Saturday, January 1, 2011

నేటి జర్నలిజం తీరు తెన్ను


చిత్తూరు ఎమ్.ఎల్.ఏ  సి.కె. బాబుచే మా 2011 మల్టి కలర్ క్యేలండర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేనొక ప్రకటన విడుదల చేసాను. పదిహేను పత్రికలకు  ఫోటోతో సహా ప్రెస్ నోట్ ఇవ్వగా కేవలం ఒక్క సాక్షి దినపత్రికలో మాత్రం వచ్చింది.  దానియొక్క  క్లిప్పింగ్ +ఆ ప్రకటన పూర్తిపాఠాన్ని ఈ టపాలో అందిస్తున్నాను.  నా ప్రకటనను ఈ క్లిప్పింగ్ ను పోల్చుకుంటే నేటి జర్నలిజం యొక్క తీరు తెన్ను ఏమిటో మీకు కంటికి కట్టినట్టు కనబడుతుంది.

నాడు వై.ఎస్. అధికారంలో ఉన్నప్పుడు  ఆ రెండు పత్రికలు వారి వ్యూస్ ను న్యూస్ రూపంలో తాటికాయంత అక్షరాలతో ఫ్రంట్ పేజిలో ముద్రించేవారు.  వారి ఆశలు -కోరికలు -కలలను పాఠకుని పై రుద్దేవారు (ఇప్పటికీ అదే పని చేస్తున్నారు -సాక్షిలోనైతే జగన్ ను జగత్ రక్షకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూంది -ఇది మరీ ఓవర్)

వారు వ్రాసిన ఏక పక్ష వార్తలు -ఆరోపణల పై సి.ఎమ్. మరియు సి.ఎం కార్యాలయం ఇచ్చే వివరణాత్మక ప్రకటనలకు  కూడా ఇలాంటి గతే పట్టింది. అందుకే సాక్షి పుట్టింది.

నా ప్రకటన పూర్తిపాఠం:
చిత్తూరు ఎమ్.ఎల్.ఏ  సి.కె.చే మా 2011 మల్టి కలర్ క్యేలండర్ విడుదల
చిత్తూరు ( డిసెంబరు,31)
చిత్తూరు,గుడిపాల సి.కె అభిమానుల సౌజణ్యంతో  ప్రముఖ పాత్రికేయులు చిత్తూరు మురుగేషన్ విడుదల చేసిన 2011 మల్టి కలర్  క్యేలండరును చిత్తూరు ఎమ్.ఎల్.ఏ సి.కె.బాబు స్థానిక చిత్తూరు క్లబ్ ఆవరణలో శుక్రవారం విడుదల చేసారు. ఈ క్యేలండరును పురప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా మురుగేషన్ విడుదల చేసిన ప్రకటనలో కులమతాల  కురుక్షేత్రంగా, తయారవుతున్న రాజకీయాల్లో వాటికి అతీతంగా కేవలం ప్రజాభిమానంతో వరుస విజయాలు సాధిస్తున్న సి.కెను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 2009 ఎన్నికల్లో దన ప్రవాహాన్ని ఎదురీదుతూ విజయం సాధించడమే  అతనికున్న ప్రజా భలానికి   తిరుగు లేని సాక్ష్యం అన్నారు.

తన అభిమానుల అభిమానిగా ప్రతి ఒక్కరికి అందుభాటులో ఉంటూ , 365 రోజులు, 24 గంటలు ప్రజాసేవకే పరిమితమైన సి.కె కున్న ప్రజాభిమానమనే వెల్లువలో ఎవరో ఆడించినట్టల్లా ఆడే   పార్ట్ టైమ్ రాజకీయ నాయకుల కుట్రలు, దుష్ప్రచారాలు కొట్టుకు పోతాయన్నారు

తాము విడుదల చేసిన క్యేలండరులో ప్రతి రోజు మంచి సమయాలను సూచించామని క్యేలండరు కావల్సిన వారు 9397036815 నెంబరుకు ఫోన్ చెయ్యాలని మురుగేషన్ తమ ప్రకటనలో తెలిపారు

1 comment: