Tuesday, January 25, 2011

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

నేస్తం!


ఒకే దిశలో ఒకే గమ్యానికేసి సాగుతున్నవారం.

కొందరు పడవల్లో,కొందరు నావల్లో ..

అయినా నావైనా,పడవైనా చివరికి చేరేది మరణ తీరాన్నేగా

ఆలోపు తొందరేలా..



నాకూ ఈ ప్రపంచం పోకడ నచ్చడం లేదు.

అందుకని బాయ్ కాట్ చేసెయ్యాలా?

అది చేతగాని ప్రజా ప్రతినిదులు చేసే పని.



మనముందాం.. ఏ గృడ్డి ప్రపంచమా!

నీ పోకడ మాకు నచ్చలేదందాం.

మన వాణి వినిపిద్దాం

బోణి కాకుంటే బాణి మారుద్దాం

కాణీలకోసం ఖూనీలు చేసేసే

చెత్తనా కొడుకులకు తెలీదు

వారు ఎవరినో చంపినప్పుడు

వీరిలో కూడ ఏదో చస్తుందని

వారే బతికేస్తుంటే మనం చావడం దేనికి?



ప్రపంచానికి అనువుగా తమరిని తాము మలుచుకునే

పిరికి పందలు వీరంతా..

ఈ ప్రపంచాన్ని మన కలలకనుగుణంగా మార్చ చూసి

మార్చలేమేమోనన్న దిగులుతో బతుకు మీద నిరాసక్తతతో

చావు గురించి ఆలోచించామే గాని

వీరిలా "బతక" లేక చావు వంక చూసామేగాని

మోసానికి గురై యమ పాశానికి మెడలు వంచాలనుకున్నామే గాని



నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరికీ బతకాలని లేదు.

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

చచ్చే ధైర్యమే మనకుంటే బ్రతకడం ఎంతో సుళువు



చావడానికే సిద్దమైనవాడు మరి దేనినైనా బతికించగలడు

చచ్చిన మానవత్వాన్ని

చచ్చి పోతున్న ప్రజాస్వామ్యాన్ని



పేదరికం మనలను మనకు పరిచయం చేస్తుంది..

తిరస్కారం మనలను మనకు దగ్గర చేస్తుంది



మనలను మనం పరిచయం చేసుకుని

మనకు మనం దగ్గరై దగ్దం చేస్తాం పేదరికాన్ని

ప్రేమిద్దాం సమస్త విశ్వాన్ని..

Monday, January 24, 2011

పాత సినిమాలు Vs కొత్త సినిమాలు

పా.........త సినిమాల్లోను విలన్స్ ఉండేవారు ( ప్రస్తుత సినిమాల్లోని హీరోలకంటే బెటర్). తొలూత క్లైమేక్సులో ఒక కానిస్టబుల్ "పున్య్! పున్య్!" అంటూ వచ్చి విలన్ని కస్టడిలోకి తీసుకునే వాడు.శుభం కార్డు పడుతుంది. ఆతరువాతి సినిమాల్లో కానిస్టబుల్ అవినీతి పరుడు ఎస్.ఐ మంచోడు, ఆతరువాతి సినిమాల్లో ఎస్.ఐ కూడ విలన్లతో చేతులు కలుపుతాడు. డి.ఎస్.పి వచ్చి న్యాయం చేసేవాడు. ఆతరువాతి సినిమాల్లో డి.ఎస్.పి విలన్ డెన్లో మందు కొట్టి పడుకోనుంటాడు (స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్?)

ఇది క్రమేనా డెవల్ప్ అయ్యి హోమ్ మినిస్టర్ చెడ్డోడు సి.ఎమ్ మంచోడనే స్థాయికి పోయింది. ( డా.రాజశేఖర్ రెడ్డి సినిమా) . ఆతరువాత రాజకీయనాయకులందరు చెడ్డోళ్ళు పత్రికల్లోళ్ళే ఉత్తములని చూపారు ( ఆఖరి పోరాటం). ప్రస్తుతం మీడియా బతుకెంతే అందరికీ తెలిసి పోయింది.

ఈ దశాబ్దంలో కోర్టులు చురుగ్గా/ చక్కగా  పని చేస్తున్నాయనే ఇమేజ్ వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక నవశకాన్నే ప్రారంభించాయి. ప్రస్తుతం స్పెక్ట్ర్రం కుంభకోణం విషయంలోనూ ఇదే జరిగింది.

న్యాయశాఖకు  దినకరన్ వంటి న్యాయమూర్తులు మాయని మచ్చ తెచ్చిన మాట అవతల ఉంచుతాం, తమిళనాడులో ఒక కేసు విషయమై బెయిల్ మంజూరు చెయ్యాలని తన పై వత్తిడి తెస్తూ "కేంద్రమంత్రి లైన్లో ఉన్నారని" పబ్లిక్ ప్రాసిక్యూటర్  బదిరించినట్టు న్యాయమూర్తి సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తికి లేఖ వ్రాసారు. అందులో ఆ మంత్రి పేరు పేర్కొన్నట్టు మీడియాకు చెప్పారు.

కాని అప్పటి  సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారు ఆ లేఖలో మంత్రి పేరు లేదని చెప్పడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతకీ ఆ మంత్రెవరో తెలుసా? టెలికాం స్కామ్ కింగ్ రాజా.

ఇప్పటి మానవహక్కుల కమిషన్ కె.జి.బాలకృష్ణన్ భంధువులపైనా ఆరోపణలొచ్చిన నేపథ్యంలో కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టు న్యాయశాఖ కూడ ఇటువంటివాటికి అతీతం కాదనే భావన ప్రజల్లో కలింగింది.

గతంలో నేను 1997 నవంబరు నుండి నాటి సి.ఎమ్.చంద్రబాబుగారికి నా ఆపరేషన్ ఇండియా2000 ప్రాజక్టును ప్రతిపాదిస్తూ వచ్చి -సమాదానం రాక విసిగి వేసారి -తిరుగు టపా ఖర్చులకై పది రూపాయలు ఎం.ఓ పంపాను -అదీ తీసుకున్నారే గాని స్పందించలేదు.

ఈ యవ్వారం పెయిడడ్ సర్వీసుగా మారినందున జిల్లా వినియోగదారుల ఫోరమ్ కు ఫిర్యాదు చేసాను "ఇందులో సేవా లోపం"లేదని కొట్టేసారు. రాష్ఠ్ర్ర ఫోరానికి అప్పీల్ చేసాను. నో రెస్పాన్స్. ఈ విషయమై తమిళనాడు ,ఆంద్రా హై కోర్టులకే కాదు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు సైతం డజనుకు పైగా అన్ని ఆధారాలతో లేఖ వ్రాసాను.

కాని నా ఒక్క లేఖను సైతం సుమోటాగా స్వీకరించలేదు. కాని శంకర్ రావు కేవలం ఒక రాజకీయ నాయకుడు. అధికారం కోసం/అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ మాటైనా చెప్పగల వ్యక్తి. ఇంతకీ అతని లేఖ మీడియా వారికి అడ్రెస్ చేయబడినది.

దానిని సుమోటాగా స్వీకరించిన కోర్టు మరి నా లేఖలనెందుకు పట్టించుకోలేదో? ఎవరన్నా న్యాయ నిఫుణులు సమాదానమిస్తే సంతోషిస్తా..

గమనిక:
హై కోర్టు ,సుప్రీమ్ కోర్టులకు నేను లేఖలు పంపినందుకు డాకుమెంటరి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. మీలో ఎవరైనా కోరితే స్కాన్ చేసి పెడతాను.

హై కోర్టు నోటీసులతో జగన్ పని గోవిందా!

ఇదే  ఈ రోజు స్టుడియో ఎన్ చానల్లో ప్రముఖంగా ప్రసారమిన కథనం యొక్క సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటి?.గతంలో  మంత్రి శంకర్ రావు జగన్ సంస్థల్లో పెట్ట్టు బడుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసేరు. వాటిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై 52 మందికి నోటీసులు జారి చేసింది ( గమనించండి: తీర్పు వినిపించలేదు)

ఈ మాత్రానికి ఇంత అత్యుత్సాహం చూపుతున్నారంటే జగన్ దెబ్బకి ఎంతకి దిమ్మతిరిగి ఉన్నారో అర్థమవుతూనే ఉంది.  వారి ముఖ్య ఆరోపణ ఏమంటే ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే షేర్లెలా అమ్ముడు పోయాయి? వాటి విలువా ఏటా ఎలా పెరిగాయి?

వారి ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాన్ని,వై.ఎస్.ని మచ్చిగ చేసుకోవడం కోసం "ఎవరో" పెట్టుబడులు పెట్టారన్నదే.

మీరో నేనో వెళ్ళి ఒక సినిమా తియ్యాలనుకుంటే ఆ సినిమాకయ్యే ఖర్చు మొత్తం హాట్ కేష్ గానో, బ్యాంక్ బేలన్సుగానో కలిగి ఉండాలి. ఇదే ఒక "విశ్వసనీయత"గల సంపన్నుడు / ప్రముఖుడు సినిమా తీయాలనుకుంటే ఒక ఏ4 కాయితం మీద ఒక్క రూపాయి స్కెచ్ పెన్నుతో ప్రొడక్షన్ నెం. వన్ అని వ్రాసి బొట్టు పెట్టి  హారతి ఇస్తుంటే ఆ హారతి తాలూకు  కల్పూరం ఆరే లోపల ఏరియాలు సేల్ అయిపోతాయి. అడ్వాన్సులు కోట్లల్లో అందుతాయి.

దీనిని అవినీతి అంటారా? జగన్ ఉత్సాహవంతుడు,సమర్థుడు, విద్యావంతుడు, ఎప్పట్లోనుండో కార్పోరేట్ రంగంలో ఉంటూ అనుభవం గడించినవాడు. పైగా వై.ఎస్. తనయుడు. మాట తప్పను -మడమ తిప్పను అనే పంచ్ డైలాగుతో రీ ఎంట్రి ఇచ్చి దుమ్మురేపిన ప్రాక్టికల్ హీరో వై.ఎస్.. ఇన్ని అంశాలను పట్టి పెట్టుబడి పెట్టేవారు పెడతారు.

ఇందుకు జగన్ని భాధ్యుడ్ని చెయ్యడం ఎంతమెరకు తర్కం? ఇంతకీ నత్తి-సుత్తికి పేటెంట్ రైట్ కలిగి  ఊక దంపుడు మాటలు విసిరే శంకర్ రావు మాటల్లో ఏమెరకు పస ఉంది? నాకేమో ఇది జగన్ కు పరీక్షలా అనిపించడం లేదు.  శంకర్ రావు మాటలు ఆధార రహితమని తేలడం ఖాయం.

మీరు నేను టీ కొట్లో మాట్లాడుకోవడం వేరు.. బ్లాగుల్లో బండ భూతులు వ్రాసుకోవడం వేరు. కాని శంకర్ రావు ఒక మంత్రి .అతని మాటలు నిరాధారమైనవని తేలితే కోర్టు అభిశంసించవచ్చు. జగన్
మంత్రి పైన , దూకుడుగా ఏక పక్ష వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్ళ పైన లక్షల కోట్లకు పరువు  నష్ఠదావా వేయ వచ్చు.

అదే జరిగితే చానళ్ళకు కాపలా కాస్తున్న సెక్యూరిటి కుర్చీ సైతం జప్తుకు గురికావచ్చు.

విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం.. అంతేనా?

ఇటీవల సైకలాజికల్ స్ట్ర్రెస్ కి జ్యోతిష పరిష్కారం చూపే ఒక బృహత్తర భాధ్యత నా మీద పడింది.  స్ట్ర్రెస్ కి గురైన వారు ఫోన్ చేస్తారు (ప్రతి రోజు రా.9 నుండి10 లోపు) వారి మానసిక వత్తిడికి కారణమేమో తెలుసుకుని జ్యోతిష రీత్యా ఒక పరిహారం/పరిష్కారం చూపడం చెయ్యాలి.

ఈ కార్యక్రమం ద్వారా నేను ఇప్పటికి వందకు పైగా ఫోన్ కాల్స్ అట్టెండ్ చేసాను. కాని వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళికి సంభంధించినవే. జీవితమంటే ఈ నాలుగేనా? వీటికి అవతల గాని ఇవతల గాని  ఏమీ లేదా? అనిపించింది నాకు. ఇదిలా సాగడం వెనుక కారణాలేమిటి? ఇది సబబేనా?దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం పై నాలుగు ముక్కలు రాద్ద్దామని మొదలు పెట్టా. 

పాయింటుకొచ్చే ముందు ఈ సదవకాశం నాకెలా దక్కిందో పది ముక్కలు..పదే ముక్కలు .

గూగుల్ వారు రకరకాల సదుపాయాలు కల్పిస్తుండటం అందరికి విదితమే. అందులో ఒకటి ఎస్.ఎమ్.ఎస్. గ్రూపులు ఏర్పాటు చేస్కోవడం. అలా ఏర్పాటైన ఒక గౄపు స్ఫూర్తి . ఈ గృపును ఏర్పాటు చేసి స్వంత డబ్బు వేలల్లో వెచ్చించి పత్రికా ప్రకటనలిచ్చి మరి దానిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ( సైట్లో పెట్టిన యాడ్ కు నేను డబ్బు తీసుకోలేదు బాసు)  . ఆ గ్రూపులో ఇప్పటికి ముప్పై వేల మంది ఉన్నారని  విన్నాను. గౄపు సభ్యులకు ప్రతి రోజు ఒక పాజిటివ్ ఎస్.ఎమ్.ఎస్. పంపుతారు.

ఈ గృపును ఏర్పాటు చేసి ప్రమోట్ చేస్తున్నది చిత్త్రూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ యజమాణి శ్రీ జితేంద్రబాబు జైన్. వారు తమ గౄపు సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగలరా అని అడగడం  - నేను సై అనడంతో ఈ అవకాశం దక్కింది.

జీవితమంటే విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం ఈ నాలుగేనా? ఒకే ఒక్క ఫోన్ కాల్ కూడ ఈ నాలుగింటికి అవతలగాని ఇవతలగాని రాలేదు. వీటికున్న గొప్పతనం ఏంది? వీటి మధ్య ఉన్న సంభంధం ఏమి? వీటికి అవతల ఏముంది?

ఈ సృష్ఠి అంతటా వ్యాపించి ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. ప్రకృతి మగ ఏనుగుకి దంతాలిచ్చింది ఆడ ఏనుగును ఆకర్షించడానికే.  నెమలి పుంజుకి పురి ఇచ్చింది , పెట్టను ఆకర్షించటానికే. పువ్వులు పూచేది తేనెటీగలను ఆకర్షించడానికే. మరి ఇవన్ని ఎందుకు?

సృష్టి ఆగిపోక సాగడానికి.

ప్రతి ప్రాణియొక్క ప్రప్రధమ కర్తవ్యాలు కొన్నే. ప్రాణలతో కొన సాగడం . తన జాతి అంతరించి పోకుండా చూడటం. తన జాతి+ తాను వ్యాప్తి చెందేలా ప్రయత్నించడం.

ఇందుక్కావల్సిన పవర్ సృష్ఠినుండే అందుతుంది.  అదే పవర్  మనిషిలోను  ఉన్నది. మనిషిలో నున్నది  ఒకే పవర్.అది సెక్స్ పవర్. అది ఊర్ద్వముఖంగా సాగితే యోగిక్ పవర్. అధోముఖంగా సాగితే సెక్స్ పవర్.

విద్య దేనికి? ఉధ్యోగం వస్తుంది కాబట్టి.. ఉధ్యోగం దేని? అప్పుడే పెళ్ళి అవుతుంది కాబట్టి. పెళ్ళి దేనికి సెక్స్ ఆ పై సంతానం ( జాతిని వ్యాపింప చెయ్యడం).

