Wednesday, March 17, 2010

మార్చి 1, 2009 నాటి టపా

ఆర్కుట్ గురించి తెలియని వారుండరు. ఇందులో రక రకాలైన అభిరుచులు గల వారు గ్రూపులుగా ఏర్పది ఉంటారు. వీరికి సందేశమివ్వాలంటే ఆ గ్రూపులోకి ప్రవేశించక తప్పదు.
ఇదివరకే చెప్పినట్టు ఆడవి దొంగ నుండి అల్లుడా మజాకా సినిమా వరకు నేనుసైతం చిరు అభిమానినే. అల్లుడా మజాకా సినిమాలోని బూతు డైలాగులు,అశ్లీల ద్రుశ్యాలతో విసిగి చిరుకు దూరమయ్యాను.
పాపం అభం శుభం తెలియని కుర్రాళ్ళు చిరు మాయలో కొట్టుకు పోయి బంగారు భవితను పోకొట్టుకుంటున్నారే అన్న భాధ తో చిరు గురించి నాలుగు మాటలు మెసేజ్ పెట్టాను.
అందుకు రక రకాలైన భూతులను స్క్రాబ్ చేస్తున్నారు. చంపుతామని,తంతామని బెధిరంపులు వేరు.
చిరు గారిని ప్రశ్నిస్తున్నా ! మీరు అరిచి గీ పెట్టే మార్పు ఇదేనా?
పి.సి.సి.ని తగుల పెడితే కాంగ్రెస్ వారు శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు.
మీ గురించి ఉన్న మాట చెప్పినందుకు మీ అభిమానులు భూతులు తిడుతూ చంపుతామంటున్నారు.
ప్రజలు ఇవన్ని గమనిస్తూనె ఉన్నారు.
చిరుగారు !
అందరు పార్టి పెట్టాక ,పొరబాతున గెలిచాక అవినీతికి పాల్పడుతారు ..కాని మీ విషయానికొస్తే పార్టి పెట్టి పెట్టకనే వసూళ్ళు జరిగినట్లు గా అరోపణలొస్తున్నాయి.
మిగిలిన పార్టిల్లో ఏ 5 సం.లకో మాత్రమే వలసలు జరిగేవి. కాని మీ పార్టిలో చేరిన కొన్ని నెలలకే వలస వెళ్ళిపోతున్నారు.
ఎన్.టి.ఆర్ హరిక్రుష్ణను కేవలం చైతన్య రథసారథిగా మాత్రమే వాడారు.
మీ పార్టిలో ఏమో పవన్,నాగ బాబు,అల్లు అరవింద్ తప్ప ఇంకెవ్వరికి ఏ పవరూ ఉన్నట్టు కనిపించటం లేదు.
సినిమాల్లో ఉంటూ కోట్లాది రూపాయల నల్ల దనాన్ని పారితోషికంగా స్వీకరించిన మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం హేయంగా లేదా?
పోని మీ స్వంత ప్రాపర్టిని పరిటాల వద్దనుండి కాపాదుకో లేక చంద్రబాబుతో పంచాయితీ పెట్టి విఫలమయ్యారని ఒక సమాచారముంది.
మీ ఆస్తినే కాపాదుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు?
అయ్య! మీ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు న్యాయం చెయ్య లేని మీరు రాష్ట్రంలోని మహిళాలోకానికి న్యాయం చెయ్యగలరని ఎలా నమ్మ మంటారు?
మీరే చెప్పారు..ప్రతి విమర్శకు పాల్పడమని సేవతోనే సమాదానం ఇస్తామని. ప్రతి విమర్శకాదు కదా మీ ప్రసంగాల్లో ముప్పావు సమయం విమర్శలు,ఆధారాల్లేనివిమర్శలకే,ఆరోపణలకే సరి పెడుతున్నారు.
రోజా అమ్మా అంటే షోబా రాణి నీయమ్మా అనే స్థితిలో మీ పార్టి ఉంది. మీ అభిమానుల్లో,మీ మహిళారజ్యం నేతల్లోనే మార్పు తే లేని మీరు మార్పు తెస్తానంటే ఎలా నమ్మమంటారు.
పథకాల అమల్లో అవినీతి జరిగిందన్నా అది అతికినట్టుంటుంది. మీరేమో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయంటున్నారు.
వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ద చూపిన మీ పార్టిలో మీరు అధికార ప్రథినిధిగా నియమించిన పరకాల ప్రభాకర్ వికలాంగుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారు, ఈ విషయం పై మీ స్పందన ఏమిటో ఇందాకా వెలుబడ లేదు..
చెరో చేనల్,చెరో పేపరు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టుకుంటూ,వై.ఎస్., జగన్,సాక్షి పత్రికల పై నిందాపనిందలను వేస్తున్నారు. మీరు రాజకీయ ప్రవేశం చెయ్యడానికి కొన్ని నెలలనుండి ఆంథ్ర జ్యోతి మీకు విపరీత ప్రచారం ఇచ్చింది. దీనికి గాను వారేం ఆసించారు? మీరు దేనిని తిరస్కరించారు? ఆ దేవునికే ఎరుక..
ఇప్పటికైనా సరే వసూలు చేసిన డబ్బులు ఆయా నేతలకు వెనక్కిచ్చి తప్పుకొండి. చూడటానికి వచ్చిన జనమంతా ఓట్లేస్తారని భ్రమిస్తే షెడ్ అయిపోతారు.
వై.ఎస్.అమలు చేసిన పథకాలతో ప్రతి కుటుంభంలో కనీశం ఒక్కరన్న లబ్ది పొందియున్నారు. మన ప్ర్జలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. క్రుతజ్ఞతా భావం ఎక్కువ. మీరు రేపొచ్చి ఇస్తానంటున్న వాతికన్నా,చేస్తానన్న వాటికన్నా ఇది వరకే తాము పొందిన వాటినే గుర్తు పెట్టుకుంటారు.
(మీకో రహస్యం చెప్పనా ..మీరు ఎంత బాగా తిరిగితే వై.ఎస్.కు అంతగా లాభం చేకూర్చిన వారవుతారు. వ్యతిరేక ఓట్ల మీద ఆశతో తె.దే.పా బరిలో ఉంది. ఆ వ్యతిరేక ఓట్లను మీరు ఎంతగా చీచితే వై.ఎస్.,కాంగ్రెస్ పార్టీలకు అంతగా లాభం..కీప్ ఇట్ అప్)

No comments:

Post a Comment