసి రెచ్చ కొట్టింది కుల వ్యవస్థ కాదా? వాడ్ని బహుజనుడిగా గౌరవించి ఉంటే వాడిలో ఈ దనవ్యామోహం ఎందుకొస్తుంది.వాడు తన కులాన్నే మరిచి పోవాలని ఎవడికీ తీసి పోనని నిరూపించుకోవడానికి ఎంచుకున్న తప్పుడు మార్గమిది. మరి ఈ మార్గంలోను "Script work" మనవాళ్ళదే మరి.

//అందుకే ఇప్పుడు ప్రెవైటేజషన్ పెరిగి//
ఇది రిజర్వేషన్ పై ఒళ్ళు మండిన చాణక్యుల కుట్ర అనేగా చెబుతున్నా

//గవర్నమెంటు వుద్యోగాలు తగ్గించి//
ఈ మాటకూ ఆ మాటే నా సమాదానం

//అన్ని పన్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు,//
ప్రైవేట్ వాళ్ళంటే ఆకాశంలోనుండి దూకారా బాసూ.. ఆళ్ళు మనోళ్ళేగా.. మరి ఆళ్ళని ఆడించేది కూడ "మనోళ్ళేగా". మరి ప్రైవేట్లోనైతే టోటల్ వ్యవస్థను  నియంత్రించే స్థాయికి ఎదగడం తేలిక

// అప్పుడు ప్రతిభ వున్న వాళ్ళే నిలబడతారు.//
ప్రతిభతో పాటుగా - భార్య -ఈడొచ్చిన కూతుళ్ళతో కలిసి పార్టీలకు కూడ అటెండ్ కావాలి మరి. ప్రైవేట్ అంటే అదీ అసలైన జిష్థు..

// ఇదీ కూడా మా బ్రాహ్మల పనే అంటావా?//
అంతేగా?
(ఇంకా ఉంది)

Friday, January 14, 2011

సాంబారుగాడి పై వేటుకు రంగం సిద్దం


ఓ ఇంట పాము దూరింది. దానిని ఆ ఇంటివారి పెంపుడు కుక్క చూసింది. మొరగడం ప్రారంభించింది. ఆ ఇంటివాడు ఆ కుక్కను నోర్ముయించడానికి కొంత సేపు ప్రయత్నించి తిక్కరేగి డబుల్ బ్యేరెల్డ్ గన్ తీసి కాల్చేసాడు. ఆ కుక్క హరీమంది.

ఆ ఇంట దూరిన పాము అంతా నిద్రపోయాక తన పని తాను చేసి పారేసింది. సరిగ్గా అదే నా విషయంలోను జరుగనుంది. జయేంద్ర పై నా విమర్శల పై కమెంటు చేసిన వారిపై ఏ చర్యా ఉండదు (పాము దూరడాన్ని ఎవ్వరూ గుర్తించలేదు) కాని వారి కమెంటు పై నా స్పందన పై మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది.అదేమంటే నా బ్లాగును నిషేదించడం.

బహుసా జెల్లడ,మాలికా డాట్ ఆర్గ్,కూడలిలలో కనిపించే చిట్ట చివరి టపా ఇదేనేమో? ఎందుకైనా మంచిది ఈ పేజిని బుక్ మార్క్ చేసుకొండి. ఇక జయేంద్ర పై నా విమర్శ పై వచ్చిన కమెంటు పై నా స్పందన ఇదో !

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు//
మీ వాళ్ళను మోసి మోసి భుజాలు కాయలు కాసాక,కాయ కోసి కల పండిందని మీవారే తింటుంటే చూసి ఏడవక చేసేదేముంది?

//కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు//
మేం ఏడుస్తే కరిగి పోయేదానికి మీరేమన్నా మాలా  సామాన్యులా? కేవలం బుర్రతో ఆలోచించే మేధావులు కదండి. గుండె ఉన్న స్థానంలో బండను కుదుర్చుకుని (బ్రాహ్మణ )స్త్ర్రీలను సైతం మీరు పెట్టిన యాతనలు అన్ని ఇన్ని కావుగా?

బాల్య వివాహాలను నిర్భందిస్తూ " నీ కూతురు పెద్దమనిషయ్యే ముందే పెళ్ళి చెయ్యాలి.లేకుంటే ప్రతి నెల ఆమె భహిష్ఠును త్రాగాలని ఆజ్నాపించినవారుకదా?
(సతరు శ్లోకం సైతం ఉంది - మీరు  ఆధారం కోసం నిలదీస్తే భయిట పెడతా)

//మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,//

కీలకమైన పొజిషన్లే అయితే అక్కడి వారు పది రూపాయలిస్తేగాని చెయ్యని పనిని మీవారు రెండు రూపాయలకు చేసి పెడ్తూ అక్కడి నిరుధ్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారన్న సంగతి తెలుసులెండి సారి

//(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు//
మీ వేదాల ప్రకారం సముద్రం దాటితేనే బ్రష్థులవుతారుగా.. మరి మీ వారి విదేశీయానానికి వేదాలు అడ్డురాలేదా బ్రదర్!

// కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి //
ఇదంతా తమ పుణ్యమే కద బ్రదర్.. వర్ణాల క్రింద విభజించింది మీరే కద తండ్రి!

//వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు//

వారికి సెక్రెట్రియేట్లో , మార్కెటింగ్ డిపార్ట్ మెంటుల్లో ,ఎస్టాబ్లిష్మెంటు సెక్షన్లలో కూర్చుని స్కెచ్ ఇచ్చేది తమవారే కదా..దొంగ లెక్కలిచ్చే ఆడిటర్లు,దొంగ కేసులు వాదించే లాయర్లు ఎంతమంది లేదూ

// ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు//
మీ వాళ్ళు వేదం వింటే చెవిలో సీసంకరిగించి పొయ్యాలన్నారుగా.. చదివితే నాలిక కోస్తామన్నారుగా.ప్రతిదానికి సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. అసలు విషయాలను దాచి పెట్టింది మీరే కదా..