పరిమితమైన పవర్ గల ప్రాణులు ఇక్కడికి తమ సర్వ శక్తులను పోగొట్టుకుని నిర్వేదానికి జారిపోతాయి. 
పోనీ ఈ ప్రాణులు అవతలకి దూకకుంటే పీడా పోయింది. కనీశం   వీటికి అవతల ఏముందనైనా తెలుసుకోవచ్చుగా?

ప్రతి ఒక్కరికి వీటికి అవతలకెళ్ళే శక్తి సామర్ధ్యాలను ప్రకృతి ఇచ్చింది. కాని మనమే వాటిని గుర్తించడం లేదు. విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం వీటికి అవతల ఏదో ఉందనడానికి ఆధారం ఈ నాలుగింటిని పొందినాక కూడ మనలో ఉన్న అశాంతి,అసంతృప్తులే.

ఈ అశాంతి,అసంతృప్తులు స్మశాన వైరాగ్యంలా కరిగి పోవడంతో మనస్సు ఈ నాలుగింటి వైపే మొగ్గుతుంటుంది. తొలూత ఈ నాలుగింటిని తాను పొందాలని ఉవ్విళ్ళూరే మనస్సు ఆ పై తన వారసులు పొందాలని కుత కుతలాడుతుంది. ఇంకా వయస్సుండి -బతికే ఉంటే ఇవే విషయాలను తన మనమళ్ళకు అందించే ప్రయత్నం కూడ జరుగుతుంది. ఇదో విష వలయం. ఇందులో చిక్కుకున్న తరం అతిత్వరలో అసంతృప్తికి అశాంతికి గురవుతుంది. ఆలోపే సమాజం బ్రష్ఠు పట్టి పోయుంటుంది.

మరి ఈ నాలుగింటికి అవతల ఏముంది?వాటిని అందుకోవాలంటే  ఏం చెయ్యాలి? (తదుపరి టపాలో కొనసాగిస్తా)

Saturday, January 22, 2011

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు అంటూ తమిళనాడు రాజకీయ నాయకుల్లో కొందరు నేతలు (వైగో, నెడుమారన్,సీమాన్) చెబుతూ వచ్చినప్పటికి శనివారం నాడు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ బై వీక్లి నక్కీరన్ కవర్ స్టీరి విడుదల చేసింది. ఆ కథనం ప్రకారం : ఇటీవల అన్నా టెర్మినల్స్ లో దిగిన ఒక జంట ప్రముఖ తమిళ నేత ఒకరిని పిలిపించుకుని " ప్రభాకరన్ బతికే ఉన్నారని - వెస్ట్ ఇండీస్ ధీవుల్లో ఉన్నారని తాము కూడ అక్కడికే వెళ్తున్నామని చెప్పేరు. ఆ జంటలో పురుషుడు చిన్న రూబన్ అనే కమేండర్ అని అతను యుద్దంలోని చరమ గట్టాన తన రెండు చేతులూ పొగొట్టుకున్నవారని నక్కీరన్ తెలిపింది.

ఇది కాక ఇటీవల కెనడా దేశపు గూడచార సంస్థ "లంక యుద్దంలోని చరమ గట్టంలో చనిపోయినట్టుగా భావిస్తున్న ముఖ్యుల్లో చాలామంది బతికే ఉన్నట్టు" కెనడా  ప్రభుత్వానికి నివేదించినట్టూ వార్తలు వస్తున్నాయి.

హెష్చరిక:
మరి ఈ విషయలో సాంబారుగాడికి ఏమిటా తుత్తర అని అడగొచ్చు. చెబుతా? ప్రభాకరన్ జాతకాన్ని అనలైజ్ చేసి జూలై 11,2010 నాడు నా తమిళ బ్లాగులో "ప్రభాకరన్ మరణించ లేదు" అంటూ ఒక టపా వ్రాసాను .దానిని చూడటానికి (ఎలాగూ చదవలేరుగా) ఇక్కడ  క్లిక్ చెయ్యండి. అందులో 2011,నవంబరు 26తరువాత ఈ సంగతి ధృవీకరించ బడుతుందని కూడ పేర్కొన్నాను

ప్రేమ వైఫల్యాలు - ఆత్మ హత్యలు

ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా.

వస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా, పది మందితో పడుకొన్నా ప్రేమిస్తూ ఉండాలంతే.

ప్రేమకు  మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.

ఇటువంటి ప్రేమలను ప్రపోజల్ అని చెప్పొచ్చు. ప్రపోజల్ అన్నది చాలా స్థూలమైన విషయం.  మీరు ప్రపోజ్ చేసినప్పుడే ఎదుటి వారు డిస్పోస్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో  మనతో పాటు చావరు.

ఏ ప్రపంచ సుందరితో నాకు ప్రేమ(?) సక్సెస్ (?) అయినా వృద్దాప్యమూ ఆగదు, నా చావు ఆగదు.   నేను జీవించాలంటే నాకు ఆక్సిజన్ అవసరం.నీరు అవసరం. తిండి అవసరం. ఇవి స్థూలమైన అవసరాలు.ఇవి లేకుంటే చస్తానేమోగాని ప్రేమ లేకుంటే చస్తానా? నెవర్ !

కేవలం ఒక్క  జీవ కణంగా భయలు దేరి, మిల్లియన్ల కొద్ది జీవకణాలతో పోటీ పడి తల్లి గర్భాయశానికి చేరి పసి కందువుగా, చంటి బిడ్డగా, బాలునిగా,యాంగ్రి యంగ్ మ్యేన్ గా మారుతూ వచ్చిన ఈ ప్రాసస్ లో మనకు దోహద పడిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో..

ఎవడో సైంటిస్ట్ ఒక టీకా కనుగొన్నాడు. లేకుంటే తల్లి గర్భమే సమాధి అయ్యేది. మరేదో సైంటిస్ట్ మరేదో టీకా కనుగొన్నాడు. లెకుంటే చంటి బిడ్డగానే చచ్చుండేవారం. ఇల ఒకటి కాదు లక్షల మంది మనలను బ్రతకనిచ్చేరు.పునర్ జీవం పోసేరు. ముందుకు నడిపేరు.

వారికి మనం మనం ఎలా  కృతజ్ఞతలు చెప్పాలి? ఆత్మ హత్య చేసుకునా? అసలు మన ప్రాణం మన సొత్తనుకుంటున్నారా? ఇది కోట్లమంది మనకు పెట్టిన భిక్షం. ఎవరో పిచ్చి ముండ నిన్ను తిరస్కరించిందని ఆత్మ హత్య చేసుకుంటావా?

ఈడ్ని మిస్ అయ్యామే అని ఆమె జీవితాంతం కృంగి కృశించి నశించేలా బతకాలే కాని చచ్చి పోవడమా? షిట్ !

ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి,  ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.

నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..

ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని  చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?

జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..

విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.

స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు.

అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది.

లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్  సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..

Friday, January 21, 2011

ఆత్మ హత్య తలంపు- పుట్టు పూర్వోత్తరాలు

మనమందరం ఒకే సమాజంలో బతుకుతున్నాం. మనలో చాలా మంది ( నేను సైతం) సిగ్గు,లజ్జా,మానం,పరువు ,ప్రతిష్ఠ,మంచి ,మానవత్వం  అంతా మరిచి అలా బతికేస్తున్నాం. కాని కొందరొలో మాత్రం ఈ ఆత్మహత్య తలంపు తలుపు తట్టడం ఎందుకు? వారి మనస్సు ఇన్ని స్కాములు చూసాక కూడ, ఇన్ని భౄణ హత్యలు చూసి కూడ,ఇన్ని అక్రమ సంభంధాలు చూసి కూడ ఇంకా కూడా మొద్దు పారలేదన్న మాట. ఇంకా వారి మనస్సు సెన్సిటివ్ గా ఉందన్న మాట.

డస్ట్ అలర్జి అన్నది రోగం అని అందరూ భావిస్తారు.కాని మీలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్) పర్ఫెక్టుగా పని చేస్తుందనడానికి అదో సూచిక మాత్రమే. డస్ట్ లేని సమాజాన్ని సృష్ఠించడం డాక్టరు తరం కాదు కాబట్టి అతనిలోని ఇమ్యూన్ సిస్టాన్ని నిద్రపుచ్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. నా ఈ ప్రయత్నం కూడ ఆ కోవకు చెందిందే.

కారు చీకటి కమ్ముకుంటున్నా అక్కడక్కడ గోరంత దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.ఆ దీపాలకేసి సాగుతాం. భూమి ఆగదుగా.. తిరుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది. పండుగ పూటా పాత మొగుడే అన్నది సామెత మాత్రమే. ప్రతి రోజు ప్రకృతి మనకిచ్చే మిల్లియన్ డాలర్ లాటరి టిక్కెట్. మరీ ఇందులో నెంబరేమి ప్రింట్ అయ్యుండదు. మనకిష్ఠమొచ్చిన నెంబరు వ్రాసుకోవచ్చు.

ఇదెంత మంచి గేమో చూడండి. ఆత్మహత్య అనంతరం జరిగేది ఏది? మీరు లేని ప్రపంచం. మీరుండి మాత్రం ఏం పొడిచారని.ఏ స్కామునన్నా అడ్డుకోకలిగారా? లేక పత్రికలు వారు తమ ఎడిటోరియల్ను సైతం అమ్ముకోవడాన్ని ఆపగలిగారా? ఏమి లేదు మీరున్నా బతికే ఉన్నా ప్రపంచం తన రూటులో సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచంలో లేని మీరు మీరు లేని ప్రపంచాన్ని సృష్ఠించడం కోసం చావడం దేనికి?

సూర్య చంద్రులు రాలిపోయినా మన రెండు కళ్ళే సూర్య చంద్రులై జాతికి వెలుగును చూపాలి. అటువంటిది చావడమా షిట్.  మీరు నేను అందరం అందరం ఒకే బోగిలోని సాటి ప్రయానికులం. మీరు చస్తే నేను చావక పోవచ్చు. కాని నాలోను ఓ మరణం సంభవిస్తుంది పాక్షికంగా..

బాసూ..ఎలాగూ రైలు వినాశనానికేసి బుల్లెట్ ట్రైన్లా దూసుకు పోతుంది. కాస్త ఓపిక పట్టరాదే. అదిగో అక్కడ ఏదో గొలుసు కనిపిస్తూంది.దానిని లాగితే రైలు ఆగుతుందేమో ..ప్రయత్నిద్దాం ..

వెయ్యి సార్లు ఆతహత్య చేసుకోవడానికి కావల్సిన కారణాలు అందరికీ ఉన్నాయి.మన నాయకులు, సూపర్ స్టార్లు,మెగా స్టార్లు..అందరికి ఉన్నవి.కాని వారు కాని నేను కాని ఆ పని చెయ్యాలనుకోనే?

మనలో కొందరికి మాత్రం ఈ ఆలోచన రావడానికి కారణం ఏమి? చూద్దాం ..దాని అంత్యారంభాలు తిరగ తోడేద్దాం.
నాకు

Thursday, January 20, 2011

ఆత్మహత్య ఆలోచనను సైతం వాయిదా వెయ్యగల కొటేషన్స్

*ఈ జీవితం వద్దనుకునేగా ఈ నిర్ణయానికొచ్చేరు. తనను వద్దనుకున్న వానికి వరంగా మారడమే జీవితంయొక్క స్పెషాలిటి. విజయపథంలో మీ తొలి అడుగు ఈ ఆలోచన.

*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో  నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?

*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.

*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.

*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.

*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి

*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో  కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.

*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.

నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది. 
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన  మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు  చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.

మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్  వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై  సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.

Wednesday, January 19, 2011

చంద్రబాబు రాష్ఠ్ర్రానికి పెద్ద దిక్కై వ్యవహరించాలి





మూరెడు ఎం.పిలను పెట్టుకుని బారెడు మంత్రి పదవులు తన్నుకు పోయిన కరుణానిది స్వార్థంతో ఆ పని చేసాడో -లేక తెమిళుల సత్తా చాటడానికి చేసాడో అది వేరేకథ. కాని కరుణానిధి ప్రవర్తనను  చూసి యావత్ భారత దేశం బెంబేలెత్తింది.

వై.ఎస్. హయాంలో కూడ బారెడు ఎం.పీలున్నప్పటికి మూరెడు మంత్రి పదవులే దక్కాయి. వై.ఎస్. ఎందుకు ఆ నాడు నిలదీయలేక పోయాడంటే ఒకటి 2009 ఎన్నికల్లో సీట్లు తగ్గడం -రెండు ఈయన గారు కాస్త గొంతు పెంచితే ఆదిష్ఠానం పంచన చేరి వంచన పూరిత నాటకాలాడటానికి కొందరు ముసలి నక్కలు సిద్దంగా ఉన్నారు.

నరసింహరావు పి.ఎం అభ్యర్ధిగా ఖరారయ్యాక నంద్యాల్లో  ఆయన కంటెస్ట్ చేసారు. ఎన్.టి.ఆర్ ఒక్క క్షణం కూడ ఆగక తె.దే.పా పోటి చెయ్యదని ప్రకటించారు.

ఇక్కడ కాన్సెప్ట్ పి.వి శతృ పార్టికి చెందినవారే అయినా అతను ఓ తెలుగు వాడు అన్నదే.
నేడు ఎన్.టి.ఆర్ లేడు. ఎన్.టి.ఆర్ అంత లేకున్నా ఒకింతవరకైనా కేంద్రాన్ని,ఆదిష్ఠానాన్ని  వారి వెక్కిలి వేషాలను అదుపు చెయ్యగల నాయకుడు వై.ఎస్. అతనూ లేక పోయాడు.

ఇక మిగిలింది చంద్రబాబు. ఎంతటినీచ చరిత్ర కలిగి ఉన్నప్పటికి రాష్ఠ్ర్రం యొక్క పెద్ద దిక్కు పోయాక ఆ ఖాళిని పూరించ గల సత్తా- అనుభవం కలిగిన ఏకైక నేత చంద్ర బాబే. ఎన్.టి.ఆర్ ని అమరుడి చేసింది తనే. తీరా అమర్ రహే అని నినదించేదీ ఆయనే.

చంద్రబాబులో ఏ మాత్రం ఎన్.టి.ఆర్ పట్ల గౌరవం ఉన్నా రాష్ఠ్ర్రంలోని పార్టీలు,నాయకులను ఒక్క త్రాటి పై  తెచ్చి ,నడిపించి తెలుగు ఆత్మ గౌరవాన్ని దేశానికి ప్రపంచానికి చాటాల్సిన నైతిక భాధ్యత చంద్రబాబు పైనే ఉంది.

గతంలో తాను సి.ఎం గా ఉన్నప్పుడు  "ప్రతి దాన్ని రాజకీయం చెయ్యడమేనా? అసలు రాజకీయమంటే ఎన్నికలప్పుడే ఉండాలి" అనే బాబు ప్రస్తుతం 365 రోజులు రాజకీయమే చేస్తున్నారు.

వై.ఎస్. పూర్తి మెజారిటితో అధికారానికొచ్చినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మెజారిటి కాస్త తగ్గాక ఆసన్నమైన స్థితిగతులు వేరు. ఆదిష్ఠానం క్రమేనా తన అసలు స్వరూపాన్ని భయిట పెట్టడం మొదలైంది.

ఏదో వై.ఎస్. పుణ్యకార్యాలు అతన్ని అలా అలా పైలోకాలకు తీసుకెళ్ళి పోయాయి కాని,ఆయన బతికుంటే జగన్ పొజిషన్లో వై.ఎస్. ఉండి ఉండేవారు. పైగా సోనియమ్మకు తాను ఇందిరమ్మకంటే ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చేసింది. (ఇంతకీ ఇందిరమ్మ కాలి గోటికి సరిపోదు సోనియమ్మ)  ఉంటే నాతో లేదా మీరంతా నా శతృవులే అన్న చందంగా ఆమె బిహేవియర్ మారింది. రాష్ఠ్ర్ర ఎం.పికలు మంత్రి పదవులు దక్కక పోవడం సోనియమ్మలో ముదిరిపోతున్న అహంకార జబ్బుకు సూచికలు మాత్రమే . ఇది కాస్తా ముదిరిందంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లడం గ్యారంటి. అది రాష్థ్ర్రపతి పాలన కావచ్చు,ఎమెర్జెన్సి కావచ్చు, చట్ట సభను నిద్రావస్థలో ఉంచడం కావచ్చు.

