Saturday, May 29, 2010

ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా : రహమతుల్లా

"తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్.అవతలి వ్యక్తి సహించడు అని తెలిసినప్పుడు మరో మార్గం వెతుక్కోవటం మంచిది.ఇలాంటి పరిస్థితిలో దగ్గరకుపోయి ఓదార్చే బదులు మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.ఇక జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాల ఏర్పాటు కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.

రహమతుల్లా గారు. మీ కమెంటును నా బ్లాగులో పోస్ట్ చేసాను. మీ కమెంటు పై నా కమెంటేమంటే 
అన్నీ బాగానే చెబుతూ వచ్చారు. కాని చివర ఏదో ఒకటి అంటున్నారు.
సోనియా, మొదల్గొని ఇక్కడి నాయకులు మినహా సమస్యను తెంచే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఉంటే తెలంగాణా కావాలో వద్దో తెలంగాణలోనే వోటింగ్ పెట్టిస్తే పోలే. నానిదివరకే తెలింగాణ వస్తే ఏం నష్ఠమంటూ ఒక టపా వ్రాసాను దానిని చదవడానికి ఇక్కడ నొక్కండి

No comments:

Post a Comment