Tuesday, November 30, 2010

కాంగ్రెస్ : గాంది కాలం నుండి అదే ఒరవడి

నేడు ప్రజాభిమానం పొందిన జగన్ ను కాదని మొన్న రోశయ్యను, నిన్నా కిరణ్ కుమార్ రెడ్డిని సి.ఎం చేసిన అదిష్ఠానం వైనం మింగుడు పడక కార్యకర్తలు విస్తు పోతుంటారు. కాని ప్రజాభిమానం చొరగొన్న వారిని పక్కన పెట్టడం  గాంది నెహృ కాలం నూండే కాంగ్రెస్ స్వంతమని వారికి తెలియదు

పాపం.గాంది Vs సుభాష్ చంద్ర బోస్:

నాడు కాంగ్రెస్ పార్టి అద్యక్షులుగా ఒకతనిని గాంది ప్రపోజ్ చేసారు. సుభాష్ చంద్ర బోస్ అతని పై పోటీకి దిగారు. వెంటనే మహాత్ముడని మన పిల్లలు బడిలో చదువుకునే గాంది తన పెద్దరికాన్ని తుంగలో తొక్కి తన అభ్యర్ది విజయం తన విజయమని, అతని ఓటమి తన ఓటమి అని ప్రకటించేరు. కాని ఎన్నికల్లో సుభాష్ చంద్ర బోస్ విజయం సాధించారు. వెంటనే గాంది నిరాహార దీక్ష చేపట్టారు. సుభాష్ చంద్ర బోస్ నొచ్చుకును తన పదవికి రాజినామా చేసి భయిటకొచ్చారు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి

No comments:

Post a Comment