ఈ పరిస్థితిలో రాష్ఠ్ర్రం పెద్ద దిక్కుగా ఉండి పార్టిలను ఒక్క త్రాటిపైకి తెచ్చే భాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. తమిళనాట ఎం.జి.ఆర్ మరణానంతరం కరుణకు ఇట్టి అవకాశమే వచ్చింది. కాని అతను ఆ పెద్దరికం అలవాటు చేసుకోక ఇప్పటికీ కాంగ్రెస్ చంక నాకే దుస్థితిలో ఉన్నాడు.

కాంగ్రెస్ ను రాష్ఠ్ర్రం నుంది తరిమి కొట్టడమే దేయంగా రాష్ఠ్ర్రం యొక్క అభివృద్ది,పరువు ప్రతిష్ఠల పరిరక్షణే లక్ష్యంగా, తెలుగు గౌరవాన్ని నిలిపే విదంగా బాబు ఒక వినూతన స్ట్ర్రేటజిని ప్రకటించాలి.

మనలో మనకు వెయ్యి వైషమ్యాలుండొచ్చు -కాని దిల్లి /కేంద్రం మాటకొస్తే మాత్రం ఒక్క మాట మీద నిలబడాలి . అప్పుడే తెలుగువారమన్న గౌరవం మనకు దక్కుతుంది.

ఈ బృహత్తర భాద్యతను స్వీకరించి బాబు కార్యాచరణ మొదలు పెడితే దిల్లీ వీథుల్లో పొర్లు దండాలు పెట్టే చంచాగాళ్ళు, స్వంత గల్లీల్లో సైతం ప్రజాబలం లెక సిల్లి రాజకీయం చేసే భజన పరుల బెడద పోతుంది.

చూద్దాం ఇప్పటికైనా చంద్రబాబు ఎన్.టి.ఆర్ స్థానాన్ని అందుకుంటారో ?లేక కనీశం వైఎస్ లేని ఖాళినన్నా పూరిస్తారో? లేక కరుణలా తయారవుతారో?

Tuesday, January 18, 2011

సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !

ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)

రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో  ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.

కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.

ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)

విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.

హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.

ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో  స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.

కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.

ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.

ఈ కథనంతో చిర్రెత్తి  2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి

ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.

Monday, January 17, 2011

తూ! నా బతుకు..

ఎవరికైనా సరే తమ బతుకు" పై తూ!  నా బతుకు.." అనే భావం కలిగిందంటే చాలా కష్ఠమవుతుంది. ఇలా అనిపించ కూడదంటే కాషాయం కట్టి కాశికి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మొదట మన సంపాదన -జీవన విధానంలోని నిరర్థకతను అర్థం చేసుకోవాలి. నిన్నటి నా టపా చదవని వారు ఇక్కడ నొక్కి ఒక మారు చదవండి. 

ఇక పాయింటుకొస్తా:

క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!

1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం  సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.

ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక  ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?

ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.

మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.

సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.

కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.

మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల  సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి?  కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?

ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.

ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.

వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...

మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.

జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి.  ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.

న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.

సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే  భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.

సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.

రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.

నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.

లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.

నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.

నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.

దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.

నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.

ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..

నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.

మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"

డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?

పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.

మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.

మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?

మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.

మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.

మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.

ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.

ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..

ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో  గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!

Sunday, January 16, 2011

శాంతికాముకులమని చెప్పుకునే వారికి కోపం వచ్చింది.

అందరికీ సమాదానం ఇస్తూ పోతే ఇక మరో పని చేసుకోలేను కాబట్టి సవివరంగా కమెంటు వ్రాసి ఎన్నో పాయింట్లు అందించిన శంకర్ గారికి ఈ సుధీర్ఘ సమాదానం ఇస్తున్నాను.

నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎటువంటి వైషమ్యం లేదు. వ్యక్తిగతంగా అందరూ నా స్నేహితులే.కాని జయేంద్ర వంటి క్రిమినల్ ను కేవలం కులప్రీతితో వెనకేసుకొచ్చే వారి తత్వాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.

ఇక శంకర్ గారి విమర్శ + నా ప్రతి విమర్శ ఇక్కడ:
శంకర్ గారూ,
ఇది మీ టర్న్ .మీ వ్యాఖ్యలోని ముక్క ముక్కకి ముక్కల మద్య ఖాళీలకు సైతం సమాధానమిస్తా. మూర్ఖులు తమ మూర్ఖత్వాన్నిదాచుకోవాలంటే ఒక్క చక్కటి మార్గముంది.అదేమంటే "మౌనంగా ఉండడం" లేదా "అతి తక్కువగా మాట్లాడటం/వ్రాయడం. పాపం ! మీకీ సూక్తి తెలిసుండ లేక పోవడంతో ఇలా నోరు (చెయ్యి) పారేసుకున్నారు)

//నేనొక “సాంబారు గాణ్ణి” అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్ కాబట్టి, నీ పోస్టులకి ఇంత విలువ ఇవ్వక్కర్లేదు, //
సాంబారుగాడు అంటే తమిళుడని అర్థమంతే. తమిళులంటే మీకు పడదనే భావం వస్తూంది. రూపాయికి సింబల్ డిసైన్ చేసినవాడూ ఒక తమిళుడే ..దాన్ని సైతం వాడరా?

//అందుకే కనీసం ఎవరూ కామెంట్స్ రాయాట్లేదు, అంతేగాని నీకు భయపడి కాదు.//
సాహసవంతుడు ఎంత దాచుకున్నా అతనిలోని సాహసం ఇట్టే భయిట పడినట్టే భయస్తుల భయం కూడ ఇలా -మీ కమెంటులా భయిట పడి పోతుంది. భయస్తుడే సదా సర్వకాలం తనకు భయంలేదని బాహుటంగా  చాటుకుంటుంటాడు

//ఇక పాయింట్ కొస్తే, రాజుల పరిపాలన, బ్రాహ్మణ వ్యవస్థ కుప్పకూలి, నేటికి సుమారు వెయ్యి సంవత్సరాలు కాలేదా (మన దేశాన్ని ముస్లిమ్ లు, ఆంగ్లేయులు ఆక్రమించుకొని ఎన్నాళ్ళయ్యింది?//

బాసూ రేపు మావోలు జనజీవన శ్రవంతిలోకొచ్చి  ప్రభుత్వం ఏర్పాటు చేసినా అప్పటికీ కొనసాగుతుందీ ఈ వ్యవస్థ. పునాది నేటిది మొన్నటిది కాదు. యుగ యుగాల పునాది ఇది.

//ఆ తర్వాత స్వంతంత్ర వుద్యమ కాలంలో కుల, మత, జాతులను మర్చిపోయి, అంతా సమానంగా పోరాడి, మన దేశాన్ని మనమే పాలించుకుందాం అనే సదుద్దేశంతో అంతా ప్రాణాలు అర్పించారు//

సమానంగా పోరాడారని ఎలా చెప్పగలము బాసూ..వారి జనాభాఎంత బహుజనుల జనాభా ఎంత? వారిలో నూటికో కోటికో ఒక్కరు రంగంలోకి దిగి పోరాడి ఉండొచ్చు.ఇతరులు బ్రిటీషువారిచ్చిన అవార్డులు,రివార్డులు,రాయితీలు అనుభవిస్తూ వచ్చినవారేగా? ప్రభుత్వ సేవలో తరించిన వారేగా? ఇందులో పోలీసు శాఖలో ఉన్నది ఎంత మంది. దుభాషీలుగా పబ్బం కడుక్కున్నదెంతమంది?

// సరిగ్గా అప్పుడే బ్రిటీష్ వాదులు మనలో ఈ జాతుల చిచ్చు, కుల చిచ్చు పెట్టేరు//
అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి బాసూ.. రాముడు వద్దకు ఒక ఫిర్యాదు వస్తుంది." శూద్రుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు " ఇది ఫిర్యాదు యొక్క సారాంశం .వెంటనే రాముడు విల్లమ్ములతో భయలు దేరి ఒక్క బాణంతో ఆడ్ని చంపేసాడు. -ఇదీ బ్రిటీషువాడు పెట్టిన చిచ్చేనా?

//, అది ఇప్పటికీ రావణ కాష్టంలా కాలుతునే వుంది, వుంటుంది కూడా…//
స్థూలంగా కాలుతున్నా బహుజనుల గుండెలు మాత్రం గతంలో వారు పెట్టిన చిత్రహింసల చిచ్చు కాస్త చల్లారాయనే చెప్పాలి. చాలా మంది తెర వెనుక జరుగుతున్న "కుట్ర్లల"గురించి తెలీక "హ..ఇంకా ఏం బ్రాహణత్వం పాపం వారి మానాన వారు బతుకున్నారని అని చెప్పేవారు కూడ ఉన్నారు.

అయితే జయేంద్ర వంటి వారి చేష్ఠలు,వారి చేష్ఠలకు వత్తాసు పలికేవారు మాటలు/వ్రాతలు  ఆ మంటలో పెట్రోల్ పోస్తున్నవి.

//ఎందరో మహానుభావులు రాసారు మన ఈనాటి రాజ్యాంగాన్ని//
ఇక్కడే ఉంది అసలైన జిష్ఠు అంటే మీ ఉద్దేశం బి.ఆర్ అంబేద్కర్ పాత్రను చిన్నది చేసి చూపడమే. అయ్యా వెదవ సలహాలు లక్ష ఇవ్వొచ్చు .కాని వాటినంతా ఏరి, కూర్చిన అసలైన పాత్రను అంబేద్కర్ పోషించారు. ఇదే కీలకం.

//కాని ఈ రాజకీయ వేత్తలు వాళ్ళకి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తూ //
ఈ మార్చడాలకు కావల్సినంత తెలివి తేటలు శూద్రులకు ఏదీ? వారికి ఇటువంతి దిక్కుమాలిన సలహాలిచ్చి బ్రష్థు పట్టించిందెవరంటారూ? తమ కులాన్ని క్రాపు,కోటు ,సూట్ల వెనుక దాచుకున్న బ్రాహ్మణోత్తములైన సెక్రట్రీలు,ఆడిటర్లు కాదంటారా?

//అడ్డగోలు గా కోట్లు సంపాదిస్తున్నారే,,//
అలా సంపాదించిన వారికి యజ్న ,యాగాదులు చెయ్యిస్తామంటూ దోచుకుంటున్నారే వీరికి ఆ దోపిడిలో భాగం ముట్టినట్టేగా?

//వీళ్ళలో ఎంత మంది బ్రాహ్మలున్నారు?//
ఇదేగా వారి వైవిధ్యం. ప్రయోగించే వీలు,వెసలుబాటు ఉన్నప్పుడు అధికారం ఏ ఎదవ దగ్గర ఉంటే ఏమనిగా వారు తెరవెనుక భాగోతాలు నడిపిస్తున్నది.

//(స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? నీ ద్రుష్టిలో గుంటనక్కలని పిలవబడే బ్రాహ్మలు కాదే?)//
ఇదేంటి బాసూ.. జయేంద్రలాగా పారా పారాకు మాట మారుస్తున్నావు? ఓహ్.. రాజ్యాంగాన్ని రూపొందించింది  అంబేద్కర్ కాదు "మేధావులు". రాజ్యాంగానుగునంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది మాత్రం బహుజనులే అన్నది మీ ఉద్దేశం అవునా?

నేనెక్కడ కూడ బ్రాహ్మణులు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని చెప్పను. చెయ్యిస్తున్నారు. అదీ బహుజనుల్లో నుండి అధికారంలోకి వచ్చిన బహుజనుడి చేత తమ చేతికి రక్తం అంటకుండా చెయ్య్సిస్తున్నారు. తమ వద్ద ఉన్న భూమిల్ని -అగ్రకులస్తులు-వారివద్దనుండి బహుజనులు తీసుకున్నారన్న అక్కసుతో కదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో క్షవరం చెయ్యిస్తున్నారు?

// మరి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఎంత దారుణంగా వుంది//
అన్నీ కరెక్టే బాసు..ఇలా దిగజారేలా  చెయ్యించింది ఎవరు అన్న పాయింటు మీదేగా మీకు నాకు విభేదం. మీరేమో బహుజనులే చేసారంటారు. నేనేమో మీ వారే చేతికి మట్టంట కుండా చేసారని చెబుతున్నా.

//అసలు సామాన్యుడు (ఏ కులం వాడైనా) బతికే రోజులున్నాయా?//
ఇదేంది బాసూ.. మొన్నేగా ఎవరో ఒక బ్రాహ్మణోత్తముడు మావాళ్ళు మాత్రం లక్షలు సంపాయిస్తున్నారని చెప్పేరు. బహుజనులు ఎమ్.ఎల్.ఏలు,ఎం.పీలు,మినిస్టర్లైనంత మాత్రాన వీటన్నింటికి వారే కారణమని ఎలా చెప్పగలం.

ఒక్క ఎన్.టి.రామారావు తప్ప, జయలలిత తప్ప మరెవ్వరైనా సరే ప్రభుత్వ ఉధ్యోగుల జోలికి పోయి బతికి బట్ట కట్ట కలిగారా? సరే వీరిలో కూడ మా సంఖ్య అల్పమంటారేమో? అత్యధికంగా ఉన్న బహుజనులను నడిపే పొజిషన్ మీదే కద బాసూ.. ఒక వేళ బహుజనుడే యూనియన్ లీడర్ అయినా ఆడ్ని నడిపేది మీరే కదా?

ఇస్లాం తప్పు చేసిన అంగాన్ని తెగ కొయ్యమని చెప్పినట్టుంది మీ వాదన. అసలు ఆ అంగాన్ని కదిలించింది బుర్రేగా. ఆ బుర్రలాంటి వారు బ్రాహ్మణులు.అయితే బుర్రకు శిక్ష ఉండదు. దాని ఆదేశానుసారం పని చేసిన అంగాన్ని మాత్రం నరికి వేస్తారు.
 ఉ. కేంద్ర మంత్రి రాజా - అతనికి ఈ స్కామ్ చేసే" సాంకేతిక" సహకారం అందించిన "ఆళ్ళు" కాలో చెయ్యో స్వతంత్రించి పని చెయ్యవు కాక చెయ్యవు.

// ఒక ఆడ పిల్లకి పట్ట పగలే రక్షణ లేదు(ఎన్ని యాసిడ్ దాడులు జరుగుతున్నాయి?//

ఇందుకుకారణం వేదం -వెళంకాయ్,పురాణం, పునీతం అంటూ సెక్సును దాదాపుగా నిషేదించడమే. ఈ పుణ్యం కూడ తమదేగా.