గుడ్దిలో మెల్ల మేలన్న చందంగా బాబాల వెంట పడేరు బహుజనులు

//(వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా)//
కాదు కాని మీకు నకిలీలు

//బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి,//
మీ ఈ మాటను కాదన్నానా? కాదంటానా?

//ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, //
ఏం చేద్దాం గురూ.. మీరు మరీ కాపి రైట్ కోసం కకృత్తి పడేరు -సీక్రెట్ సీక్రెట్ అని టెన్షన్ పెట్టేరు. అసలు దొరకనప్పుడు నకిలీలకు మార్కెట్ రావడం మాములేగా?


//నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,//
మీ (వారి) అజెండా ప్రకారం పని చేసే ఎవడన్నా చేరేది శ్రీకృష్ణ జన్మస్థానం (కేంద్ర మంత్రిరాజా) లేదా ఖబర్ స్థాన్ ( రాజీవ్ గాంది) నాకా ఉద్దేశం లేదుగాని బాబాల సంగతి ఎప్పుడో ఉతికి ఆరేసి ఎండేసా.. మీకా తుత్తర అవసరం లేదనుకుంటా

నన్ను కుహానా జ్యోతిషుకుల పట్టికలో చేర్చడంతో నేనెంతటి నిజాలను నిర్భయంగా వ్రాసానో చెప్పకనే చెప్పేరు.

థ్యాంక్స్. ఇప్పటికీ ఒక్క ముక్క చెబుతున్నా వ్యక్తిగతంగా నాకు ఏ బ్రాహ్మణుని మీద గోరంత కోపమో,విరోధమో లేదు. నా ఆవేశానికి కారణం ఇప్పటికీ (ఇంత కాలం ఏలి - దోచి కూడ) భుద్ది మార్చుకోకపోవడమే..

//"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది"//
బ్రాహ్మణోత్తమా ! కాల దర్మం మీకు తెలియనిది కాదు. మారే కాలాన్ని పట్టి అన్నీ మారిపోతాయి. గతంలో నూటికి తొంబై శాతం వ్యవసాయం మీదే ఆధార పడి బ్రతికేవారు. పొలం దున్నడానికి ఎద్దులు అవసరం కాబట్టి గోవులకు ఎక్కడలేని ప్రాధన్యత ఇచ్చే వారు.పైగా అవి సాధు జంతువులు కాబట్టి  వాటిని కలిగి ఉండటం పెద్ద రిస్క్ లేని పని. అందుకే మీవారు మరింత కలర్ ఇచ్చి రాజులకు మస్కా కొట్టి బేవార్సుగా వేలాది ఆవులు తెచ్చుకునేవారు.అయితే వాటిని మేపడం యాదవులు చేస్తారు. అవి పాలీయడం మానేస్తే ఊళ్ళో పంచముడు తీసుకెళ్తాడు. చస్తే ఆడే తీసుకుపోతాడు. ఇది గో పురాణం వెనుకున్న అసలైన కిటుకు.

ఇక బ్రాహ్మణులంటారా at that time they were just un productive consumers of the society. ఎక్కడ తమర్ని సైతం కాయ కష్ఠం చెయ్యమంటారోనన్ని భయపడి ఇలా బిల్డప్ ఇచ్చుకునేసేరు.

// బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు)//
ఐ సీ ! మరి నేను కూడ సమాజ హితం కోరేవాడ్నే .. మీ వాళ్ళ వలే గ్రహ దోషాలకు పరిహారంగా  యాగాలు చెయ్యమని వేలకు వేలు గుంజడం లేదు.కుజ దోషముంటే రక్త దానం చెయ్యమంటున్నా. సర్ప దోషం ఉంటే ఇతర మత గ్రంథాలు చదవమంటున్నా. మరి మీ సంఘంలో నన్నూ ఒక సభ్యునిగా చేర్చుకోమనగలరా? ఎందుకండీ ఈ హిప్పాక్రసి. బ్రాహ్మణత్వమన్నది పుట్టుకతో నిర్ణయించబడుతుందని చంటి పిల్లవాడు సైతం చెబుతాడు.


// ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి,//

ఆర్టికిల్ ఏంది ఖర్మ! దుమ్ము దులిపాను. కేసులు పెట్టాను. పేపరుకెక్కాను . ఆమరణ నిరాహార దీక్షకూడ చేసాను.

// తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
దమ్మా? నా కణకణాల్లో జీర్ణించుకు పోయిందదొక్కటే సుమండి..

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Thursday, January 13, 2011

మళ్ళీ ప్లేటు ఫిరాయించిన జయేంద్ర

ఇక్కడో మాట..అక్కడో మాట -ఈ రోజో మాట ..రేపో మాట. ఇదే వరస. ఇక్కడేమో హైదరాబాద్ ఉమ్మడి రాజదాని ప్రాతిపదికన  రాష్ఠ్ర్రం విడిపోవాలని సూచించిన జయేంద్ర ..................

.........చెన్నైకి వెళ్ళగానే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని - రాష్ఠ్ర్ర విభజన తన ఉద్దేశాం కాదని చెప్పేరు.
గురువింద చందంగా తన పై ఉన్న ఆరోపణలు,కేసుల గొడవ చూసుకోకుండా ఇలా "నీతులు" "ఉచిత సలహాలు" విసరడం దేనికో అర్థం కావడం లేదు.ఇకనన్నా కులప్రీతితో జయేంద్రను వెనుకేసుకొచ్చేవారు మారితే మంచిది.