//ఇప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళు,//
కాళ్ళు చేతుల్లాంటివారే -వీరికి మతమనే మత్తు ఇచ్చి - సెక్సు గురించిన గిల్టి తెప్పించి -వారిని కామ పిశాచాలుగా మార్చింది అహేతుకమైన ప్రవచనాలేగా

// వాళ్ళకి కొమ్ము కాస్తుందీ కూడా బ్రాహ్మలేనా తండ్రీ?//
ఇటువంటి కేసులు వాదిస్తున్న లాయర్లు ఎంతమంది వారిలో బ్రాహ్మణులెంత ? ఒక లెక్క తేల్చండి చూద్దాం

//ఒక కులం వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతూ తరతరాలుగా కోట్ల ప్రజల సొమ్ముని మింగేస్తూ వుంటే నీ లాంటి సాంబారు నా…(ఇంకో తిట్టు) అంతా ఏం చేస్తున్నారు?//

వారి వెనుకనుండి స్కెచ్ ఇస్తూ చేతికి మట్టి అంటకుండా భాగం పొందుతున్నవారిని చూసి గోళ్ళు గిల్లుకుంటున్నాం

//ఇక ప్రబుత్వ వుద్యోగుల్లో ప్రతిభ వున్నా, లేక పోయినా సీనియర్లని వెనక్కి తోస్తూ అడ్డగోలుగా ప్రమోషన్లు కొట్టేస్తూ, పని చేసినా చెయ్యక పోయినా జీతాలు తీసుకుని, లంచాలను తీసుకుంటూ అటు ప్రజల సొమ్ముని, ఇటు ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్న వాళ్ళలో బ్రాహ్మలెంతమంది వుంటారు?//
వారలా ప్రవర్తించడానికి కారణం అతని హక్కులను కాల రాసి, ఆడ్ని జంతువుకన్నా హీనంగా  చూసి రెచ్చ కొట్టింది కుల వ్యవస్థ కాదా? వాడ్ని బహుజనుడిగా గౌరవించి ఉంటే వాడిలో ఈ దనవ్యామోహం ఎందుకొస్తుంది.వాడు తన కులాన్నే మరిచి పోవాలని ఎవడికీ తీసి పోనని నిరూపించుకోవడానికి ఎంచుకున్న తప్పుడు మార్గమిది. మరి ఈ మార్గంలోను "Script work" మనవాళ్ళదే మరి.

//అందుకే ఇప్పుడు ప్రెవైటేజషన్ పెరిగి//
ఇది రిజర్వేషన్ పై ఒళ్ళు మండిన చాణక్యుల కుట్ర అనేగా చెబుతున్నా

//గవర్నమెంటు వుద్యోగాలు తగ్గించి//
ఈ మాటకూ ఆ మాటే నా సమాదానం

//అన్ని పన్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు,//
ప్రైవేట్ వాళ్ళంటే ఆకాశంలోనుండి దూకారా బాసూ.. ఆళ్ళు మనోళ్ళేగా.. మరి ఆళ్ళని ఆడించేది కూడ "మనోళ్ళేగా". మరి ప్రైవేట్లోనైతే టోటల్ వ్యవస్థను  నియంత్రించే స్థాయికి ఎదగడం తేలిక

// అప్పుడు ప్రతిభ వున్న వాళ్ళే నిలబడతారు.//
ప్రతిభతో పాటుగా - భార్య -ఈడొచ్చిన కూతుళ్ళతో కలిసి పార్టీలకు కూడ అటెండ్ కావాలి మరి. ప్రైవేట్ అంటే అదీ అసలైన జిష్థు..

// ఇదీ కూడా మా బ్రాహ్మల పనే అంటావా?//
అంతేగా?
(ఇంకా ఉంది)

Friday, January 14, 2011

సాంబారుగాడి పై వేటుకు రంగం సిద్దం


ఓ ఇంట పాము దూరింది. దానిని ఆ ఇంటివారి పెంపుడు కుక్క చూసింది. మొరగడం ప్రారంభించింది. ఆ ఇంటివాడు ఆ కుక్కను నోర్ముయించడానికి కొంత సేపు ప్రయత్నించి తిక్కరేగి డబుల్ బ్యేరెల్డ్ గన్ తీసి కాల్చేసాడు. ఆ కుక్క హరీమంది.

ఆ ఇంట దూరిన పాము అంతా నిద్రపోయాక తన పని తాను చేసి పారేసింది. సరిగ్గా అదే నా విషయంలోను జరుగనుంది. జయేంద్ర పై నా విమర్శల పై కమెంటు చేసిన వారిపై ఏ చర్యా ఉండదు (పాము దూరడాన్ని ఎవ్వరూ గుర్తించలేదు) కాని వారి కమెంటు పై నా స్పందన పై మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది.అదేమంటే నా బ్లాగును నిషేదించడం.

బహుసా జెల్లడ,మాలికా డాట్ ఆర్గ్,కూడలిలలో కనిపించే చిట్ట చివరి టపా ఇదేనేమో? ఎందుకైనా మంచిది ఈ పేజిని బుక్ మార్క్ చేసుకొండి. ఇక జయేంద్ర పై నా విమర్శ పై వచ్చిన కమెంటు పై నా స్పందన ఇదో !

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు//
మీ వాళ్ళను మోసి మోసి భుజాలు కాయలు కాసాక,కాయ కోసి కల పండిందని మీవారే తింటుంటే చూసి ఏడవక చేసేదేముంది?

//కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు//
మేం ఏడుస్తే కరిగి పోయేదానికి మీరేమన్నా మాలా  సామాన్యులా? కేవలం బుర్రతో ఆలోచించే మేధావులు కదండి. గుండె ఉన్న స్థానంలో బండను కుదుర్చుకుని (బ్రాహ్మణ )స్త్ర్రీలను సైతం మీరు పెట్టిన యాతనలు అన్ని ఇన్ని కావుగా?

బాల్య వివాహాలను నిర్భందిస్తూ " నీ కూతురు పెద్దమనిషయ్యే ముందే పెళ్ళి చెయ్యాలి.లేకుంటే ప్రతి నెల ఆమె భహిష్ఠును త్రాగాలని ఆజ్నాపించినవారుకదా?
(సతరు శ్లోకం సైతం ఉంది - మీరు  ఆధారం కోసం నిలదీస్తే భయిట పెడతా)

//మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,//

కీలకమైన పొజిషన్లే అయితే అక్కడి వారు పది రూపాయలిస్తేగాని చెయ్యని పనిని మీవారు రెండు రూపాయలకు చేసి పెడ్తూ అక్కడి నిరుధ్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారన్న సంగతి తెలుసులెండి సారి

//(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు//
మీ వేదాల ప్రకారం సముద్రం దాటితేనే బ్రష్థులవుతారుగా.. మరి మీ వారి విదేశీయానానికి వేదాలు అడ్డురాలేదా బ్రదర్!

// కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి //
ఇదంతా తమ పుణ్యమే కద బ్రదర్.. వర్ణాల క్రింద విభజించింది మీరే కద తండ్రి!

//వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు//

వారికి సెక్రెట్రియేట్లో , మార్కెటింగ్ డిపార్ట్ మెంటుల్లో ,ఎస్టాబ్లిష్మెంటు సెక్షన్లలో కూర్చుని స్కెచ్ ఇచ్చేది తమవారే కదా..దొంగ లెక్కలిచ్చే ఆడిటర్లు,దొంగ కేసులు వాదించే లాయర్లు ఎంతమంది లేదూ

// ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు//
మీ వాళ్ళు వేదం వింటే చెవిలో సీసంకరిగించి పొయ్యాలన్నారుగా.. చదివితే నాలిక కోస్తామన్నారుగా.ప్రతిదానికి సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. అసలు విషయాలను దాచి పెట్టింది మీరే కదా..

గుడ్దిలో మెల్ల మేలన్న చందంగా బాబాల వెంట పడేరు బహుజనులు

//(వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా)//
కాదు కాని మీకు నకిలీలు

//బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి,//
మీ ఈ మాటను కాదన్నానా? కాదంటానా?

//ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, //
ఏం చేద్దాం గురూ.. మీరు మరీ కాపి రైట్ కోసం కకృత్తి పడేరు -సీక్రెట్ సీక్రెట్ అని టెన్షన్ పెట్టేరు. అసలు దొరకనప్పుడు నకిలీలకు మార్కెట్ రావడం మాములేగా?


//నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,//
మీ (వారి) అజెండా ప్రకారం పని చేసే ఎవడన్నా చేరేది శ్రీకృష్ణ జన్మస్థానం (కేంద్ర మంత్రిరాజా) లేదా ఖబర్ స్థాన్ ( రాజీవ్ గాంది) నాకా ఉద్దేశం లేదుగాని బాబాల సంగతి ఎప్పుడో ఉతికి ఆరేసి ఎండేసా.. మీకా తుత్తర అవసరం లేదనుకుంటా

నన్ను కుహానా జ్యోతిషుకుల పట్టికలో చేర్చడంతో నేనెంతటి నిజాలను నిర్భయంగా వ్రాసానో చెప్పకనే చెప్పేరు.

థ్యాంక్స్. ఇప్పటికీ ఒక్క ముక్క చెబుతున్నా వ్యక్తిగతంగా నాకు ఏ బ్రాహ్మణుని మీద గోరంత కోపమో,విరోధమో లేదు. నా ఆవేశానికి కారణం ఇప్పటికీ (ఇంత కాలం ఏలి - దోచి కూడ) భుద్ది మార్చుకోకపోవడమే..

//"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది"//
బ్రాహ్మణోత్తమా ! కాల దర్మం మీకు తెలియనిది కాదు. మారే కాలాన్ని పట్టి అన్నీ మారిపోతాయి. గతంలో నూటికి తొంబై శాతం వ్యవసాయం మీదే ఆధార పడి బ్రతికేవారు. పొలం దున్నడానికి ఎద్దులు అవసరం కాబట్టి గోవులకు ఎక్కడలేని ప్రాధన్యత ఇచ్చే వారు.పైగా అవి సాధు జంతువులు కాబట్టి  వాటిని కలిగి ఉండటం పెద్ద రిస్క్ లేని పని. అందుకే మీవారు మరింత కలర్ ఇచ్చి రాజులకు మస్కా కొట్టి బేవార్సుగా వేలాది ఆవులు తెచ్చుకునేవారు.అయితే వాటిని మేపడం యాదవులు చేస్తారు. అవి పాలీయడం మానేస్తే ఊళ్ళో పంచముడు తీసుకెళ్తాడు. చస్తే ఆడే తీసుకుపోతాడు. ఇది గో పురాణం వెనుకున్న అసలైన కిటుకు.

ఇక బ్రాహ్మణులంటారా at that time they were just un productive consumers of the society. ఎక్కడ తమర్ని సైతం కాయ కష్ఠం చెయ్యమంటారోనన్ని భయపడి ఇలా బిల్డప్ ఇచ్చుకునేసేరు.

// బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు)//
ఐ సీ ! మరి నేను కూడ సమాజ హితం కోరేవాడ్నే .. మీ వాళ్ళ వలే గ్రహ దోషాలకు పరిహారంగా  యాగాలు చెయ్యమని వేలకు వేలు గుంజడం లేదు.కుజ దోషముంటే రక్త దానం చెయ్యమంటున్నా. సర్ప దోషం ఉంటే ఇతర మత గ్రంథాలు చదవమంటున్నా. మరి మీ సంఘంలో నన్నూ ఒక సభ్యునిగా చేర్చుకోమనగలరా? ఎందుకండీ ఈ హిప్పాక్రసి. బ్రాహ్మణత్వమన్నది పుట్టుకతో నిర్ణయించబడుతుందని చంటి పిల్లవాడు సైతం చెబుతాడు.


// ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి,//

ఆర్టికిల్ ఏంది ఖర్మ! దుమ్ము దులిపాను. కేసులు పెట్టాను. పేపరుకెక్కాను . ఆమరణ నిరాహార దీక్షకూడ చేసాను.

// తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
దమ్మా? నా కణకణాల్లో జీర్ణించుకు పోయిందదొక్కటే సుమండి..

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Thursday, January 13, 2011

మళ్ళీ ప్లేటు ఫిరాయించిన జయేంద్ర

ఇక్కడో మాట..అక్కడో మాట -ఈ రోజో మాట ..రేపో మాట. ఇదే వరస. ఇక్కడేమో హైదరాబాద్ ఉమ్మడి రాజదాని ప్రాతిపదికన  రాష్ఠ్ర్రం విడిపోవాలని సూచించిన జయేంద్ర ..................

.........చెన్నైకి వెళ్ళగానే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని - రాష్ఠ్ర్ర విభజన తన ఉద్దేశాం కాదని చెప్పేరు.
గురువింద చందంగా తన పై ఉన్న ఆరోపణలు,కేసుల గొడవ చూసుకోకుండా ఇలా "నీతులు" "ఉచిత సలహాలు" విసరడం దేనికో అర్థం కావడం లేదు.ఇకనన్నా కులప్రీతితో జయేంద్రను వెనుకేసుకొచ్చేవారు మారితే మంచిది.

నా బ్లాగు పై నిషేదానికి కౌంట్ డౌన్ ప్రారంభం..

రోగాల పుట్ట, ఆఖరు ఘడియల్లో ఉన్న. మెనోఫస్ వయస్సును సైతం దాటిన మహిళా రచయత్రి పై లైంగిక వేదింపుకు పాల్పడ్డ జయేంద్రను - ఒక మనిషిని -మరీ శర్మల బాషల చెబితే సద్బ్రాహ్మణుడ్ని చంపటానికి ప్రొఫెష్నల్ కిల్లర్సును పంపిన జయేంద్రను, కేవలం కుల ప్రీతితో వెనుకేసుకురావడమే కాక శాపనార్థాలు పెడుతూ నన్నెదవను చేస్తూ కమెంటు వ్రాసాక నేను స్పందించాక (మరీ వై.ఎస్ బాణిలో ) నా బ్లాగు నిషేదానికి గురికాకుండా ఉంటుందా? అసంభవం ఆలోపు జయేంద్రను వెనుకేసుకొస్తున్న వారి విమర్శలకు నా సమాదానాన్ని ఈ టపా ద్వారా అందిస్తున్నా.

మానవహక్కులు తదితర కారణాలతో జయేంద్రను వెనుకేసుకొచ్చినా  అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం కుల ప్రీతితో వెనుకేసుకొస్తే దానిని ఏమనాలి? కుల గజ్జి అనాలా? కుల పిచ్చి అనాలా? నాకర్థం కాని సంగతి ఏమంటే రెడ్డి రెడ్డిని పొడుస్తే ఆడు చావడా? కమ్మను కమ్మ నరికితే ఆడు చావడా?

అసలెక్కడివి ఈ కులాలు? మరెక్కడివి ఈ మతాలు? అన్నీ మద్యలో వచ్చినవేగా? నాటి ఆఠవిక జీవితంలో కుల మతాలు లేవే.. కుల మతాలు ఎలా పుట్టుకొచ్చుంటాయో నా "దివ్య దృష్ఠి"లో చూసి చెబుతా.

ఆఠవిక జీవితంలో ఎప్పుడు వానొస్తుందో,ఎప్పుడు వరదొస్తుందో, మరెప్పుడు పెద్దపులు దాడి చేస్తుందో చెప్పలేని స్థ్తితి. మనుషులు గుంపులుగా ఒక నాయకుని క్రింద బతికేవారు. ఎవడైతే భలవంతుడో ఆడే నాయకుడు. ఎవడైతే భాగా ఏటాడతాడో ఆడే నాయకుడు. సాధారణంగా శారిరక భలం ఉన్నవారికి భుద్ది బలం కాస్త తక్కువే.

ఇదే అదనుగా ఆ గుంపులోని బలహీణులు + సూక్ష్మ భుద్ది గలవారు ఆ నాయకునికి దగ్గరై ఉండాలి. వానొచ్చే వేళ,వరదొచ్చేవేళ,పెద్ద పులు వచ్చి పడే వేళలను ప్రకృతి/పశు పక్ష్యాదుల్లో వచ్చే చలనాన్ని బట్టి చెప్పగలిగి ఉండాలి. ఈ ఒక్క పాయింటు మీద నాయకుని దగ్గరై ఉండాలి. ఇతరులను నాయకునికి దగ్గరై పోకుండా జాగ్రత్త పడి ఉండాలి.

ఈ సలహాదారు పోస్టు వంశ పారంపర్యంగా వచ్చుండాలి. పై తెలిపిన ముందు జాగ్రత్తలకు మానవాతీత శక్టులను జోడించి నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని దైనందిన జీవితాన్ని,జీవనాన్ని సుఖమయం చేసుకుని ఉండాలి.

ఈ సలహాదారులే,పూజారులుగా అవతరించి ఉండాలి. నాయకుని పై తమకున్న పట్టుతో ఇతరులను సైతం తమ సేవకు /పోషణకు విణియోగించుకునే ప్రయత్నం చేసి  ఉండాలి. అప్పుడు పౌరులు దీనిని వ్యతిరేకించి ఉండాలి.

గుంపు పెరిగినట్టే సలహాదారుల తీగ కూడ పెరుగుతుందిగా? ఎందుకూ పనికి ఆని ఈ సలహాదారుల గుంపును వృధాగా పోషించడం దేనికని (నా బోటివారు) కొందరు నిలదీసి ఉండవచ్చు.

ఆ తరుణంలో ఈ ఎదవలు ఒకటై ఉండడంతోనేగా ఈ సమస్య.. వీరిని వర్ణాల పేరుతో విడకొడితేగాని వీరి పోరు పడలేమనుకున్న సలహాదారుల గుంపు వర్ణాలను సృష్ఠించి ఉండాలి .

(నిజానికి పుట్టే బిడ్డయొక్క వర్ణం ఎలా ఫిక్స్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ ఆధారంగా ఇంకో తరుణంలో చెబుతా. )

వర్ణాల మద్య ఐక్యతను దెబ్బ తీయడం కోసం వారి మద్యే వారు కొట్టుకుని చావాలని కుతంత్రాలతో కూడుకున్న డివిషన్ ఆఫ్ లేబరును అమలు చేసి /వారి మద్యే వివిద గ్రేడింగులు ఇచ్చి ఉండాలి.

నాయకుడు వారి చేతుల్లోనే ఉన్నాడు కాబట్టి ఇది సుసాధ్యమే. ఈ సలహాదారుల వంశీయులే నేటి బ్రాహ్మణులు. ఇటువంటి తెగ ప్రతి దేశంలోను ఉంటుంది.పేర్లే వేరై ఉంటాయి.

ఏ దండయాత్ర అనంతరం ఏ ప్రభుత్వం ఏర్పడినా.ఏ రాజు వచ్చినా వీరు వారివద్ద పనికి కుదిరి (దుబాషీలుగా/సలహాదార్లుగా/స్వదేశీయుల గుట్టు చెప్పే వారిగా) తమ హోదాను నిలుపుకుంటూ వచ్చేరు.

ఎప్పుడైతే ముస్లీంల దండయాత్ర మొదలైందో అక్కడ నుండి వీరి ప్రాముఖ్యతలు క్షీణించడం మొదలయ్యాయి. వాడు లాయిలాహి ఇల్లల్లాహి మొహమ్మదు రసూరుల్లాహి అంటూ వీరి విగ్రహాలను, యాగాలను,పూజలను పొరక పుల్లక్రింద తీసి పారేసాడు.

కష్ఠే ఫలి -వళ్ళు వంచి పని చేస్తేనే భువ్వ అనే పరిస్థితికి వీరొచ్చేసేరు.అందాక అంటి పెట్టుకుని ఉన్న నిరర్థక వేదాలు,ఉపనిషత్తులు,పురాణాల మూటను పెరట పడేసి విదేశి బాషలు నేర్వడం,గణితము,  మొదలగు వాటి పై దృష్ఠి పెట్టేరు.

తదుపరి వచ్చిన బ్రిటీషు పరిపాలనలో వారిచిన భిరుదులతో మురిసి పోయి జీవితాన్ని గడిపేసిన బ్రాహ్మణ మేధావులు కోకొల్లలు. కాని బేసికల్ గా మేధావులు కాబట్టి కాసింత బవిష్య వాణి తెలిసిన వారిగా స్వాతంత్ర్య ఉధ్యమంలోను కొందరు పాల్గొన్నారు.

రాజులు,సుల్తాన్లు  పోయి మంత్రులొచ్చేరు.వీరు వారి పక్కన సెక్రెట్రీలుగా,పి.ఏలుగా కుదిరేరు. వీరి మాటలు నమ్మినవారిని యాగాల పేరిట,పరిహారాల పేరిట ,దానాల పేరిట ముంచడమే అజెండాగా పెట్టుకునేరు.

దేవాలయాలను పైరవి సెంటర్లుగా చేసుకునేరు.  ఇంతకాలం వర్ణం,కులం పేరిట దూరం ఉంచిన బహుజనులను దగ్గర చేసుకుని మరింత దోచుకోవడం కోసం అన్య మత ప్రచారం భూచి చూపుతున్నారు.

పాలించేది ఏ పార్టి అయినా,మంత్రి ఏ కులస్తుడైనా అతన్ని వెనుకనుండి నడిపేది మాత్రం వీరే. నేడు స్పెక్ట్ర్రం కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒక దళితుడే కావచ్చు కాని కథంతా నడిపింది మాత్రం వీరే.

తాము మైనారిటిగా ఉండడంతో -వీరిచే అంటరానివారుగా -పంచములుగా -శూద్రులుగా ముద్ర వేయ బడిన -బాధితుల ప్రతిఘఠనల నుండి తమర్ని తాము రక్షించుకోవడం కోసం
ఐక్యమత్యమే మహాభలమంటూ ప్రవర్తిస్తున్నారు.

తమ కులానికి చెందిన వ్యక్తి అతనెంతటి దుర్మార్గుడైనా సరే వాడ్ని వెనుకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేరు.

మారే కాలాన్ని బట్టి తమ రంగాలను మార్చుకున్నారే తప్పా తమ అజెండాను మాత్రం మార్చుకోలేదు.  వారి అజెండా రెండే ఒకటి తమ ఐక్యమత్యాన్ని పెంచుకోవడం, రెండు : బహుజనుల ఐక్యతకు గండీ కొట్టడం.

నిజానికి నాటి సలహాదారులు చేసిన పనుల్లో చాలావాటిని వాతావరణ కేంద్రం ( వానలు ఎప్పుడు కురుస్తాయో చెబుతారు)  నేటి డాక్టర్స్,సైంటిస్టులు, గన్ మ్యేన్స్, సైకియాట్రిస్టులు చేస్తున్నారు. మనం గౌరవించాలి,పూజించాలి. అంతేగాని కేవలం కుల ప్రాతిపదికన ఎవరినీ గౌరవించాల్సిన అవసరమూ లేదు.

ఈ నేపధ్యంలో జయేంద్ర పై నా విమర్శల పై వచ్చిన కమెంటుకు నా సమాదానాన్ని రేపు అందిస్తాను.

ఇది నా పోస్టుపై వచ్చిన కమెంటు:

దీనికి సమాదానంగా నేనిచ్చిన ఉపోద్ఘాతమే నా ఈ టపా. క్రింది కమెంటును ఒక సారి చదవండి. దీని పై నా స్పందనను రేపు తెలియచేస్తా

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు, కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు, మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,

(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు) కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు,  ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు (వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా) బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి, ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,

"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది" బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు) ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి, తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//

Wednesday, January 12, 2011

వివాహ పూర్వం పురుషులు పుంసత్వ సర్టిఫికేట్ పొందాలి : నటి మనోరమా

ఇది మీకైతే ఫ్లాష్ న్యూస్ అయ్యుండొచ్చు గాని తమిళులకు ఇది పాత చింతకాయ పచ్చడి.దీని పై పెద్ద దుమారమే చెలరేగింది.

ఈ విషయమై ఉధ్యమిస్తానని కూడ మనోరమ ప్రకటించారు. నిజానికి పుంసత్వ పరీక్షతో తమ క్వాలిఫికేషన్ను నిరూపించుకోవలసిన దుస్థితికి నేటు పురుష ప్రపంచం చేరుకుందంటే అది అతిశోయక్తి కాదు.

పురుషుల వీర్యంలో జీవకణాల సంఖ్య విపరీతంగా పడి పోతున్నాయి. ఒక్క రూపాయి పెట్టి ఒక రీఫిల్ కొంటే అది వ్రాస్తుందో లేదో చూసి కొంటాం. మరి లక్షలు లక్షలు కట్నాలు పోసి కొనుక్కునే మగాడిలో అసలు మగతనం ఉందో లేదో తెలుసుకునే హక్కుమనకు లేదా?

వాత్సాయనుడు తన కామ సూత్రంలో పురుషాంగం యొక్క కొలతలను ఇలా చెబుతాడు: 3 అంగుళాలు,6 అంగుళాలు,9అంగుళాలు. ఇవి ఈ రోజుల్లో సాధ్యమేనా ? ఎక్కడో నీగ్రోలకో ఏవో కొన్ని తెగలకో మాత్రమే ఉంటుంది. (ఇంతకీ పురుషాంగం సైజుకి రతిలో సుఖానికి ఏ సంబంధము లేదు సుమా ఎందుకంటే స్త్రీ యోణిలోని మొదటి 3 అంగుళాల వరకే స్పర్శ ఉంటుంది).

ఆ నాడు ఆ సైజు ఉన్నది కాబట్టే వాత్సాయనుడు తన కామ సూత్రంలో ఉటంకించాడు. అంటే నాటి మానవుల జీన్లో ఉందా రహస్యం. వారి జీవన విదానం, ఆహార పద్దతులు అలా ఉన్నాయి.

మానవుడు ఎప్పుడైతే వండుకొని తినడం మొదలు పెట్టాడో అక్కడికే అతను రోగాల పుట్టగా మారిపోయాడు.

నేను 2,3  వ తరగతి చదివే రోజుల్లో  ఐదో తరగతి పిల్లల్లో కొందరికి మీసాలు వచ్చేసాయి అంటే నమ్మండి. కాని పాపం చాలా అమాయకులు.  ఇంతకీ అది 1974-1975 సం.లే  కాని ఇప్పట్లో పదవ తరగతి అబ్బాయి సైతం నాటి 5వ తరగతి పిల్లాడిలా ఉంటున్నాడు. ఇందుకు కారణం ఏమిటి?

మన ఆహార పద్దతులు , తగిన వ్యాయామం లేక పోవడం, హైపర్ టెన్షన్స్ మాత్రమే. ఉదయమే ఇడ్లి దోశ, మద్యాహనం భోజనం/పప్పు ,రాత్రికి భోజనం పప్పు ఇవేగా మన ఆహార పద్దతులు. ఇంకా మురికి కాలువల పై పాని పూరి, బేల్ పూరి , లేదా బ్యేకరి ఐటంస్, ఐస్ క్రీంస్, ఫాస్ట్ ఫుడ్, లేదా జంక్ ఫుడ్. దీంతో అనవసర కొవ్వు చేరడం, షుగర్ రావడం అల్సర్, అజీర్తి,మలబద్దకం, ఇలా ఒకటేమి అన్ని రోగాలు వస్తాయి.

మనం వాడే మేలురకం బియ్యం మెషిన్ చేత పాలిష్ చేయబడినది. దాని కొనలో (స్త్రీ యోణిలీ క్లిటోరిస్ ఎంత కీలకమో అంత కీలకం ఇది కూడ) విటమిన్ బి ఉంటుంది, మెషిన్లోకి తోసిన వొడ్లు ఈ విటమిన్ బ్ ని పోగొట్టుకుని కాని భయిట పడవు.
బియ్యం = కార్బో హైడ్రేట్గా కార్బో హైడ్రేట్ గ్లూకోస్ గా మారుతాయి.
అదనంగా ఉన్న గ్లూకోసును శరీరం గ్లైకోజనుగా మార్చి తీరాలి. ఇందుకు ఇన్సులిన్ అవసరం. అది తగ్గితే షుగరు వస్తుంది. మనం మూడు పూటలా భియ్యం తింటుంటే లీటర్ల కొద్ది ఇన్సులిన్ అవసరమవుతుంది. దానిని స్రవించే కెపాసిటి మన శరీరానికి ఉండాలిగా ?
కాబట్టి వీలైనంత వరకు భియ్యం తగ్గించి రాగులు, జొన్నలు, వంటి ఇతర దాన్యాలను కూడ వాడాలి. అలాగే ఇంకో సూత్రం ఉంది:
పచ్చిగా తింటే 100 శాం సేఫ్ , ఉడక పెడితే 50 శాతం సేఫ్ , తాళింపు చేస్తే 35 శాతం సేఫ్, వేంపుడు సాక్షాత్తు విషం.
ఏం తింటున్నాం ,ఎలా తింటున్నాం లతో పాటు ఎప్పుడు తింటున్నాం అన్నది కూడ ముఖ్యం. అడ్డమైన వేళల్లో తింటే జీర్ణం కాదు. అజీర్తి, మలబద్దకాలే అన్ని రోగాలకు మూలం. (అన్నట్టు మలబద్దకం ముదిరితే మూలం /అదే పైల్స్/కూడ వస్తుంది)

ఐస్ క్రీంస్ కథకొస్తే మన బాడి ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు. ఐస్క్రీం 0 డిగ్రీలో ఉంటుంది. ఇది వెళ్ళి మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలని చూస్తుంది. మన శరీరం తన ఉష్ణోగ్రతను మెయింటైన్ చెయ్యాలని చూస్తుంది. అనవసరమైన టక్ అఫ్ వార్ జరుగుతుంది. ఈ పోటీలో ఏది నెగ్గినా దెబ్బ తినే ది మాత్రం మన ఆరోగ్యమే.

అలాగే జంక్ ఫుడ్స్. ఒక వస్తువు ఇన్ని గంటలవరకే భాగా ఉంటుందన్నది ప్రక్రుతియొక్క రూలు. దానిని అధిగమించటానికి మన సైంటిస్టులు వాటిలో ఏవేవో కలుపుతారు. వాటి యొక్క రి యేక్షన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇక ఫాస్ట్ ఫుడ్ అంటారా ? మన ఇంట్లో అమ్మగాని, భార్యగాని మన కుటుంభంలోని నలుగురి కోసం చేస్తేనే ఏవేవో జరిగి పోతున్నాయి. అటువంటిది మనమంటే ఏమాత్రం సెంటిమెంట్ లేని, కేవలం మన పర్సులోని డబ్బే ద్యేయంగా వండి పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కథను మీరే ఊహించుకొండి.
మానవ శరీరంలో ఎసిమిలేషన్ (ఆస్వాదించటం) ఎలిమినేషన్ (విశర్జించటం) అనే ఈ రెండు ప్రక్రియలు సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సెక్సుకే కాదు మరి దేనికైనా పనికి వస్తుంది లేకుంటే మరెందుకూ పనికి రాదు.

తినడం ఒక ఎత్తైతే దానిని సక్రమంగా జీర్ణం చేసుకోవడం ఇంకా ముఖ్యం. మంచి నీళ్ళు దారాళంగా త్రాగడం, మద్యలో చిరు తిండ్లు కూల్ డ్రింక్స్ త్రాగడం, టీ కాఫి త్రాగడం వంటివి చెయ్య కూడదు. పైగా మంచిగా నిద్ర పోవాలి. ఇవన్ని సక్రమంగా జరిగితే తిన్న తిండి జీర్ణమై శక్తినిస్తుంది. ఆ శక్తిని రతికో మరొక దానికో వినియోగించుకోవచ్చు.
అజీర్తివలన నవ్వ,గజ్జి,గడ్డలు, మంట, వాయు ఉపద్రవాలు, అసిడిటి ఇలా ఒకటి కాదు ఎన్నో రోగాలొచ్చేస్తాయి. ఇంతటితో ఆగకుండా తగిన వ్యాయామం కూడ చెయ్యాలి.ఆరోగ్యమైన శరీరమే అయినప్పటికి రతిలో మరో ముఖ్య చిట్కాను ఫాలో కాకుంటే భురద కుంటలో పడినట్టే. అదేమంటే .. తిన్న తిండి పూర్తిగా జీర్ణం కాక ముందు తినడమే కాదు, రతిలో పాల్గొనడమే కాదు, రతి గురించిన తలంపులు కూడ జీర్ణ ప్రక్రియను ఆపి వేస్తాయంటే నమ్మండి.

Tuesday, January 11, 2011

తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి

మీకంటే మేమే చాలా వెనుక పడ్డామని సీమాంద్ర నేతలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ వాదులు వినిపించుకోలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా శ్రీ కృష్ణా కమిషన్ అదే మాట చెప్పడంతో వారు ఆత్మ రక్షణలో పడేరు.

వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?

మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.

వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.

ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.

రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు  దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం  నిర్వివాదాంశం. దిల్లీ వారు  ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.

తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.

ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.

తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.

1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.

2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం

3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి

4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.

5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్  జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన  బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం  రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే  నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల  కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ  శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో  వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.

తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత  లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.

పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.

Monday, January 10, 2011

లేచి పోదాం రా!

లేచి పోయే భార్యలే ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే అవకాశం లేక నరకాన్ని భరిస్తున్న భార్యల సంఖ్య ఇంకా ఎంత పెద్దదుంటుందో మీరే ఊహించుకొండి. అలా లేచి పోయే భార్యలకు వకాల్తా పుచ్చుకోవడం నా ఉద్దేశం కాకున్నా , కేవలం "కోరికలు" నెరవేరలేదని వెళ్ళిపోతున్నారని, "కొవ్వెక్కి" వెళ్ళి పోతున్నారని మాత్రం నేను చెప్పను. కేవలం ఈ కారణం చేత లేచి పోయేట్లుంటే పత్రికల్లో మ్యేట్రిమోనియల్స్ లాగా "లేచి పోయిన వారి ఆచూకి"కోసం సెపరేట్ శీర్షికలు వచ్చేవి.

నా ఈ 43 మైనస్ 20 సం.ల అనుభవంలో ఇలా లేచి పోయినవారి కథలు వెయ్యి దాకా చూసి ఉంటాను. ఒక డాక్టరు భార్య నలుగురితో ( ఒకే సమయంలో కాదండి బాబూ) ఒక్కో సారి లేచి పోయి రిటర్న్ వచ్చింది.

అవివాహితునిగా ఉండగా వివాహితతో లేచి పోయి, చేతిలో డబ్బులై పోయాక ఆవిడ ఈడ్ని చీకొట్టి తరిమివేస్తే రిటర్న్ అయ్యి ఒక విడోను పెళ్ళాడి,ఇద్దరు పిల్లల్ని కన్నాక మళ్ళీ ఒక అవివాహితతో లేచి పోవాలని ప్లాన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండలేక, లేచి పోయి ఎక్కడున్నాడో తెలీని యంగిస్కాన్ ఒకడి గురించి చెప్పాలంటే సీరియల్ వ్రాయాల్సిందే.

మా ఊళ్ళో పెద్ద కిరాణా కొట్టువాని భార్య ఆ కొట్టులోనే పని చేసే కుర్రానితో లేచి పోయింది . ఆ కుర్రాడు నగా నట్రా అంతా ముందురోజే తన వద్దకు రాబట్టుకొని మర్సటి దినం ఆమె
తిరుపతి రైల్వే స్టేషన్లో కాచుక్కూర్చుంటే ఈడు దాని వంక కూడ చూడలేదు.ఈ పింజారి వెదవ ఓనర్ రొటీనుకే భానిసయినట్టున్నాడు.

ఆవిడ కొన్ని గంటలు వేచి చూసి  తిరిగి ఇల్లు చేరింది. ఆ కుర్రాడ్ని నగా నట్ర కోసం వారం రోజులు గదిలో బంధించి మరీ కొట్టారు. కాని వాడి నోట ఒక మాట కూడ పెగల్లేదు. చికాకు పుట్టి తరిమి వేసారు. మూన్నెల్లయ్యాక ఆ విశ్వాస ఘాతకుడు మరో పెద్ద కిరాణా షాపు నెలకొల్పాడు.

ఇటువంటి వాటికి అసలైన కారణం భార్యా భర్తల్లో ఒకరు రొటీనుకు భాగా అలవాటు బడడం మరొకరు రొటీను పై విసిగి వేసారి పోవడమే అనిపిస్తూంది.

ఒక సారి వాన పడినప్పుడు ఆ  వాన నీరు ఏ రూట్లో వెళ్ళిందో మళ్ళీ ఎన్ని సార్లు వాన కురిసినా అదే రూట్లో వెళ్తుంటుంది.(మద్యలో ఎవడన్నా బడాబాబు దానిని ఆక్రమించి వేయకుండ ఉన్నంత వరకు) .మనుషులు కూడ ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఇదే నాకు మండుద్ది.

మా ఊళ్ళో కిరాణా కొట్టు నడిపే వైశ్యులు పాపం ఉ.పూ నాలుగు గంటలకు లేస్తారో మూడుకే లేస్తారో లేదు నిద్రే పోరో  తెలీదు కాని ఉదయం  ఐదు గంటలకే షాపుకు వచ్చి లోపల కుక్కేసిన బస్తాలన్నింటిని లాగి రోడ్డును ఆక్రమించి సర్దుతుంటారు. మరి షాపు మూసేదానికి రాత్రి పది పదకొండవుతుంది.

మిట్ట మద్యాహ్నం గిరాకియే లేకున్నా కునుకు పాటు పడుతుంటారే గాని ఇంటికి మాత్రం పోరు. కార్మికుడు ఎనిమిది గంటలే పనిచెయ్యాలని ఎప్పుడో రూల్ వచ్చేసినా వీరు మాత్రం కుటుంభం, భార్యా,పిల్లలు,తమ రుచులు,అభిరుచులు,భయిట ప్రపంచం అన్నింటిని గాలికొదిలేసి గొడ్డు చాకిరి చేస్తుంటారు.

నా భావం ఏమంటే పుట్టాము గనుక బతకాలి.బతకాలంటే కొంత  డబ్బు కావాలి.అందుకు ఏదో ఒకటి చెయ్యాలి. మరి దానికి ఒక టైమ్ లిమిట్ ఉండాలిగా. కొడుకు ఏ గల్లా పెటెలో నుండి ఐదొందలు నొక్కేసాడా? వెయ్యి నొక్కేసాడా? ఏ అమ్మాయి వెంట పడుతున్నాడు వంటి సమాచారం కూడ లేక నిత్యం అను నిత్యం షాపు షాపు అని చస్తుంటే ఎలా?

ప్రతి ఊళ్ళోని బజారులో షాపు వారంతా ఒక చోట కలిసి తమకంటూ ఒక టైమింగ్ ఏర్పాటు చేసుకుంటే ఏం? ( ఆడు ముందుగా తీస్తాడు. వీడు ముందుగా  తీస్తాడు.నా గిరాకీ అంతా పోతుందని ఆరాట పడేగా ఈ పని చేస్తున్నారు.అందరూ ఒక నిర్ణయానికొస్తే బెటర్ కదా)

పండుగలు,పబ్బాలు,బంద్, పెళ్ళీ,పేరంటాలు దేనికి మరి దేనికి హాజరు కాక ,తాము సంఘ జీవులమనే బావత్తు కూడ లేక ఈ యాంత్రిక జీవితం గడపడం ఏలా? చివరికి ఊభకాయం, అల్సర్,గ్యాస్,షుగర్,బి.పి వంటి రోగాలకు గురి కావడం దేనికి? కుటుంభ సభ్యులతో సంబంధాలు బెడిసి కొట్టి ఎదవలవడం దేనికి? లేచిపోయిన భార్యలు,కూతుళ్ళ కోసం వెతుక్కోవడం దేనికి?

వ్యాపారస్తులే కాదు ఆఫీస్ గోయర్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తుంటారు. వీరు ఇల్లు చేరడానికి రాతి పది పదకొండు అవుతుంటుంది. ఆఫీస్ గోయర్స్ మాత్రమే కాదు రిటైర్డ్ పెర్సన్స్, నిరుధ్యోగులు, పారా సైట్స్ సైతం ఇలానే ప్రవర్తిస్తారు.

తాపి పని చేసే వారు ఉదయం ఒక చౌక్లో గుమి కూడుతుంటారు.వీరి  అవసరమున్నవారు అక్కడొచ్చి వీరిని ఎంగేజ్ చేసుకుంటారు.ఇది ఓకే. సాయంత్రం మళ్ళీ వచ్చి అక్కడే గుమి కూడుతారు. సరే మంచి చెడ్డా మాట్లాడుకుంటారనుకుంటే సా. ఆరునుండు రాత్రి పది పదకొండు వరకు ఇదే తంతా.

వీరు మందుకొట్టి,చిక్కెన్ పకోడా తిని తేపి వెళ్ళే లోపు ఇంట ఉన్న వారు ఏం కావాలి?వారి మనస్సులు ఏం కావాలి?
ఆ కాలనిలోని ఏ పింజారి వెదవో వీరిని "లేచి పోదాం రా!" అని రెచ్చ కొడితే రచ్చకెక్కాలిగా?

Sunday, January 9, 2011

నాడు అనచివేత -నేడు స్వేచ్చ : రెండింటితోనూ నష్ఠం స్త్ర్రీకే

పుట్టడమే తల్లిగా పుదుతుంది ఆడపిల్ల. ఆరు సం.ల వయస్సుగల పాప ఏం చక్కా  అన్నం వడ్డిస్తుంది. తల్లికో,తండ్రికో అనారోగ్యం చేస్తే ఓర్పుతో వారిని కనిపెడుతుంటుంది.

కాని 50 సం.ల వయస్సున్న మగవాడు సైతం చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. ఆడపిల్ల కేవలం ఆడపిల్లే అయితే ఆమె ఎలా ఉన్నా సమస్య లేదు.

కాని ఒక విదంగా ప్రకృతి సిద్దంగానే స్త్రీ వికలాంగురాలు. శారీరక దౌర్భల్యాన్ని అధిగమించవచ్చు గాని దాంతో సంక్రమించిన మానసిక దౌర్భల్యాన్ని ఓవర్ కం కావడం ఎంతో కష్ఠం. అందుకే నేను మొత్తుకుంటున్నాను.

మొదట మీ శారీరక దౌర్భల్యాన్ని పారాద్రోలండి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడి. మీరెంత అందంగా ఉంటారు, ఎంత మందిని ఆకర్షిస్తారన్నది మీ భలం కాదు. మీ శారీరక బలహీనతను అంగీకరించడమే అవుతుంది.

నేను 1987లో జిల్లా ఖజాణాకార్యాలయంలో సెక్షన్ రైటరుగా పనిచేసాను అక్కడ  సావిత్రి  అని ఒకావిడ. (పేరు మార్చాను లెండి) బక్క చిక్కిన శరీరం, పొంతనలేని పొట్ట, కొత్తమిరి కట్టకన్నా ప్రేలవంగా జుట్టు, గుళ్ళ గూబ కళ్ళు.

అయితే మనం (నేను) ఆత్మనే చూద్దాం కాబట్టి ఆమెతో కూడ క్యేషువల్ గానే ఉన్నాను. దీంతో ఆమె  నాకు దగ్గరై తన ఫ్యేమిలి ఆల్బం చూపింది. అందులో ఆమె చిన్ననాటి ఫోటో చూసి బిత్తర పోయాను . ఆ రూపం అచ్చం  భానుప్రియాలా ఉండే . జస్ట్ ఒక టైఫాయిడ్ ఇంత పని చేసిందట.ఆమె ఒక డైవోర్సీ, విడాకులకు ఆమె కురూపానికి సంబంధం లేదు. ఇతర కారణాలవలనే విడాకులైంది.  అందం సంగతి ఇది.

 స్త్రీ భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన సవాళ్ళు అనేకం ఉ. పీరియడ్స్, డెలివరి, ఆ సమయంలో సక్రమంగా తినలేక పోవడం , ఇప్పట్లో ఆ సవాలు డబుల్ అయ్యింది. స్త్రీ స్వాతంత్రయం పేరిట ఉధ్యోగాలు కూడ చేసి పెట్టాలిగా.

అప్పట్లో కొన్ని పనులు ఆమెకు తప్పేది. ప్రస్తుతం టూ వీలర్ నడుపుతుంది కాబట్టి అవీ ఆమె నెత్తినపడ్డాయి. ఫాస్ట్ నెస్స్ అన్నది గమ్యాన్ని చేరుకోవడంలో వస్తే ఫర్వ్చాలేదు గాని నిరర్థక, భవిష్యత్తుకు వినాశకరంగా తయారయ్యే కార్య కలాపాలవలన నష్ఠ పోయేది స్త్రీయే.

కాలం మారిందని ఎంతగా రొమ్ము బాదుకున్నా పురుషుడు మాత్రం ఆఠవిక యుగంలోనే ఉన్నాడు. తనతో పాటు పది మందితో తిరిగే ఆడ పిల్లను పెళ్ళి చేసుకోడు. కేవలం తనతో మాత్రం తిరిగుంటే అది వేరే సంగతి. కాబట్టి ఈ ఫాస్ట్నెస్స్ వలన లూజర్ స్త్రీయే.

అప్పట్లో సమాజం స్త్రీని అనచి వేతతో దోచుకుంటే ఇప్పుడు స్వాతంత్ర్యం పేరిట దోచుకుంటూంది. నేను మహిళలను కోరేది ఒక్కటే మీరు  ఫస్టఫాల్ మనుష్యులు. ఆ తరువాతే లింగ బేదం.

మీరు మీ ప్రియునికో, మీ భర్తకో ఆ గంటో /పావు గంటో స్త్రీగా ఉంటే సరిపోయేది గా. 24 గంటలు వేష ధారణ, హావ భావాలు, సిగ్గు పడటాలు, బుగ్గలు ఎర్ర బడటాలు ఎందుకనే.

ఇవి మిమ్మల్ని ఎదుటివారి ముందు నిలబెడతాయని మీరు భ్రమిస్తున్నారు. కాని వీటి వలన మీరు పండుకోవలసి వస్తుందేమో కాని నిలబడటం కల్ల. ( నా ఈ మాట సూటిగా మీ బుర్రలోకి ఎక్కాలనే కఠినమైన పదాలు వాడాను. క్షమించండి)

ఇక్కడ కలిసి తిరగడంలో ఉన్న చిక్కేమంటే ఇందులో నష్ఠ పోయేది కేవలం స్త్రీయే. గర్భ ధారణ, ఎయిడ్స్, సుఖ రోగాల సమస్య లేనప్పటికి ( కేండోంస్ ఉన్నాయి కాబట్టి) అపఖ్యాతి పాలు కావడం మాత్రం తప్పదు. లో క్లాసు, హై క్లాసు కథ ఎటో ఉన్నా మిడ్డిల్ క్లాస్ స్త్రీలకు మాత్రం ఇది గొడ్డలి పోటే కాబట్టి తస్మాన్ జాగ్రత్త ..

మనుష్యులుగా ఉండండి. మనుష్యులుగా ప్రవర్తించండి. మనుష్యులుగానే సాధించవచ్చు. మీరు స్త్రీ అన్న సంగతి కేవలం మీ జీవిత భాగస్వామికి రుజువైతే చాలు సుమా !

యుగ యుగాల్గా మిమ్మల్ని కృంగ దీస్తున్న శారీరక బలహీనతకు స్వస్తి పలకండి. పౌష్థిక ఆహారం, తగినన్ని వ్యాయామం ,అవసరమిన విశ్రాంతి విషయంలో స్వార్థ పరులు కండి.

మిమ్మల్ని కేవలం స్త్ర్రీగా చూసేవారి పట్ల జాగ్రత్త వహించండి. వారు మీకు తాత్కాలికంగా  మేలే చేసినా వారు మిమ్మల్ని మనుష్య్లులుగా తిరస్కరిస్తున్నారన్న సంగతి మరిచి పోకండి.

చాలు నాడు అనచివేతతో, నేడు స్వేచ్చతో దోపిడికి గురైంది చాలు. మెల్కొండి..

Saturday, January 8, 2011

చిత్తూరు షుగర్ ఫ్యేక్టరి - పర్యావ"రణం"

చిత్తూరు సహకార చెక్కిర ఫ్యేక్టరి - పర్యావ "రణం"

జయేంద్ర వంటివారు మతాన్ని,ఆథ్యాత్మికాన్ని కలుషితం చేస్తుంటే గళం విప్పినట్టే చిత్తూరు సహకార సెక్కిర ఫేక్టరి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే  గొంతెంతి నినదిస్తున్నాను.

నేను పసలేని గీతలు చెప్పే భగవంతులకన్నా సృష్ఠిని భగవంతునిగా చూడటానికే ఇష్ఠపడతాను. సృష్థి భగవంతునికన్నా సీనియర్.

సృష్ఠితో పోల్చుకుంటే మనం అత్యల్పులం. పైగా సీనియారిటి ప్రకారం చూసినా సృష్ఠి సీనియర్ మోస్ట్. మనం కొన్నాళ్ళు  ఉంటాం. చస్తాం. ఇక ఎన్నో లక్షల తరాలు పుట్టాలి. కాని మన భాధ్యతా రాహిత్యం వలన కేవలం పర్యావరణ కలుషితం కారణంగా పిల్లలు  పుట్టలు పుట్టలుగా చస్తారనిపిస్తుంది కాని పది కాలాల పాటు బతుకుతారనిపించలేదు.

సరే విషయానికొస్తున్నా. ప్రజల కొసం పజలు చేసుకునే రాజ్యం ప్రజాస్వామ్యం. సభ్యులు సభ్యుల కోసం చేసుకునేది సహకారం. పైగా ఈ షుగర్ ఫేక్టరి రైతులకోసం  రైతులచే నడిపించబడే ఫ్యేక్టరి.

దీనివలన జరిగే ఇతరత్రా కలుషితాల కథ పెద్దగా తెలీక పోవచ్చు కాని (తప్పక ఉంటాయి)
ఒక్క వాయు కాలుష్యం ద్వారానే గిన్నెస్ రికార్డు స్థాయికి "పని"చేసేస్తున్నారు.

వీరు ఏం కాలుస్తున్నారు? ఎందుకు కాలుస్తున్నారు? తెలీదు కాని ఫ్యేక్టరి చిమ్ని నుండి దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగలోనుండి బొగ్గు తునకలు వచ్చి పడతాయి. (బెంచి రవ సైజులో ఉంటాయి) గాలికి అవి పట్టణ ప్రజలందరిని వారి ఇళ్ళ మేడల మీదికి వచ్చి మరీ పలుకరిస్తాయి.

గాలీవాటంగా పట్టణమంతటా వ్యాపిస్తాయి. అంతేగా అని మీరనుకోవచ్చు. కాని వీటివలన ఫ్యేక్టరి పరిసరప్రాంతాల్లో ఉన్న ప్రజలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. (కట్టమంచి,దొడ్డిపల్లె).

పొలాలపై,గొడ్డు గోదల పై, పితికిన పాలు పై, మనుషుల శరీరం పై పడేవి వానొచ్చినప్పుడు,కడిగినప్పుడు పోతాయంటారేమో? పాలు వడపోస్టే సరిపోతుందనుకుంటారేమో? స్నానాలు చేస్తే శుభ్రమై పోతాయంటారేమో?

కాలుకి చెప్పుల్లేకుండా నాలుగడుగులు వేసి కాళ్ళు కడిగితే లీటర్ల కొద్ది నీళ్ళు వినియోగించినా నలుపు నలుపే అంటే చూసుకొండి.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ బొగ్గు తునకలు మనుష్యుల స్వాశ కోశల్లోకి వెళ్తే? మానవ శరీరం తనలోకి అన్యవస్తువులను అనుమతించదు. పసి పిల్లలకు మలబద్దకం ఉంటే తమలపాకు  కాడెను దాని ఆసనద్వారంలోకి దోపుతారు.వెంటనే మలవిశర్జణ జరుగుతుంది. శరీరం అన్యవస్తువైన కాడెను భయిటకు తోసి వెయ్యడానికే అంత ఆతృతతో మలాన్ని భయిటకు పంపుతుంది.

ఇంత ఎందుకు ఒక నూలు పోగును ముక్కు దగ్గరకు తీసుకెళ్తే వెంటనే తుమ్మొస్తుంది. ఇదెందుకంటే దానిని భయిటకు తరిమే ప్రయత్నం.

పై తెలిపిన బొగ్గు తునకలు పొరభాటున స్వాశ ద్వార స్వాశకోశంలోకి చేరిపోతే శరీరం దాన్ని భయిటకు పంపి వెయ్యడానికి ప్రయత్నిస్తుంది. స్వాశకోశ గల్ల ఉత్పత్తి చేసి గల్లద్వార దానిని భయిటకు పంపాలని ప్రయత్నిస్తుంది.అదృష్ఠం భావుండి ఆ తునక భయిటపడితే సరే సరి. ఒక వేళ అది ఊపిరితిత్త్లుల్లో నాటుకు పోతే ?

శరీరం ఆ తునక నాటుకు పోయిన భాగం కుళ్ళి పోయేలా చేస్తుంది. అప్పుడు ఆ తునక రిలీజై పోతుందని శరీరం ఉద్దేశం. కాని కాని.. దీనిని మనం టి.బి అంటాం గుర్తుందో లేదు దీనికి క్షయరోగమని మరో పేరుకూడ ఉంది.

క్షయం అంటే క్షీణించడం. కరగడం.కృంగడం. శరీరమే కృంగి పోతుంది. సాధారణ వస్తువైతేనే ఈ ఎఫెక్టు. పై తెలిపిన బొగ్గు తునకలో ఏముందో? ఏమో? అది ఊపిరితిత్తుల్లో నాటుకు పోతే ఏం చేస్తుందో ఏమో?

ఇప్పటికి లక్షల టన్నుల బొగ్గు తునకలు గాలిలో కలిసి పట్టణమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇవి ఎందరి ఊపిరి తిత్తుల్లో ఆశ్రయం పొందాయేమో? ఎంత మంది క్షయరోగానికి గురయ్యారేమో? అందులో ఎంతమందికి అది లంగ్ క్యేన్సర్ స్థాయికి వెళ్తుందేమో?

జిల్లా కేంద్రంలోనే ఇంతటి దుస్థితి అంటే మారుమూల గ్రామాల్లో, అఠవి ప్రాంతాల్లో కలుషితం ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకొండి.

గమనిక:
ఈ విషయమై పలువురు ఔత్సాహికులు ఇప్పటికే పలుమార్లు  యాంటి  పొల్యూషన్ బోర్డు, కోర్టుతలుపులు సైతం తట్టేరు .కాని ప్రయోజనం ఏమో శూన్యం.

కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో దాచినా, మంచి గాలి,నీరు,సారవంతమైన నేలను మిగల్చకుంటే తమ వారసులు సైతం కుక్కచావు చావవలసిందేనన్న చిన్న సత్యం మన నాయకులకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో? షిట్ !

Friday, January 7, 2011

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన " జయేంద్ర : భాగం2

నిజానికి శంకరా కమిషన్ రిపోర్టు గురించి ఒక టపా వ్రాయడమే ఎక్కువ. జయేంద్ర సరస్వతి ఏదో సమస్త హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అన్న అపోహ చాలా మందిలో ఉన్నా అతను కేవలం ఒక కులానికి పరిమితం అన్న సంగతి అందరికీ తెలుసు. పైగా అతను ఓ మాటన్న మాత్రాన విభజన జరిగిపోయేది లేదు.. ఆగేది లేదు.

దీని పై టపా వ్రాయడంలో నా ఉద్దేశం పూజ్యులుగా చలామణి అయ్యేవారు సైతం సందర్భాలను పట్టి స్టాండ్ మార్చుకుని  పూజ్యాలుగా మారిపోతారని చూపడమే.

కాని గత జన్మలో జయేంద్రుడు ఏం చేసాడో ఏమో తెలీదు గాని మితృలు రాజేష్ జయేంద్ర తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. నన్ను రెచ్చ కొట్టి రచ్చకీడ్చి మరో టపా వ్రాసేలా చేసారు.

గతంలో ఒక సారి ఇలానే ఏదో వాగితే మరెవరో భాగా భుద్ది చెప్పారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ మాట పాపం ఆ మితృనికి తెలీక పోవడం అతని ఖర్మ.

నిజంగా నాకు టపా వ్రాయడానికి సైతం టైమ్ లేదు. తమిళంలో ఐదు వందలకు తక్కువ లేకుండా హిట్స్ కొట్టే నా రచనలు బ్లాగ్లోకంలో వంద రెండొందలకే పరిమితం కావడం కారణంగా ఉత్సుకత కుడ తక్కువే.అయినా ఏదో రోజు నిజం నిలకడ మీద తేలనీ అని వ్రాస్తున్నా.

మరీ  ఈ పొడవాటి కమెంటు పై కమెంటు చెయ్యడం తెలివితక్కువ పనేమో అనిపిస్తూంది. ( ఈ సమయంలో ఒక జాతకానికి ఫలితం పంపితే రూ. 250  నాదవుతుంది. కనీశం ఉచిత జ్యోతిష సలహా క్రింద వచ్చి పెండింగ్లో ఉన్న ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపితే పుణ్యమన్నా వస్తుంది.)

అయినా ఇలా వ్రాస్తూ పోవడం రాజేష్ కు సమాదానం చెప్పే వంకతో  జయేంద్ర గురించిన మరిన్ని సత్యాలను తెలుగు బ్లాగ్లోకానికి చాటాలనే .

రాజేష్ గారి కమెంటులోని ప్రతి మాట వెనుక,  మాటకు  మాటకు నడుమ ఉన్న పెడర్థాలు,వెటకారాలు  వక్ర బాష్యాలను కడిగెయ్యకపోతే నేను వై.ఎస్. అభిమానిని ఎలా అవుతాను?

(గుర్తుకు తెచ్చుకొండి అసెంబ్లి లో వై.ఎస్. డవులాగు - బాధితులు శ్రీ చంద్రబాబు - " నీ అమ్మ ఎందుకు నిన్ను కన్నానా అని బాధ పడేలా కడిగేస్తా)


// "
ఏరా అర్థం అయిందా, ఏవన్నా?//

నాది మృగరాజైన సింహ రాశి. మనుషుల బాసలకే కాదు మృగాల హూంకరింపులను  సైతం అర్థం చేసుకోగలను. తమరు ఏరా అని సంభోధించి జయేంద్రకు తగిన శిష్యులనిపించేరు. శభాష్!

కానీ తమరు ఎంతో బెటర్ లెండి. ఊక దంపుడు కమెంట్ వ్రాసేరు. ఆయన గారైతే నన్నూ శంకర్ రామన్ని  నరికించినట్టుగా నరికించేవారు.

//అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. //
జయేంద్రకు ఓటు హక్కుంటే సాలు .లేకున్నా బాధలేదు.భారతీయుడుగా అతని అభిప్రాయం అతను చెప్పే హక్కు అధికారం మస్తుగా ఉన్నవి. కాని సం.నికోసారి సం.పేరు మారినట్టు అభిప్రాయం మారితే ఎలా? ఆయనగారి ఉపదేశాలూ ఇలా మారి పోతాయేమో? సమాజంలో ఆదర్శనీయులుగా,ఆచరణ యోగ్యులుగా చలామణి అయ్యేవారు కనీశం అలా నటించాలి కదా . మరీ రాజకీయ నాయకుల్లా మాట మారుస్తే ఎల్లా అని ప్రశ్నించడమే నా ఉద్దేశం

//సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!. //

సత్య సాయి బాబా అంటే .. నేనే భగవంతుడంటుంటారు. ఎవరో చంపడానికొస్తే అలార్మ్ మ్రోగనిచ్చి బతికి బయిట పడ్డారే ఆ మహానుభావులేగా..ఉటంకించడానికి మరో వ్యక్తి మాట గుర్తుకురాలేదా బాసు..

//అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది. //

అవున్లెండి .ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంటుకి ?. ( కొత్త డాక్టరు కన్నా పాత రోగి నయమంట కదా?)

//.ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?//

రామకృష్ణ పరమహంస  ఎక్కువగా తీపి తింటున్న బాలునికి అది మానమని చెప్పే ముందు తాను మానారు కదా? ఇదే జయేంద్రవంటి మిడి మిడి జ్నానంతో రోజుకో వాగుడు  వాగే జయేంద్రలను కొలిచే కొలబద్దం..

ఒక కంపెనీ భాగా ఎదిగిపోతే సూపర్ టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విభజిస్తారు బాస్..

//ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా? //
గతంలో నా బ్లాగును నిషేదింప చేసినవారెవరో వారి ఆత్మ సాక్షికి తెలియాలిగాని వారితో నాకేంపని.వారి పాపాన వారు పోతారు అని నా ఉద్దేశం

//స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.

http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm


తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి. .//

మీకు నామీద ఎంత కోపమున్నప్పటికి మీడియాను నన్నూ ఒకే దొడ్డిన కట్టేస్తారా? మీరు సూచించేది ఏదో ఒక కేసుకు సంభంధించిందేకాని శంకర్ రామన్ హత్య కేసుకు సంభంధించింది కాదు కదా? దివంగత తమిళ రచయిత్రి అనురాధా రమణన్ పాపం ఆమె అప్పటికే పేషంట్ .రోజులు లెక్కపెట్టుకుంటుంటే ఆ సంఘఠన జరిగిందని ఆరోపణ. దీనికి సంబంధించి ఏదైనా పంచి పెట్టుంటే దాని తాలూకు లింకుకూడ ఇవ్వండి

//అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//

ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు.  నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు

సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన"జయేంద్ర సరస్వతి




కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమైఖ్య వాదానికి చెయ్యిచ్చారు. ప్లేటు ఫిరాయించేరు.గతంలో సమైఖ్య రాష్ఠ్ర్రమే శ్రేయస్కరమని చెప్పిన "పెద్దమనిషి"ఇప్పుడు మాట మార్చారు.హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా రాష్ఠ్ర్రాన్ని రెండు ముక్కలు చెయ్యొచ్చని చెప్పేరు. ఇందుకు  తెలంగాణావారు ఒప్పుకోరుగా..ఆందోళనలు జరుగుతాయిగా అని విలేకర్లు ప్రశ్నిస్తే రెండ్రోజులు జరుగుతాయి,తరువాత సర్దుకుంటాయని శెలవిచ్చేరు.
ఇప్పటికే శంకర్ రామన్ హత్య కేసులో ఇరుక్కుని సతమతమవుతున్న జయేంద్ర వారికి ఈ ఉచిత సలహాల జబ్బు ఎలా సోకిందో అర్థం కావడం లేదు. జయేంద్రకు దమ్ముంటే తమిళ నాడును రెండు రాష్ఠ్ర్రాలుగా చెయ్యాలని శలవివ్వాలి.

మఠానికి ఆస్త్లులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ఆతరువాత ఉచిత సలహాలిస్తే మేలన్నది నా అభిప్రాయం.

(ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు పెట్టి నా బ్లాగు నిషేదింప చెయ్యడం ఖాయం కాబట్టి ఆపుతున్నా)

గమనిక: స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ.. బాధితురాలు ఒక రచయిత్రి,

Thursday, January 6, 2011

శ్రీ కృష్ణా కమిటి మాటను ముందే చెప్పిన సాంబార్గాడు

జగన్ కొత్త పార్టి ఇలా ఉంటే మేలని ఒక టపా వ్రాస్తూ అందులో తెలంగాణ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపాను. దాని తాలూకు స్క్ర్రీన్ షాట్ చూస్తున్నారు. పూర్తి టపా చదవ కోరేవారు ఇక్కడ నొక్కండి

బొమ్మ పెద్దదిగా కనబడాలంటే దాని పై క్లిక్ చేసి కంట్రోల్ మరియు + బటన్ నొక్కండి

Wednesday, January 5, 2011

కేతు గ్రహం గురించిన మర్మాలు

జ్యోతిష్యంలో  అందరూ శనికి వనుకుతారు కాని వారికి కేతు ప్రభావమేమిటో తెలీదు. శనియన్నా దుస్థితిలో ఉంటేనే  దుష్ఫలితాలు ఇస్తాడు. కాని కేతు?

ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కీడే చేస్తాడు. ఇదెక్కడి పంచాయితీరా బాబూ అని జుట్టు పీక్కోకండి.

ఆయన జ్నాన కారకుడు.జ్నానాన్ని ఇవ్వడం ఆయన ధర్మం. జ్నానం ఎప్పుడు  వస్తుంది? కష్థాలొస్తేనే గా జ్నానం వచ్చేది అందుకని కష్ఠాలిస్తాడు కేతువు.

ఇలాంటి గ్రహాన్ని సృష్థించిన దేవుడు ఒక విలన్ అనిపిస్తుందా?

అవును బాసు అందరం అలానే అనుకుంటున్నాం. కాని ఆయన నూటికి నూరు పాళ్ళు హీరోనే.మన రక్షకుడే.

మరి ఎందుకీ కమ్యూనికేషన్ గ్యేప్ వచ్చింది? గత జన్మం ముగిసాక మనం ఆత్మ స్వరూపులమై ఉన్నప్పుడు మనమే అతన్ని ప్రార్థించాం. స్వామీ! ముక్తి కోసమని జన్మమెత్తి
ఈ జన్మంతా వృధా చేసాను. ఈ జన్మలో ఏ ఏ అంశాలైతే నా ముక్తికి అడ్డుగా ఉన్నాయో అవేమి తదుపరి జన్మలో నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడు అని మనమే ప్రార్థించాం.

ఉ.గత జన్మలో నేను మన యండమూరి వీరేంథ్రనాథ్ లాగా లీడింగ్ రైటరుగా ఉంటూ మాస్ ఫాలోయింగ్ కోసం చెత్త చెత్తవి వ్రాస్తూ టైం వేస్ట్ చేసి ఉంటాను. కాబట్టి ఈ జన్మలో నాకంత సీనొద్దు.

ఏదో నా మనస్సులో మాట భయిటకు చెప్పుకుని ఊరట పొందే అవకాశం ఉంటే చాలు స్వామి.. అని ప్రార్థించి ఉండవచ్చు.

ఇలా నేను ప్రార్థించినప్పుడు నా ఉద్దేశం ముక్తి. మరి ఈ రోజు "ఇదేంది బాయి..ముచ్చటగా మూడు వేలై మందైనా చదవని బ్లాగులో ఏం వ్రాసి ఏం పుణ్యం అని నేనే విసుక్కోవచ్చు. ఇందుకు భగవంతుడెలా భాధ్యుడవుతాడు?

ఇంతకీ నేను చెప్పనొచ్చిందేమంటే  మనకేదన్నా కీడు జరిగితే పెద్దలు అంతా మన మంచికే
నాయనా పోతే పోనీ అనే వారు.మరి అందులో లాజిక్ ఉందా? నిజముందా అని ఒక జ్యోతిష్కునిగా ఆరాదీసి నివ్వెర పోయాను. వాళ్ళ పాయింట్ 100% కరెక్ట్.మరెలా అంటారా? చెబుతా..

నా పుత్రికా రత్నం ఏడో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. ( మనకేమో ఎస్.ఎస్.సి.లో 72%). ఇదేందిరా ఖర్మా.. మనమేమో అది పాపం, ఇది పాపం,వారి పాపాన వారు పోతారని ,అన్యాయానికి సైతం రెక్కల కష్ఠం దోచి పెట్టి ఊరుకున్నాం. మన బిడ్డెందుకిలా తయారైందని తెగ బాధ పడి పోయేవాడ్ని.

కాని నేను ఆమెకు పరిచయం చేసిన కంప్యూటర్, పెయింట్ ఆమెను అడోబ్ ఫోటో షాప్ మీదికి ఉసికొలపగా ఈ రోజు నాకు సమానంగా కొన్ని సందర్భాల్లో నాకంటే ఎక్కువే సంపాదిస్తూంది.

పేరుకు స్టుడియో పని చేస్తున్నా ఆ స్టుడుయోకి ఏ టు జెడ్ ఆవిడే. ఇదెలా సాధ్యమైంది?
ఇంతకీ ఆమెకు తమిళం,తెలుగు,ఆంగ్లం ఏది చదవడం, వ్రాయడం రావు. మరెలా సాధ్యమైంది?

నేనైతే 1987 కాలేజినుండి భయిట పడిన నాటినుండి2007దాక ఎన్ని ప్రతిభలున్నప్పటికి రోలింగ్ స్టోన్లా అడుక్కు తిన్నా. మరి ఈ రోజు వద్దన్నా డబ్బులు. ఇదెలా సాధ్యమైంది?

నా పుత్రికా రత్నం జాతకంలో పదిన కేతు. నా జాతకంలో పదో స్థానాధిపతితో కేతు కలిసారు. కేతు అంటే సన్యాసం -భిక్షాటన. ఇవే పూర్వం జరిగాయి.

భవిష్యత్తులో ఆచరణకు రానున్న అన్ని అన్వేష్ణలు కేతుగ్రహ శాఖ క్రిందే వస్తాయన్నది శాస్త్ర్రం. జ్యోతిష శాస్త్ర్రాన్ని రూపొందించినప్పుడు కంప్యూటర్లు ఉండేవి కావు. భవిష్యత్తులో వచ్చిందే. కాబట్టి ఇది కేతు శాఖకు చెందింది. అందుకే నేను నా పుత్రికా రత్నం కంప్యూటర్ పరిజ్నానంతో రెండు చేతుల్లో సంపాదించకలుగుతున్నాం.

ఆనాడు భిక్షాఠన చెయ్యకుంటే ఈ రోజు ఈ సంపాదన లేదుగా?

Tuesday, January 4, 2011

2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

గతంలో చంద్రబాబు ఊతపదం "నిర్దిష్ఠ ప్రణాళికతో ముందుకు పోతాం"అన్నదే. ఆయనగారి ముందుకు పోవడంతో ఎన్.టి.ఆర్ రెక్కల కష్ఠంతో /భా.జా.పా రెండు శాతం ఓట్ల బిచ్చంతో మనుగడ సాగించిన తె.దే.పా విజయవంతంగా రెండో సారి ప్రతిపక్షంలో పడ్డది.

అందుకే నాకు ప్రణాళిక అంటేనే పరమ చికాకు. ఉద్దేశం మంచిదైనప్పుడు తిక్క తిక్కగా చేసినా పిచ్చ పిచ్చగా సక్సెస్ అవుదాం.

దురుద్దేశంతో ఎంత చక్కటి ప్రణాళికలు రూపొందించుకున్నా షెడ్డైపోతాం. అయినా చంద్రబాబు ఫోబియా కాస్త తగ్గడంతో 2011లో బ్లాగ్లోకంలో  నా అజెండా ఏమిటో ఈ టపా ద్వారా పంచుకుంటా.

నా రచనలు కేవలం క్రింది విషయాల పైనే ఉండాలని ప్రయత్నిస్తా. నిజానికి జ్యోతిషం చివరన ఉన్నా కేవలం హిట్స్ కోసం అడపా తడపా వ్రాయాల్సి వస్తూంది. పది మంది చదువుతున్నప్పుడు మంచి విషయాలు వ్రాస్తే పది మందికి చేరుతుందన్న కకృత్తితోనె జ్యోతిషం మీద దృష్ఠి పెడుతున్నాను .

తమిళ బ్లాగ్లోకంలో ఉన్న స్వేచ్చ ఇక్కడ లేదు .లేకుంటేనా సంచలనం మా ఇంటి పేరు.

*ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ? ( హత్యలు,ఆత్మ హత్యలు,దాడులు,ప్రమాదాలను వారించే మార్గాలు)

*విద్యా,విద్యా విదానంలోని లోపాలు సవరించుకునే మార్గాలు. యువతరం మాట బాట ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి?

* ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను తమ స్వయం కృషితో ఎలా సమకూర్చుకో వచ్చు అన్న విషయం పై సూచనలు (వృత్తి,ఉధ్యోగం,వ్యాపారం, సెర్వీసెస్ ఏదైనా సరే చట్ట బద్దంగా,దర్మ బద్దంగా)

*వివాహం సంతానం పిల్లల పెంపు

*ఆథ్యాత్మికం జ్యోతిష్యం

*ద్యానం యోగం
ఇవే శీర్షికలతో నా బ్లాగులో ఇంకెవరన్నా వ్రాయడానికి ముందుకొచ్చినా ఆహ్వానిస్తాను. పైగా నాకు నచ్చిన టపాలకు రూ.వంద పారితోషికం కూడ పంపుతా.

Monday, January 3, 2011

స్నేహం ప్రేమ పది కాలాల పాటు కొనసాగాలంటే

ఓషో చెబుతారు : ప్రతి ఒక్కరు స్నేహాన్ని -ప్రెమను కోరుకునే వారే గాని పంచేవారు ఎవ్వరూ లేదు. ఒక బిచ్చగాడు మరో బిచ్చగాడి వద్ద అడుక్కుంటే ఏం దొరుకుతుంది?

మన జీవితమనే రైలు తన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లను దాటుకుని వెళ్ళినా చివరికి ఆగనున్నది మరణమన్న స్టేషన్లోనే.

మరణాన్ని ఆప గలిగే స్నేహం -ప్రేమా ప్రతి ఒక్కరికి లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచమే పెద్ద బస్ స్టాండు. ఇక్కడికి వచ్చే బస్సులు కేవలం చావూరికే తీసుకెళ్తాయి.

అందాక బస్ స్టాండులో ఉన్న సాటి ప్రయాణికులతో కలిసి మెలిసి ఉంటే ఏం చక్కా కాలక్షేపం జరుగుతుంది. ఇక్కడ మనది,  మన స్నేహితులదే కాదు మన శతృవులది సైతం తాత్కాలిక బసే. ఈ ఒక్క పాయింటును అర్థం చేసుకుంటే శతృవులతో సైతం మనకు స్నేహం సాధ్యమే.

శతృవులను ప్రేమించడం గురించి తరువాత చెబుతాను గాని ప్రస్తుతానికి ఈ స్నేహం ప్రేమల గొడవేమోచూద్దాం.

ప్రపంచం చాలా పెద్దది. కోట్ల కొలది జనాలుంటారు. మీరు+మీ స్నేహితుడు/ప్రేమికుడు/ప్రియారాలు మాత్రమే ఉంటే ఎంత భావుండేదో అని మీరుఎన్నో సార్లు ఊహించుకుని ఉంటారు. కాని నిజమేమంటే
మీరిద్దరు మాత్రం ఉంటే ఒకరినొకరు చంపుకుని చచ్చి పోయేవారు.

కాబట్టి మీ ఇద్దరి నడుమ విద్యా -కుటుంభం-సమాజం ఇలా ఎన్ని ఉంటే అంత మంచిది అప్పుడే
స్నేహానికి -ప్రేమకు లాంగ్ లైఫ్.

మీరు మొబైల్ వాడేవారయ్యుంటే మీకు చార్జర్ సుపరిచితమే. చార్జర్ లోపల ఏముందో తెలీదనుకుంటా? మన ఇంటికి సరఫరా అయ్యే పవర్ 250 Volts .దీనిని డైరక్టుగా మొబైల్లోని బ్యేటరికి పంపితే మెటాష్ అయిపోతుంది.

అందుకని చార్జర్ లోపల ట్రాన్స్ ఫార్మర్ పెట్టి ఉంటారు. ట్రాన్స్ ఫార్మర్ అంటే మరేమో కాదు. అందులో వంద మీటర్ల పొడవుగల సన్నని రాగి తీగ ఉంటుంది. 250 Volts పవర్ ఒక కొనలో ఎంటర్ అయ్యి వంద మీటర్లు ప్రయాణం చేసి మరో కొనకు వచ్చే సరికి అది 4 volts గా మారుతుంది.

మీలో కలిగే ప్రేమ/స్నేహాన్ని అడ్డు అదుపు లేకుండా అవతలివారిపైకి వదిలితే మొబైల్ బ్యేటరిలాగా మెటాష్ అయిపోతారు.

అందుకే మీ ప్రేమ విద్యా -కుటుంభం-సమాజంవంటి నూట పదహారు మీటర్ల తీగకుండా ప్రయాణం చెయ్యాలి.

ఎదుటువారిని కేవలం బంకమట్టిలా భావించడం మనకు నచ్చినట్టుగా షేప్ అప్ చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం.

రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.

ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.

ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ  కురిపించారో ఆలోచించండి.

ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.

కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..

Sunday, January 2, 2011

ఘంటశాల భగవద్గీతలో లోపాలు



భగవద్గీత పై నాకు ఎన్నో విమర్శలున్నాయి. వీటిని తమిళంలో ఏకంగా సీరియల్గానే వ్రాసి సంచలనం సృష్ఠించాను. కృష్టుడు ఎలా ఉంటాడని తెలియని వారు ఎన్.టి.ఆర్ ని చూసి కృష్టుడు ఇలానే ఉండి ఉంటాడని అనుకుంటుంటారు. ఇదే విదంగా ఘంటశాల నోటి మాటగా భగవద్గీత వింటుంటే కృష్ణుడి మాటలు ఇలానే ఉండి ఉండాలి  అని అనిపిస్తుంది. ఇందులో ఏ తర్కానికి తావులేదు.

ఘంటశాల గొంతులో ఉన్న అదోరకమైన వర్ణనాతీతమైన దైవత్వం కేవలం కాలికో బైండు పుస్తకాల్లో భంధీగా ఉన్న ఆ శ్లోకాలకు రెక్కలు తొడిగిన మాట నిజమే. పండితుల రకరకాల ఉచ్చారణలతో నలిగిన ఆ శ్లోకాల ఉచ్చారణకు ఒక నిఘంటువుగా ఘంటశాల భగవద్గీత నిలిచింది.

ఉదయ పూర్వం చలిలీ మా రాములవారి గుడివీథి దాటి వెళ్తుంటే ఘంటశాల నోట ఆ శ్లోకాలు చెవి చేరుతుంటే నా కవి హృదయం ఈ భివియంతట శ్రీ కృష్ణుడ్ని ఊహించుకుని ఉర్రూతలూగేది. గీతలోని  అహేతుకాలు, అవుట్ డేటడ్ డేటాలు అన్నీ నా బుర్రలోనుండి ఎగిరి పోయేవి.

ఇంతకీ లోపాలని శీర్షిక పెట్టి ఈ సొల్లేంటి అని మీరు విసుక్కుంటున్నారు కదా? పాయింటుకొస్తా!

నిజానికి నేను లేవనెత్తనున్న లోపానికి ఘంటశాల కారకులయ్యుండరని నా విశ్వాసం. గీత అన్నదే ఒక సంభాష్ణ. దానిని రికార్డు చెయ్యాలనుకున్నప్పుడు ఇద్దరు గాయకుల్ని ఏర్పాటు చేసి ఉండాలి.కృష్ణుడి పాత్రకు ఘంటశాల -అర్జునుని పాత్రకు మరో గాయకుడు.

అలాగే ఫలానా అద్యాయం ఫలానా శ్లోకాలు అన్న డేటాలను చెప్పడానికి మరో వ్యక్తి గొంతును వాడి ఉండాల్సింది.

ప్రస్తుతమున్న టెక్నాలజికి గీతను రీ రికార్డింగ్ చెయ్యడం చాలా తేలిక. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ పని చెయ్యొచ్చు. అర్జునుని వాయిస్ కు ఎస్.పి వాయిస్ సరిగ్గా సరిపోతుంది. డేటాలు చెప్పడానికి మరో బిగినర్ ఎవరినన్నా వాడుకోవచ్చు.